Publish Date:Nov 10, 2024
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారు నడిపారు. ఔను తన ఫామ్ హౌస్ లో బెంజ్ కారు నడిపి అందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యారు. రాజకీయంగా పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారు. మీడియాకే కాదు, పార్టీ నేతలకు, శ్రేణులకూ కూడా అందుబాటులో లేకుండా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
దీంతో పార్టీ శ్రేణులలో తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, నేతలూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కేటీఆర్, హరీష్ రావులు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆందోళనలలు చేపడుతున్నప్పటికీ, అవి పెద్దగా ప్రభావమంతంగా లేవు. కేసీఆర్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనక పోవడం, అసలు రాజకీయాలను వదిలేశారా అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో వచ్చే ఏడాది జనవరి నుంచీ తాను పార్టీ వ్యవహారాలను సీరియస్ గా పట్టించుకుంటాననీ, రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరిస్తాననీ ప్రకటించారు. ప్రజలకు ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య తేడా స్పష్టంగా తెలిసిందన్నారు. రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇద్దామన్న ఉద్దేశంతోనే ఇంత కాలం మౌనంగా ఉన్నానని చెప్పిన కేసీఆర్.. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాననీ చెప్పారు. దీంతో క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది.
అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ అన్నట్లుగా వచ్చే ఏడాది జనవరిని నుంచీ క్రీయాశీలంగా ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ పరాజయం తరువాత ఆయన ఒకే ఒక రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అదీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు. ఆ రోజు రేవంత్ సర్కార్ బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన కేసీఆర్.. ఆ తరువాత సైలెంటైపోయారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు ఇలా ఏ కీలక అంశంపైనా ఇప్పటి వరకూ నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ క్రియాశీలం అవునానని ప్రకటించినా పార్టీ నేతలలో కొందరికి నమ్మకం కుదరడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఫామ్ హౌస్ లో కారు నడిపారు. తద్వారా గ్యారేజీలోంచి కారును బయటకు తీసుకువస్తాననీ, ఇక కారు స్పీడ్ తో కాంగ్రెస్ సర్కార్ బెంబేలెత్తిపోవడం ఖాయమనీ సంకేతాలిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైగర్ ఈజ్ బ్యాక్ బీఆర్ఎస్ శ్రేణులు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కారు జోరును అడ్డుకోవడం రేవంత్ వల్ల కాదని వ్యాఖ్యలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-drives-car-in-farmhouse-39-188170.html
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.