Publish Date:Apr 26, 2022
కొన్ని రోజులుగా ఒకటే హడావుడి. పీకే కాంగ్రెస్లో చేరుతారంటూ ప్రచారం. ఇక హస్తానికి మళ్లీ మంచి రోజులు వస్తాయంటూ ఊహాగానాలు. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారనే వాదన. మరి, కేసీఆర్ పరిస్థితి ఏంటంటూ విశ్లేషణ. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తారంటూ బ్రేకింగ్ న్యూస్. నాలుగు రోజుల పాటు ధూంధాంగా నడిచింది ప్రశాంత్ కిశోర్ ఎపిసోడ్. అంత రాగం తీసి.. తాజాగా తుస్సుమనిపించారు ఆ ఐప్యాక్ ఓనర్. కాంగ్రెస్లో చేరేది లేదంటూ.. కావాలంటే తన సేవలు కొనుక్కోవచ్చంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. తనకంటే.. నాయకత్వం, ఐక్యత, ప్రక్షాళన.. హస్తం పార్టీని గెలిపిస్తుందంటూ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. పీకే కాంగ్రెస్లో చేరడం లేదనే వార్త విని.. కొందరు హమ్మయ్య అని కూడా ఊపిరిపీల్చుకునే ఉంటారు.
అదేంటి, పీకే ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అనే అనుమానం రాకమానదు. అడక్కుండానే.. పలు సర్వేలు చేసి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితిని విశ్లేషించి.. గెలవాలంటే ఏమేం చేయాలో ఆలోచించి.. సోనియాను కలిసి.. కాంగ్రెస్ పెద్దలకు వాస్తవం అర్థమయ్యేలా ప్రజెంటేషన్ ఇచ్చొచ్చారు. ఆ ప్రదర్శనకు ముగ్థులైన 10 జన్పథ్.. పీకే సలహాలు, సూచనల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక కమిటీ కూడా నియమించి చర్చించింది. పీకే తాను కాంగ్రెస్లో చేరుతానని చెప్పినా.. ఐప్యాక్ సేవలు మరోపార్టీకి అందించనంటేనే చేర్చుకోవాలంటూ సో కాల్డ్ సీనియర్స్ ఆయన చేరికకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనగా.. లేటెస్ట్గా హస్తానికి హ్యాండ్ ఇస్తున్నట్టు పీకే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? ప్రశాంత్ కిశోర్లో ఈ మార్పుకు కారణం ఎవరు? అంటే.. అంతా కేసీఆర్ వైపే చూస్తున్నారు.
అవును, పీకే ఢిల్లీ కాంగ్రెస్కు ప్రజెంటేషన్ ఇచ్చాక.. ఆ వెంటనే హైదరాబాద్ వచ్చి.. రెండు రోజుల పాటు ప్రగతిభవన్లో మకాం వేసి.. సీఎం కేసీఆర్తో మారథాన్ మంతనాలు జరిపారు. అంత ముఖ్యమైన చర్చలు ఏం చేశారో అంటూ అంతా ఆసక్తి కనబరిచారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసేలా గులాబీ బాస్ను పీకే ఒప్పిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, లోపల జరిగింది వేరని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. "అరే పీకే.. నువ్ రాజకీయాల్లో బచ్చేగాడివి.. నేను నీకంటే సీనియర్. ప్రస్తుతం మోదీని కొట్టే మొనగాడు లేడు. ఆ ముసలి కాంగ్రెస్తో కలిస్తే.. నీకు లాభం లేదు. నా మాట విను. కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్ర మాత్రమే. ఆ పార్టీని నీతో సహా ఎవడూ పైకి లేపలేడు. హస్తం పని ఖతం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీవెంట నేనున్నా. కాంగ్రెస్ వద్దు. ప్రాంతీయ పార్టీలే ముద్దు. రీజినల్ పార్టీలకు ఐప్యాక్ సేవలు అమ్ముకో. బాగా డబ్బు సంపాదించుకో. అనవసరంగా హస్తాన్ని నమ్ముకొని ఆగమాగం కాకు".. అంటూ ప్రశాంత్ కిశోర్కే కేసీఆర్ హితోపదేశం చేశారని అంటున్నారు. కేసీఆర్తో రెండు రోజుల పాటు బ్రెయిన్ వాష్ చేయించుకున్న పీకే.. ఢిల్లీ వెళ్లి.. కూల్గా ఆలోచించి.. కాంగ్రెస్లో చేరనంటూ ప్రకటించేసి.. కేసీఆర్కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారని సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-effect-on-pk-25-135027.html
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభం కాకమునుపే హైదరాబాద్ లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయోనన్న ఆందోళన ఎక్కువైంది. ఎండలతో మండిపోతున్న హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షం చేదు అనుభవాన్ని మిగిల్చింది
తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో