కలహం దిశగా కేసీఆర్, జగన్ స్నేహం

Publish Date:Jun 24, 2022

Advertisement

ఒకే కుటుంబంలా వున్న‌వారు విడిపోయారు. అందుకు కార‌ణాలు,  ల‌క్ష్యాలు ఏమ‌యినా  అలా జ‌రిగిపోయింది.  అయినా స‌హాయ‌స‌హ‌కాలు అందిపుచ్చుకుంటూ క‌ల‌కాలం స్నేహ‌భావంతోనే వుండాల‌ని అనుకున్నారు. తొలినాళ్ల‌లో కాస్తంత ఆలాగే సాగింది. క్ర‌మేపీ ఆంధ్ర‌రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు కేసుల గుదిబండ చుట్టి కోర్టులు, కేంద్ర చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేయిస్తున్నారు. మ‌రో వంక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప టికే అభివృద్ధి ప‌థంలో వున్నాం గ‌నుక ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌న్న ధీమాతో వున్నారు.

కానీ కాలం గడిచే కొద్దీ తానొక‌టి త‌లిస్తే కేంద్రం ఒక‌టి త‌ల‌చింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాలు  అన్యాయంగా పాల‌న అందిస్తున్నాయ‌ని, త‌మ స‌హకారాన్ని చుల‌క‌న‌గా చూస్తున్నాయ‌న్న క‌క్ష‌తో రెండు రాష్ట్రాల్లోనూ రాజ్య‌ధికారం చేజిక్కించుకోవాల‌ని అన్నింటా అడ్డుప‌డుతూ సంక్షోభాన్ని సృష్టించింది. ఈ వేడిలో అన్న ద‌మ్మ‌ల్లాంటి తెలుగు ప్ర‌జ‌లు, నాయ‌కుల మ‌ధ్య వైరం పెరిగింది. దీనికి తోడు తాజాగా కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వానికి  మ‌ద్ద‌తునివ్వాల్సిన  ప‌రిస్థితుల్లో జ‌గ‌న్‌, అంత అవ‌స‌ర‌మే లేద‌న్న ధీమాతో కేసీఆర్  చెరో  వేపు విడిపోయారు.  కేసులు, ఇ.డి. త‌ల‌నొప్పుల భ‌యంతో జ‌గ‌న్ మోదీ స‌ర్కారు ఎదుట సాగిల‌ప‌డ‌డం త‌ప్ప రాష్ట్రానికి  ఈ మూడేళ్ల‌లో  ప్ర‌త్యేకించి వొర‌గ‌బెట్టిందేమీ లేదు. రాను రాను ఈ  ర‌హ‌స్యం ఆంధ్రాలో సామాన్యుల‌కీ తెలిసి పోయింది. అన్నీ ప్ర‌గ‌ల్భాలే త‌ప్ప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన వాగ్దానాలేవీ చేసి చూప‌లేని  స్థితికి దిగ‌జారాడ‌న్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. కానీ అటువేపు ప్ర‌జ‌ల విశ్వాసం కాస్తంత స‌డ‌లినా కేంద్రం నుంచి పూచిక‌పుల్ల సాయం అంద‌లేద‌ని, పైగా ద‌బాయింపులు ఎక్కువ‌య్యాయ‌ని  రివ‌ర్స్ గేర్‌లో కేసీఆర్  త‌న మంత్రుల‌తో, ఎమ్మెల్యేల‌తో మోదీ స‌ర్కార్ మీద తిట్ల దండ‌కం దాదాపు రోజూ వినిపిస్తున్నారు.

కేంద్రం త‌న మంత్రులు, ఎమ్మెల్యేల‌తో ప‌ర్య‌ట‌న‌లు చేయించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితుల మీద పాల‌నా లోపాల మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సిగ్గెగ్గులేల నాకు  అంటూ జ‌గ‌న్  బిజెపీ తిట్ల‌ను, విమ‌ర్శల‌ను దులిపేసుకుంటూ త‌న‌కు ప‌దవే ముఖ్యం..  తిట్లు ఓ లెక్కా అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ ప‌రిస్థితులు జారిపోతున్నాయ‌న్న సంగ‌తి ప్ర‌జ‌ల‌కు తెలుస్తోంది. జ‌గ‌న్ వ‌ల్ల జ‌రిగేదేమీ లేద‌ని స్ప‌ష్ట‌మయింది.  ఇటు తెలంగాణాలోనూ బిజెపి నాయ‌కులు కేసీఆర్ ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల విసుర్లు విసురుతున్నారేగాని అందుకు కేటీఆర్ దీట‌యిన స‌మాధానాలు ఇస్తూ భ‌యంతో వొణుకుతున్న‌వారి ద‌గ్గ‌ర కెళ్లి ఈ తాటాకు శ‌బ్దాలు చేయ మ‌ని బిజెపి వ‌ర్గీయులకే సూచ‌న‌లు చేస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వేళయింది. జ‌గ‌న్‌  త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బిజెపి కూట‌మి నిల‌బెట్టిన అభ్య‌ర్ధి ద్రౌప‌ది మూర్మికే త‌మ మ‌ద్ద‌తు అని ప్ర‌క‌టించారు.

