Publish Date:Apr 26, 2022
కొన్ని రోజులుగా ఒకటే హడావుడి. పీకే కాంగ్రెస్లో చేరుతారంటూ ప్రచారం. ఇక హస్తానికి మళ్లీ మంచి రోజులు వస్తాయంటూ ఊహాగానాలు. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారనే వాదన. మరి, కేసీఆర్ పరిస్థితి ఏంటంటూ విశ్లేషణ. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తారంటూ బ్రేకింగ్ న్యూస్. నాలుగు రోజుల పాటు ధూంధాంగా నడిచింది ప్రశాంత్ కిశోర్ ఎపిసోడ్. అంత రాగం తీసి.. తాజాగా తుస్సుమనిపించారు ఆ ఐప్యాక్ ఓనర్. కాంగ్రెస్లో చేరేది లేదంటూ.. కావాలంటే తన సేవలు కొనుక్కోవచ్చంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. తనకంటే.. నాయకత్వం, ఐక్యత, ప్రక్షాళన.. హస్తం పార్టీని గెలిపిస్తుందంటూ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. పీకే కాంగ్రెస్లో చేరడం లేదనే వార్త విని.. కొందరు హమ్మయ్య అని కూడా ఊపిరిపీల్చుకునే ఉంటారు.
అదేంటి, పీకే ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అనే అనుమానం రాకమానదు. అడక్కుండానే.. పలు సర్వేలు చేసి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితిని విశ్లేషించి.. గెలవాలంటే ఏమేం చేయాలో ఆలోచించి.. సోనియాను కలిసి.. కాంగ్రెస్ పెద్దలకు వాస్తవం అర్థమయ్యేలా ప్రజెంటేషన్ ఇచ్చొచ్చారు. ఆ ప్రదర్శనకు ముగ్థులైన 10 జన్పథ్.. పీకే సలహాలు, సూచనల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక కమిటీ కూడా నియమించి చర్చించింది. పీకే తాను కాంగ్రెస్లో చేరుతానని చెప్పినా.. ఐప్యాక్ సేవలు మరోపార్టీకి అందించనంటేనే చేర్చుకోవాలంటూ సో కాల్డ్ సీనియర్స్ ఆయన చేరికకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనగా.. లేటెస్ట్గా హస్తానికి హ్యాండ్ ఇస్తున్నట్టు పీకే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? ప్రశాంత్ కిశోర్లో ఈ మార్పుకు కారణం ఎవరు? అంటే.. అంతా కేసీఆర్ వైపే చూస్తున్నారు.
అవును, పీకే ఢిల్లీ కాంగ్రెస్కు ప్రజెంటేషన్ ఇచ్చాక.. ఆ వెంటనే హైదరాబాద్ వచ్చి.. రెండు రోజుల పాటు ప్రగతిభవన్లో మకాం వేసి.. సీఎం కేసీఆర్తో మారథాన్ మంతనాలు జరిపారు. అంత ముఖ్యమైన చర్చలు ఏం చేశారో అంటూ అంతా ఆసక్తి కనబరిచారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసేలా గులాబీ బాస్ను పీకే ఒప్పిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, లోపల జరిగింది వేరని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. "అరే పీకే.. నువ్ రాజకీయాల్లో బచ్చేగాడివి.. నేను నీకంటే సీనియర్. ప్రస్తుతం మోదీని కొట్టే మొనగాడు లేడు. ఆ ముసలి కాంగ్రెస్తో కలిస్తే.. నీకు లాభం లేదు. నా మాట విను. కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్ర మాత్రమే. ఆ పార్టీని నీతో సహా ఎవడూ పైకి లేపలేడు. హస్తం పని ఖతం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీవెంట నేనున్నా. కాంగ్రెస్ వద్దు. ప్రాంతీయ పార్టీలే ముద్దు. రీజినల్ పార్టీలకు ఐప్యాక్ సేవలు అమ్ముకో. బాగా డబ్బు సంపాదించుకో. అనవసరంగా హస్తాన్ని నమ్ముకొని ఆగమాగం కాకు".. అంటూ ప్రశాంత్ కిశోర్కే కేసీఆర్ హితోపదేశం చేశారని అంటున్నారు. కేసీఆర్తో రెండు రోజుల పాటు బ్రెయిన్ వాష్ చేయించుకున్న పీకే.. ఢిల్లీ వెళ్లి.. కూల్గా ఆలోచించి.. కాంగ్రెస్లో చేరనంటూ ప్రకటించేసి.. కేసీఆర్కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారని సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-effect-on-pk-25-135027.html
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
జగన్ సామ్రాజ్యంగా చెప్పుకునే కడప లోక్ సభ స్థానంలో ఈ సారి ఆయన పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుందా? అంటే స్థానికులు ఔననే అంటున్నారు. ఈ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోటే ఇక్కడ వైసీపీ గ్రాఫ్ దిగజారడం ఆరంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రచార పర్వం ఈ శనివారం (మే 11) సాయంత్రంతో ముగియనుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ దశలో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా సీని పరిశ్రమ వారు రంగంలోకి దిగి పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దూకడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు. అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి.
చింతమనేని విజయం ఖాయమని స్థానికులు అనుకుంటున్నారు. ఈ సారి, లండన్ బాబును లండన్ పంపించి, తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో చింతమనేని ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జగన్ చెబుతున్న అబద్ధాలు విని జనం చీదరించుకుంటున్నారు. వీటికంటే ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తున్న అంశం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారికూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే ఆయనకు చిరాకు కాబోలు.. ఛీఛీ నేనా.. తెలుగు మీడియాతో మాట్లాడటమా అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నిత్యం కాకపోయినా తరచుగా మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తుంటారు.
కొట్టు సత్యనారాయణ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు
అభివృద్ధి జరగాలంటే ఆయుధం ఓటు.. ప్రజా పాలన సాగాలంటే ఆయుధం ఓటు.. అవినీతి ప్రభుత్వాలను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు.. కక్షపూరిత పాలన సాగిస్తున్న ప్రభుత్వం మెడలు వంచాలన్నా ఆయుధం ఓటే.. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆయుధం ఓటు.. ఆ ఆయుధం మన చేతుల్లోనే ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు ప్రభుత్వాలను చూశారు. విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
తెలుగువన్ రూపొందించిన పొలిటికల్ స్పూఫ్ షార్ట్ ఫిలిమ్ గ్యాంగ్స్ ఆఫ్ గగన్ యూట్యూబ్లో ట్రెండింగ్లో వుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్ధంలో ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చి అస్త్ర సన్యాసం చేసేశారా? ఎన్నికలు నాలుగు రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. పోటీలో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి నాయకుడూ.. ఈ నాలుగు రోజులూ విశ్రాంతి గురించి ఆలోచించకుండా ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.