Publish Date:Nov 10, 2024
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారు నడిపారు. ఔను తన ఫామ్ హౌస్ లో బెంజ్ కారు నడిపి అందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యారు. రాజకీయంగా పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారు. మీడియాకే కాదు, పార్టీ నేతలకు, శ్రేణులకూ కూడా అందుబాటులో లేకుండా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
దీంతో పార్టీ శ్రేణులలో తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, నేతలూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కేటీఆర్, హరీష్ రావులు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆందోళనలలు చేపడుతున్నప్పటికీ, అవి పెద్దగా ప్రభావమంతంగా లేవు. కేసీఆర్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనక పోవడం, అసలు రాజకీయాలను వదిలేశారా అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో వచ్చే ఏడాది జనవరి నుంచీ తాను పార్టీ వ్యవహారాలను సీరియస్ గా పట్టించుకుంటాననీ, రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరిస్తాననీ ప్రకటించారు. ప్రజలకు ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య తేడా స్పష్టంగా తెలిసిందన్నారు. రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇద్దామన్న ఉద్దేశంతోనే ఇంత కాలం మౌనంగా ఉన్నానని చెప్పిన కేసీఆర్.. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాననీ చెప్పారు. దీంతో క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది.
అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ అన్నట్లుగా వచ్చే ఏడాది జనవరిని నుంచీ క్రీయాశీలంగా ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ పరాజయం తరువాత ఆయన ఒకే ఒక రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అదీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు. ఆ రోజు రేవంత్ సర్కార్ బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన కేసీఆర్.. ఆ తరువాత సైలెంటైపోయారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు ఇలా ఏ కీలక అంశంపైనా ఇప్పటి వరకూ నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ క్రియాశీలం అవునానని ప్రకటించినా పార్టీ నేతలలో కొందరికి నమ్మకం కుదరడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఫామ్ హౌస్ లో కారు నడిపారు. తద్వారా గ్యారేజీలోంచి కారును బయటకు తీసుకువస్తాననీ, ఇక కారు స్పీడ్ తో కాంగ్రెస్ సర్కార్ బెంబేలెత్తిపోవడం ఖాయమనీ సంకేతాలిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైగర్ ఈజ్ బ్యాక్ బీఆర్ఎస్ శ్రేణులు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కారు జోరును అడ్డుకోవడం రేవంత్ వల్ల కాదని వ్యాఖ్యలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-drives-car-in-farmhouse-25-188171.html
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.