క‌ష్టాల్లో బీఆర్ఎస్‌.. చేతులెత్తేసిన కేసీఆర్‌?

Publish Date:Jan 8, 2025

Advertisement

బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.  ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక‌రి త‌రువాత ఒక‌రు జైలుకెడుతున్నారు. త్వ‌ర‌లో కేటీఆర్ కూడా జైలుకెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ భ‌విష్య‌త్ పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ప‌రిస్థితి ఇలానే ఉంటే రాబోయే కాలంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో బీఆర్ఎస్ ప్ర‌భావం ఇసుమంత కూడా ఉండ‌ద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల‌ను, క్యాడర్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్నది. అయితే  కొంద‌రు పార్టీ నేత‌లు మాత్రం కేసీఆర్ పై ఆశ‌లు పెట్టుకున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పాలిటిక్స్‌లో మ‌ళ్లీ యాక్టివ్ అవుతార‌ని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ద‌బిడిదిబిడే అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ  బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. కేసీఆర్ రాజ‌కీయాల నుంచి పూర్తిగా ప‌క్క‌కు త‌ప్పుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి నాటి నుంచి రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉండడం లేదు. కేటీఆర్ అరెస్టు అయినా కూడా కేసీఆర్‌ బ‌య‌ట‌కు రాక‌పోవ‌చ్చున‌ని, హ‌రీశ్‌, క‌విత‌లే పార్టీ బాధ్య‌త‌లు తీసుకోబోతున్నార‌న్న చ‌ర్చ బీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. మ‌రోవైపు, కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే జిల్లాల వారిగా నేత‌లు ఆయ‌న్ను క‌లిసి జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారిపోతోంద‌నీ, మీరు పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్ కావాల‌ని విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప‌దేళ్లు పాలించిన కేసీఆర్‌,  2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారాన్ని కోల్పోయారు. ఆ త‌రువాత  ఆయ‌న ఇంట్లో స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురై కొన్ని రోజులు బెడ్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. పార్లమెంట్ ఎన్నికల స‌మ‌యంలో ప‌లు బ‌హింగ స‌భ‌ల్లో పాల్గొని కేసీఆర్ ప్ర‌సంగించారు. పార్ల‌మెంట్ ఫలితాలు వచ్చినప్పటి నుండి కేసీఆర్ అసలు బయటకు రావడం లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కుకూడా కేసీఆర్ హాజ‌రు కాలేదు. అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు మాత్రం అసెంబ్లీకి హాజ‌రైన కేసీఆర్‌.. కాంగ్రెస్ పార్టీది చెత్త‌ బ‌డ్జెట్ అంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌ నుంచి ప్ర‌తీరోజూ అసెంబ్లీకి వ‌స్తాన‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వ  త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను చీల్చిచెండాడ‌తాన‌ని చెప్పుకొచ్చారు. కానీ, కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాకుండా డుమ్మా కొడుతున్నారు.   కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన అనుభవం మాకు మార్గదర్శకంగా ఉంటుందని ప‌లుసార్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించినా కేసీఆర్ పట్టించుకోలేదు. అసెంబ్లీకి ముఖం చాటేశారు. అటు పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ ఎక్కడా కేసీఆర్ కనిపించడంలేదు.  పార్టీ నేతలు ఎవరైనా ఇంటికి వెళ్లి కలిస్తే వారితో మాట్లాడి పంపిచేస్తున్నారు. ఒక్కసారి మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలో చేరికలు అంటూ కొంత మందిని తీసుకు వచ్చారు. వారితో మాట్లాడారు. ఆ వీడియో రిలీజ్ అయింది. అది అధికారిక వీడియో కాదు. ఓ వ్యక్తి ఫోన్లో  తీసిన వీడియో. మొత్తం మీద కేసీఆర్ ఇప్పుడప్పుడే బయటకు రావాలని అనుకోవడం లేదు.

కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై సుమారు ఐదు నెల‌లు జైలు జీవితం గ‌డిపారు. ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ స‌మ‌యంలో కేసీఆర్ తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురైన‌ట్లు ఆ పార్టీ నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో  పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కేటీఆర్ అరెస్టు కాబోతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలోనూ కేసీఆర్ ఆందోళ‌నలో ఉన్నారని అంటున్నారు. అయితే, 2025 జనవరి  నుంచి కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారని గ‌తంలో ప‌లుసార్లు కేటీఆర్ పేర్కొన్నారు. కానీ, ఆ ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌టంతో పార్టీ శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్న‌ప్ప‌టికీ ప‌రిస్థితి అందుకు విరుద్దంగా క‌నిపిస్తోంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ లేదా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఏసీబీ పెట్టిన ఫార్ములా ఈ-కారు కేసును కొట్టివేయాల‌ని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటీష‌న్ ను కోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇహనో ఇప్పుడో కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ బాధ్య‌త‌ల‌ను హ‌రీశ్ రావు, క‌విత భుజానికెత్తుకోనున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే క‌నీసం ఆరేడు నెల‌ల్లు లేదా ఇంకా ఎక్కువ కాలం  జైల్లో ఉండే అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్ స‌ర్కార్‌ దూకుడు ముందు హ‌రీశ్ రావు, క‌విత సార‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ  ఏ మేర‌కు నిల‌దొక్కుకోగ‌ల‌దన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద పార్టీ  కష్టాల్లో ఉన్నా కేసీఆర్ బయటకు రావడం లేదంటే పార్టీ విషయంలో ఆయన చేతులెత్తేసినట్లే కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది. 

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యి.. కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కాకుండా ఉంటే బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కొంద‌రు నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలో చేరేందుకు వారు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కేటీఆర్ అరెస్ట్ అయిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను తెర‌పైకి తెచ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు.. ఈ క్ర‌మంలో భారీ సంఖ్య‌లో జిల్లాల వారిగా బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో బీఆర్ ఎస్ పార్టీని కాపాడుకోవాలంటే కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ ఆ పార్టీ నేత‌ల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ మాత్రం ఇక నావ‌ల్ల కాదు అన్న‌ట్లుగా చేతులెత్తేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఆ చ‌ర్చే నిజ‌మైతే రాబోయే కాలంలో బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగు కావ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న ఉంది.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.