ఇది వీరికి త‌ప్పని స్థితి. కానీ  ఒక మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తి చేయ‌డంలో త‌ప్పేమీ లేద‌న్న అభిప్రాయంలో వున్న‌ప్ప‌టికీ  కేసీఆర్ మాత్రం విప‌క్ష‌ కూట‌మి అభ్య‌ర్ధి య‌శ్వంత్ సిన్హాకే మ‌ద్ద‌తు ప్ర‌క‌టిం చారు. ఇలా రాష్ట్రపతి పదవికి త్వరలో జరగనున్న ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాలమధ్య రాజకీయంగా చిచ్చు రేపేటట్లు కనిపిస్తోంది.  రెండు రాష్ట్రాల మధ్య రోడ్డున పడాల్సినంత సమస్యలు ఏమీ ఇప్పటి వరకు పెద్దగా ఎదురు కాలేదు. కానీ జులై18న  జ‌రిగే  ఎన్నిక జ‌గ‌న్‌, కేసీఆర్ ల మ‌ధ్య  ముఖ్య మంత్రుల స్థాయిలో విభేదాలు సృష్టిస్తాయేమో అన్న అనుమానాన్ని పరిశీల కులు వ్యక్తపరుస్తున్నారు.  ఎందుకంటే ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ ప్రధాని బాటలో నడుస్తుంటే. తెలం గాణా ముఖ్యమంత్రి  దేశంలోని  ప్రతిపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ అగ్రనేత యశ్వంతిన్హా కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.  రాష్ట్రపతి పదవి కోసం పోటీపడుతూ బరిలో దిగిన య‌శ్వంత్  నేటి రాజకీయాలలో ఎవరితో పోల్చుకున్నా ఆయన కొండ గుట్టల మధ్య శిఖరసమానుడు. ఆయనను తెలంగాణ ముఖ్య మంత్రి  కేసీఆర్ సమర్ధిస్తున్నారు.  

తెలంగాణ నేతలు అప్పుడ ప్పుడూ, అక్కడక్కడా జగన్ పైనా, జగన్ ప్రభుత్వం పైనా నోళ్ళు పారేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల కేటీఆర్ కూడా ఆంధ్రాలోని రోడ్ల దుస్థితిని గురించి ఘాటు గానే విమర్శించారు. ఆ తరువాత తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దావోస్ సదస్సులో జగన్ - కేటీఆర్ లిద్దరూ కౌగిలించుకుని మరీ ఫోటోలు దిగి తమ  సఖ్యతను ప్రదర్శించుకు న్నారు. ఇప్పుడు  మళ్ళీ తాజాగా తెలంగాణ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి  ఒక  సభలో మాట్లాడుతూ ‘ఆంధ్రలో జగన్మోహన్రెడ్డి ఉన్నడు.. వాడు అడుక్కుతింటాన్డు. మనల్ని అన్నరు తెలంగాణ వస్తే మీరు అడుక్కుతింటరు అని... ఇప్పుడు ఆంధ్రోళ్ళు బిచ్చమె త్తుకుంటున్నరు, రోజు నడవాలంటే కేంద్రం నుండి లోన్ రావాల వాళ్లకు, లేదంటే నడవదారాష్ట్రం'... అంటూ ఘాటైనమాటలతో బహిరంగంగా తూల నాడడం, కేసీర్ మైండ్ సెట్‌ని తెలియ‌జేస్తున్నద‌ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. కేసీఆర్ - కేటీఆర్లకు ముందస్తు సమాచారం లేకుండా తెరాస రాజకీయాలలో ఓ అనామకుడు  ఆంధ్రా ముఖ్యమంత్రిని 'వాడు... వీడు....' అని సంబోధించే స్థాయికి వెళ్ళగలడా అన్నది కూడా పరిశీలకుల అనుమానం. ఈ అనుమానంలో ఏమాత్రం నిజం ఉన్నా రెండు రాష్ట్రాల నేతలు, ప్రజల మధ్య పెద్ద  అపార్ధాలకు, అన ర్ధాలకు దారితీసే అవకాశాలు బలంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 30 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో సంఖ్యాపరంగా ఆంధ్రా ప్రజలు ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య వారధులుగా ఉన్న వారి మనోభావాలు గాయపడకుండా చూసుకోవలసిన బాధ్యత తెలం గాణ నేతలు, ప్రభుత్వంపై  ఉందనడంలో సందేహం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని  తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.  మొన్నటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న తెలుగువాళ్ళు కాపురాలు వేరైనా కలహాలులేకుండా ఉండాలన్నది అందరి ఆశ, ఆకాంక్ష. 

By
en-us Political News

  
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.