Publish Date:Apr 24, 2024
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట. పాపం బల్లికి బయటి వాళ్ళ భవిష్యత్తు చెప్పడం తెలుసుగానీ, తన భవిష్యత్తే తనకు తెలియదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి కూడా కుడితి తొట్టెలో పడ్డ బల్లి తరహాలోనే వుంది. తన అధికారం ఊడిపోయే వరకు తనకు తెలియలేదుగానీ, ఏపీ ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందని ఈయనగారు జోస్యం చెబుతున్నారు. వైసీపీ గెలుస్తుందన్న సమాచారం తన దగ్గర వుందట. కేసీఆర్కి ఆ సమాచారం ఏ తల మాసినవాడు ఇచ్చాడో! ‘నా దగ్గర సమాచారం వుంది’, ‘సరైన సమయంలో బయటపెడతా’ లాంటి పడికట్టు పదాలు ఇక కేసీఆర్ మానుకుంటే మంచింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని ఏపీలో జనాలు చెబుతున్నారు. నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైపీపీ పని ఖతం అని తేలిపోయింది. మరి ఫామ్ హౌస్లో పడుకునే కేసీఆర్కి అంత గొప్ప సమాచారం ఇచ్చిందెవరో! ఈయన ఒక సిద్ధాంతి.. ఈయనకి సమాచారం ఇచ్చినాయన ఒక వేదాంతి. సాధారణంగా బల్లి కుడితి తొట్టెలో పడకముందు శకునాలు చెబుతుంది. కుడితి తొట్టెలో పడిన తర్వాత శకునాలు చెప్పడాలేవీ వుండవు. కేసీఆర్ మాత్రం కుడితి తొట్టెలో పడిన తర్వాత కూడా శకునాలు చెప్పడమే ఇక్కడ వింత.
కేసీఆర్కి మొదటి నుంచీ ఏపీ అన్నా, చంద్రబాబు అన్నా ద్వేషం. ఏపీ సర్వనాశనం అయిపోతే కేసీఆర్ కళ్ళు చల్లగా వుంటాయి. గత ఐదేళ్ళలో జగన్తో కలసి తన కళ్ళను చల్లగా చేసుకున్న కేసీఆర్, మరో ఐదేళ్ళు ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక తమరి పప్పులు ఉడకవు కేసీఆర్.. ఈ ఎన్నికల తర్వాత మీరు, జగన్ కలసి భజన చేసుకుంటూ కూర్చోవాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-false-prediction-on-ap-elections-39-174417.html
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు
40 ఏళ్లుగా హైద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్న మజ్లిస్ పార్టీకి ఈ లోకసభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ( సాలార్) తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు. కొద్ది నెలల క్రితం వరకూ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు.
ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే