Publish Date:Apr 24, 2022
కల్వకుంట్ల చంద్రశేఖరరావు...బీజేపై పోరాటంలో తానే చాంపియన్ అని రుజువు చేసుకుని బీజేపీ యేతర కూటమికి సారథ్యం వహించాలని కలలు కంటున్నారు. అయితే కాంగ్రెసేతర బీజేపీ యేతర కూటమి పట్ల ఇరత పార్టీలేవీ అంత సుముఖంగా లేకపోవడంతో ఆయన బాటలో ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నారు.
ఎవరూ కలిసి రావడం లేదన్న నిర్వేదంతో ఒకో సారి ఆయన ఫ్రంటూ లేదు గింటూ లేదంటూ నిర్వేదం ప్రదర్శించినా...ఏ మూలో ఆయనకు మోడీని దీటుగా ఎదుర్కొనే నేత తానేనన్న విశ్వసం ఇంకా తొలగిపోలేదు.
అయితే మోడీని బలంగా ఢీ కొనాలన్న ఆత్రంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు అంతిమంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికే దోహదపడుతుండటం గమనర్హం.
ఒక విధంగా చెప్పాలంటే...తెలంగాణలో సొంత బలం చాలా పరిమితంగా ఉండే బీజేపీ ఈ రోజున ఈ స్థితిలో ఉందంటే అది కచ్చితంగా కేసీఆర్ పుణ్యమే.
బండి సంజయ్ ఒక రోజు దీక్ష భగ్నం నుంచి తీసుకుంటే...ఆయన రాష్ట్రంలో కమలం పార్టీని నిలువరిస్తున్నానన్న పేరుతో చేసిన ప్రయత్నం, చేపట్టిన ప్రతీ చర్యా ఆ పార్టీకి బలం చేకూరడానికే దోహదపడింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రోజు దీక్ష భగ్నం కోసం పోలీసుల ప్రయోగం...ఆ పార్టీ పట్ల సానుభూతి పెరగడానికే దోహదపడింది. ఆయన అధికార కార్యాలయం గేట్లను గ్యాస్ కట్టర్ తో తొలగించి మరీ పోలీసులు లోనికి వెళ్లి అరెస్టు చేశారు. ఇది ఆశించిన దానికి ప్రతి కూల ఫలితమే ఇచ్చింది. అలాగే రైతులను పరామర్శించడానికి బండి సంజయ్ వెళ్లిన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
ఒక వైపు రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఏ నిరసన కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలు లేకుండా అడ్డంకులు కల్పిస్తూ, అనుమతులు నిరాకరిస్తూ వస్తున్న ప్రభుత్వం..అదే అధికార పార్టీ కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా, ఇంకా చెప్పాలంటే యథేచ్ఛగా చేసుకోవడానికి దార్లు బార్లా తెరిచిన పరిస్థితి.
ఈ పరిస్థితే రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళనలు చేసుకునే హక్కు, నిరసనలు తెలిపే హక్కు విపక్షాలకు లేదా అన్న సందేహం జనంలో కలగేలా చేసింది.
అదే విధంగా ధాన్యం కొనుగోలు విషయాన్ని విపరీతమైన రాద్దాంతం చేసి రైతుల్లోనూ బిజెపికి విస్తృత ప్రచారం కలిగేందుకు కేసీఆర్ తీరు దోహదపడింది. అదే సమయంలో ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని బిజెపి సద్వినియోగం చేసుకుని.. తెలంగాణలో క్రమంగా బలపడుతోంది. కేసీఆర్ బిజెపి అణచివేసేందుకు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారంటే కమలం పార్టీ ప్రజలలో ప్రచారం చేసుకుంటోంది. ఆ అవకాశాన్ని స్వయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత తమ చర్యలతో పువ్వుల్లో పెట్టి కమలానికి అందించారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించిన కేసీఆర్ ఒక్క సారిగా ఇంత వ్యతిరేకత ప్రదర్శించడం వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగి ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ప్రణాళికా బద్ధంగా బీజేపీ బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-deeds-to-control-bjp-became-plus-to-bjp-25-134872.html
ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ తన దైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూటమికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ సర్వేల్లో తేలిపోయింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు. ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు.
రాజకీయంగా సీనియర్ కూడా అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోనూ ఆయన నేర్పుగా ముందుకు సాగుతారనే పేరు తెచ్చుకున్నారు.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు.
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి ఏటా వానాకాలంలో భాగ్యనగర వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభం కాకమునుపే హైదరాబాద్ లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయోనన్న ఆందోళన ఎక్కువైంది. ఎండలతో మండిపోతున్న హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షం చేదు అనుభవాన్ని మిగిల్చింది
తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.