గిరిజనులను పార్టీకి దూరం చేసిన కేసీఆర్ నిర్ణయం!?

Publish Date:Jul 25, 2022

Advertisement

తెలంగాణలో అధికార   తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ పరంగా  గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ దెబ్బ పార్టీపై తీవ్ర ప్రభావం చూపేట్టుగా  కనిపిస్తుందనేది రాజకీయ  పరిశీలకుల అభిప్రాయం. తమ వర్గానికి చెందిన నేతకు ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ వేయలేదంటూ పార్టీ తరపున ఇంత వరకూ కీలక బాధ్యతలను నిర్వర్తించిన నేత టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం ఇదే తొలిసారి.  ఢిల్లీలో టీఆర్ఎస్ మాజీ ప్రత్యేక ప్రతినిధి, ఐఏఎస్ మాజీ అధికారి రామచంద్రు తేజావత్ పార్టీకి రాజీనామా చేశారు. గిరిజన మహిళకు దేశ చరిత్రలోనే తొలి సారిగా రాష్ట్రపతి అవకాశం వస్తే.. తెరాస మాత్రం ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రామచంద్రు తేజావత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా, అందుకు ఆయన చెప్పిన కారణం రెండూ కూడా   తెలంగాణలో హాట్ టాపిక్  అయ్యాయి. తమ వర్గానికి చెందిన నేత రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలబడితే టిఆర్ఎస్ ఆమెకు  మద్దతునివ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ గిరిజన వర్గానికి చెందిన నాయకుడు, మేధావి,  ఐఎఎస్  మాజీ అధికారి పార్టీకి రాజీనామా చేయడం  పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా బాధ కలిగించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని విస్పష్టంగా వెల్లడించిన  రామచంద్రు తేజావత్ వెల్లడించారు..తన రాజీనామాను వెంటనే  ఆమోదించాలని  పార్టీ అధినేతకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

నాయకుల మధ్య అభిప్రాయభేదాలు, అసంతృప్తి, పార్టీలో గుర్తింపునివ్వడం లేదనీ, టిక్కెట్టు రాలేదనీ రాజీనామా చేయడం లేదా వేరే పార్టీలోకి జంప్ కావడం సాధారణంగా రాజీనామాలకు కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ, తమ వర్గాని(గిరిజన)కి చెందిన నేతకు మద్దతు పలకలేదనీ,  ఓటు వేయలేదంటూ ముఖ్య బాధ్యతలను నిర్వర్తించిన ఓ ఐఏఎస్ మాజీ అధికారి ప్రకటించడం, పార్టీకి రాజీనామా చేయడం.కచ్చితంగా టీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రభావం పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా  గిరిపుత్రులను టీఆర్ఎస్ నిర్ణయం  తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయమని అంటున్నారు.

ఇక ఇప్పుడు అవకాశం దక్కకపోతే ఆదివాసి రాష్ట్రపతి అవడం కలగానే మిగిలేదని ఆయన అన్నారు. దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ను తాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశానని రామచంద్రు తేజావత్ తెలిపారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థి గా నిలిపిన ప్రధాని మోడి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా తమ వర్గానికి టిఆర్ఎస్ గుర్తింపునివ్వకపోవడంతో ఓ కీలక నేత రాజీనామా చేయడంపై సొంత పార్టీని కూడా కాస్తంత విస్మయానికి లోనుచేసినట్టు పార్టీవ ర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రాజీనామా.. ఇతర వర్గాలకు చెందిన నేతల్లోనూ ఓ ఆలోచనకు ప్రేరణగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 9 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలున్నాయి. తెలంగాణలో 9.8 శాతం ఎస్టీ జనాభా ఉంది. అయితే, తెలంగాణ మంత్రి వర్గంలో కేవలం ఒక్క మంత్రి పదవిని కేటాయించడం జరుగుతూ వస్తుంది. 2014లో జరిగిన ఎన్నికల అనంతరం జరిగిన మంత్రివర్గంలో ఆజ్మీరా చందులాల్, 2018లో జరిగిన ఎన్నికల అనంతరం సత్యవతి రాథోడ్  మంత్రి వర్గంలో ఉన్నారు. కానీ, ఓసిలకు  (రెడ్డి సామాజిక వర్గానికి   6   వెలమలకు నాలుగు) మొత్తం 10  మంత్రి పదవులు, బిసిలకు 4 మంత్రి పదవులు, ఓ ఎస్సీకి, ఓ మైనార్టీకి మంత్రి పదవులు లభించాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 9.8శాతం ఉన్న గిరిజన జనాభ ఇప్పుడు టిఆర్ఎస్ కు కాస్తంత దూరం కావడం ఖాయమని పరిశీలకలు భావిస్తున్నారు.

\ముందస్తు ప్రచారం జోరుగా ఉన్న సమయంలో  ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేయడం ఇటు పార్టీ వర్గాల్లోనూ, అటు గిరిజనుల్లోనూ, ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. ఈ పరిణామం  రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ కు గిరిజన ఓట్లు చాలా వరకు తగ్గే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా , కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి కాంగ్రెస్ తో ప్రభత్వాన్ని పంచుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రంలో అధికార పార్టీ జెఎంఎం, మహారాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగానే ఉన్న శివసేన కేడా బిజెపి బలపరిచ అభ్యర్థికే మద్దతు అంటూ ప్రకటించింది. కానీ, టిఆర్ఎస్ మాత్రం మద్దతునివ్వకపోవడంపై రాష్ట్రంలో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.