Publish Date:Apr 26, 2022
కొన్ని రోజులుగా ఒకటే హడావుడి. పీకే కాంగ్రెస్లో చేరుతారంటూ ప్రచారం. ఇక హస్తానికి మళ్లీ మంచి రోజులు వస్తాయంటూ ఊహాగానాలు. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారనే వాదన. మరి, కేసీఆర్ పరిస్థితి ఏంటంటూ విశ్లేషణ. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తారంటూ బ్రేకింగ్ న్యూస్. నాలుగు రోజుల పాటు ధూంధాంగా నడిచింది ప్రశాంత్ కిశోర్ ఎపిసోడ్. అంత రాగం తీసి.. తాజాగా తుస్సుమనిపించారు ఆ ఐప్యాక్ ఓనర్. కాంగ్రెస్లో చేరేది లేదంటూ.. కావాలంటే తన సేవలు కొనుక్కోవచ్చంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. తనకంటే.. నాయకత్వం, ఐక్యత, ప్రక్షాళన.. హస్తం పార్టీని గెలిపిస్తుందంటూ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. పీకే కాంగ్రెస్లో చేరడం లేదనే వార్త విని.. కొందరు హమ్మయ్య అని కూడా ఊపిరిపీల్చుకునే ఉంటారు.
అదేంటి, పీకే ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అనే అనుమానం రాకమానదు. అడక్కుండానే.. పలు సర్వేలు చేసి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితిని విశ్లేషించి.. గెలవాలంటే ఏమేం చేయాలో ఆలోచించి.. సోనియాను కలిసి.. కాంగ్రెస్ పెద్దలకు వాస్తవం అర్థమయ్యేలా ప్రజెంటేషన్ ఇచ్చొచ్చారు. ఆ ప్రదర్శనకు ముగ్థులైన 10 జన్పథ్.. పీకే సలహాలు, సూచనల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక కమిటీ కూడా నియమించి చర్చించింది. పీకే తాను కాంగ్రెస్లో చేరుతానని చెప్పినా.. ఐప్యాక్ సేవలు మరోపార్టీకి అందించనంటేనే చేర్చుకోవాలంటూ సో కాల్డ్ సీనియర్స్ ఆయన చేరికకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనగా.. లేటెస్ట్గా హస్తానికి హ్యాండ్ ఇస్తున్నట్టు పీకే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? ప్రశాంత్ కిశోర్లో ఈ మార్పుకు కారణం ఎవరు? అంటే.. అంతా కేసీఆర్ వైపే చూస్తున్నారు.
అవును, పీకే ఢిల్లీ కాంగ్రెస్కు ప్రజెంటేషన్ ఇచ్చాక.. ఆ వెంటనే హైదరాబాద్ వచ్చి.. రెండు రోజుల పాటు ప్రగతిభవన్లో మకాం వేసి.. సీఎం కేసీఆర్తో మారథాన్ మంతనాలు జరిపారు. అంత ముఖ్యమైన చర్చలు ఏం చేశారో అంటూ అంతా ఆసక్తి కనబరిచారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసేలా గులాబీ బాస్ను పీకే ఒప్పిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, లోపల జరిగింది వేరని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. "అరే పీకే.. నువ్ రాజకీయాల్లో బచ్చేగాడివి.. నేను నీకంటే సీనియర్. ప్రస్తుతం మోదీని కొట్టే మొనగాడు లేడు. ఆ ముసలి కాంగ్రెస్తో కలిస్తే.. నీకు లాభం లేదు. నా మాట విను. కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్ర మాత్రమే. ఆ పార్టీని నీతో సహా ఎవడూ పైకి లేపలేడు. హస్తం పని ఖతం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీవెంట నేనున్నా. కాంగ్రెస్ వద్దు. ప్రాంతీయ పార్టీలే ముద్దు. రీజినల్ పార్టీలకు ఐప్యాక్ సేవలు అమ్ముకో. బాగా డబ్బు సంపాదించుకో. అనవసరంగా హస్తాన్ని నమ్ముకొని ఆగమాగం కాకు".. అంటూ ప్రశాంత్ కిశోర్కే కేసీఆర్ హితోపదేశం చేశారని అంటున్నారు. కేసీఆర్తో రెండు రోజుల పాటు బ్రెయిన్ వాష్ చేయించుకున్న పీకే.. ఢిల్లీ వెళ్లి.. కూల్గా ఆలోచించి.. కాంగ్రెస్లో చేరనంటూ ప్రకటించేసి.. కేసీఆర్కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారని సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-effect-on-pk-25-135027.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.