క‌ష్టాల్లో బీఆర్ఎస్‌.. చేతులెత్తేసిన కేసీఆర్‌?

Publish Date:Jan 8, 2025

Advertisement

బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.  ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక‌రి త‌రువాత ఒక‌రు జైలుకెడుతున్నారు. త్వ‌ర‌లో కేటీఆర్ కూడా జైలుకెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ భ‌విష్య‌త్ పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ప‌రిస్థితి ఇలానే ఉంటే రాబోయే కాలంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో బీఆర్ఎస్ ప్ర‌భావం ఇసుమంత కూడా ఉండ‌ద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల‌ను, క్యాడర్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్నది. అయితే  కొంద‌రు పార్టీ నేత‌లు మాత్రం కేసీఆర్ పై ఆశ‌లు పెట్టుకున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పాలిటిక్స్‌లో మ‌ళ్లీ యాక్టివ్ అవుతార‌ని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ద‌బిడిదిబిడే అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ  బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. కేసీఆర్ రాజ‌కీయాల నుంచి పూర్తిగా ప‌క్క‌కు త‌ప్పుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి నాటి నుంచి రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉండడం లేదు. కేటీఆర్ అరెస్టు అయినా కూడా కేసీఆర్‌ బ‌య‌ట‌కు రాక‌పోవ‌చ్చున‌ని, హ‌రీశ్‌, క‌విత‌లే పార్టీ బాధ్య‌త‌లు తీసుకోబోతున్నార‌న్న చ‌ర్చ బీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. మ‌రోవైపు, కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే జిల్లాల వారిగా నేత‌లు ఆయ‌న్ను క‌లిసి జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారిపోతోంద‌నీ, మీరు పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్ కావాల‌ని విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప‌దేళ్లు పాలించిన కేసీఆర్‌,  2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారాన్ని కోల్పోయారు. ఆ త‌రువాత  ఆయ‌న ఇంట్లో స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురై కొన్ని రోజులు బెడ్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. పార్లమెంట్ ఎన్నికల స‌మ‌యంలో ప‌లు బ‌హింగ స‌భ‌ల్లో పాల్గొని కేసీఆర్ ప్ర‌సంగించారు. పార్ల‌మెంట్ ఫలితాలు వచ్చినప్పటి నుండి కేసీఆర్ అసలు బయటకు రావడం లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కుకూడా కేసీఆర్ హాజ‌రు కాలేదు. అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు మాత్రం అసెంబ్లీకి హాజ‌రైన కేసీఆర్‌.. కాంగ్రెస్ పార్టీది చెత్త‌ బ‌డ్జెట్ అంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌ నుంచి ప్ర‌తీరోజూ అసెంబ్లీకి వ‌స్తాన‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వ  త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను చీల్చిచెండాడ‌తాన‌ని చెప్పుకొచ్చారు. కానీ, కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాకుండా డుమ్మా కొడుతున్నారు.   కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన అనుభవం మాకు మార్గదర్శకంగా ఉంటుందని ప‌లుసార్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించినా కేసీఆర్ పట్టించుకోలేదు. అసెంబ్లీకి ముఖం చాటేశారు. అటు పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ ఎక్కడా కేసీఆర్ కనిపించడంలేదు.  పార్టీ నేతలు ఎవరైనా ఇంటికి వెళ్లి కలిస్తే వారితో మాట్లాడి పంపిచేస్తున్నారు. ఒక్కసారి మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలో చేరికలు అంటూ కొంత మందిని తీసుకు వచ్చారు. వారితో మాట్లాడారు. ఆ వీడియో రిలీజ్ అయింది. అది అధికారిక వీడియో కాదు. ఓ వ్యక్తి ఫోన్లో  తీసిన వీడియో. మొత్తం మీద కేసీఆర్ ఇప్పుడప్పుడే బయటకు రావాలని అనుకోవడం లేదు.

కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై సుమారు ఐదు నెల‌లు జైలు జీవితం గ‌డిపారు. ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ స‌మ‌యంలో కేసీఆర్ తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురైన‌ట్లు ఆ పార్టీ నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో  పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కేటీఆర్ అరెస్టు కాబోతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలోనూ కేసీఆర్ ఆందోళ‌నలో ఉన్నారని అంటున్నారు. అయితే, 2025 జనవరి  నుంచి కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారని గ‌తంలో ప‌లుసార్లు కేటీఆర్ పేర్కొన్నారు. కానీ, ఆ ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌టంతో పార్టీ శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్న‌ప్ప‌టికీ ప‌రిస్థితి అందుకు విరుద్దంగా క‌నిపిస్తోంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ లేదా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఏసీబీ పెట్టిన ఫార్ములా ఈ-కారు కేసును కొట్టివేయాల‌ని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటీష‌న్ ను కోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇహనో ఇప్పుడో కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ బాధ్య‌త‌ల‌ను హ‌రీశ్ రావు, క‌విత భుజానికెత్తుకోనున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే క‌నీసం ఆరేడు నెల‌ల్లు లేదా ఇంకా ఎక్కువ కాలం  జైల్లో ఉండే అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్ స‌ర్కార్‌ దూకుడు ముందు హ‌రీశ్ రావు, క‌విత సార‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ  ఏ మేర‌కు నిల‌దొక్కుకోగ‌ల‌దన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద పార్టీ  కష్టాల్లో ఉన్నా కేసీఆర్ బయటకు రావడం లేదంటే పార్టీ విషయంలో ఆయన చేతులెత్తేసినట్లే కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది. 

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యి.. కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కాకుండా ఉంటే బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కొంద‌రు నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలో చేరేందుకు వారు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కేటీఆర్ అరెస్ట్ అయిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను తెర‌పైకి తెచ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు.. ఈ క్ర‌మంలో భారీ సంఖ్య‌లో జిల్లాల వారిగా బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో బీఆర్ ఎస్ పార్టీని కాపాడుకోవాలంటే కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ ఆ పార్టీ నేత‌ల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ మాత్రం ఇక నావ‌ల్ల కాదు అన్న‌ట్లుగా చేతులెత్తేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఆ చ‌ర్చే నిజ‌మైతే రాబోయే కాలంలో బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగు కావ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న ఉంది.

By
en-us Political News

  
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.