Publish Date:Nov 27, 2024
గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ లో ఒక విధమైన స్తబ్దత నెలకొంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావులు గళమెత్తుతున్నా, ఆందోళనలకు పిలుపు నిస్తున్నా ఎక్కడా పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోవడమే. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత, లోక్ సభ ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక జీరో రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇక ఆ తరువాత నుంచీ కేసీఆర్ పూర్తిగా మౌనమునిలా మారిపోయారు. పూర్తిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సాహం కొరవడింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై కూడా బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకున్నట్లు పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. అయితే కేసీఆర్ వచ్చే ఏడాది జనవరి నుంచి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ సర్కార్ కు ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ మౌనం వహించారనీ, ఇక రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై కేసీఆర్ గళమెత్తుతారని కేటీఆర్ చెప్పారు. అయితే ప్రజలే కాదు, పార్టీ శ్రేణులు కూడా కేటీఆర్ మాటలను పెద్దగా పట్టించుకోలేదు.
సరిగ్గా ఈ సమయంలోనే కేసీఆర్ తాను మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ రోల్ ప్లే చేస్తానని సంకేతాలు ఇచ్చారు. ఇటీవల ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో స్వయంగా కారు నడిపారు. దీని ద్వారా ఆయన మళ్లీ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించనునన్నట్లు చాటారు. బీఆర్ఎస్ పార్టీ చిహ్నమైన కారు షెడ్డుకి వెళ్లలేదనీ, సర్వీసింగ్ చేయించుకుని జోరుగా తెలంగాణ రాజకీయాలలో పరుగులు పెట్టేందుకు రెడీ అయ్యిందన్న సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-drives-car-25-189107.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.