Publish Date:Jul 11, 2022
ముచ్చటగా మూడో సారి అధికారం కేసీఆర్ కు అందని ద్రాక్షగా మిగిలిపోనుందా? ఓటమి భయం కేసీఆర్ ను వెంటాడుతోంది. పార్టీ నుంచి వలసలతో ఆయన ఆందోళన చెందుతున్నారా? ఈ ప్రశ్నలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఔననే సమాధానం ఇస్తున్నారు. ఎంత దాచుకుందామని ప్రయత్నించినా కేసీఆర్ లో ఓటమి భయం దాగడం లేదంటున్నారాయన. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో చేసిన ప్రసంగమే ఆయనలోని బయాన్ని పట్టిచ్చిందని అంటున్నారు
బండి. అందుకు ఉదాహరణగా ఆయన మీడియా సమావేశంలో పదే పదే షిండే పేరు ప్రస్తావించడాన్ని బండి ఎత్తి చూపారు. వాస్తవానికి మహారాష్ట్రీయులు కూడా షిండే పేరును అన్ని సార్లు తలుచుకుని ఉండరనీ, షిండే తిరుగుబాటుతో పదవీ చ్యుతుడైన ఉద్ధవ్ ఠాక్రే నోట కూడా షిండే పేరు అన్ని సార్లు రాలేదని, కానీ కేసీఆర్ కు టీఆర్ఎస్ లో ఒకరూ, ఇద్దరూ కాదు అనేక మంది షిండేలు కనబడుతున్నారనీ అందుకే ఆయన షిండే నామస్మరణ చేస్తున్నారనీ ఎద్దేవా చేశారు.
సీఎం మోడీని పదవి నుంచి దింపేస్తామనడం తన లోని భయాన్ని దాచుకునేందుకేనన్న బండి సంజయ్ దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని సవాల్ చేశారు. ఉడత ఊపులంటూ కేసీఆర్ మోడీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందనీ, వాస్తవానికి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ కేసీఆర్ చేస్తున్న ప్రగల్భాలే ఉడుత ఊపులనీ, వాటికి బీజేపీ భయపడదనీ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లలో, బాషలో, బాడీ లాంగ్వేజిలో కనిపిస్తున్న తేడా ఆయనలోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని అన్నారు. టీఆర్ఎస్ లో తిరుగుబాటు అనివార్యమని ఊహిస్తున్న కేసీఆర్.. ముందుగానే టీఆర్ఎస్ లో ముందు ముందు జరగనున్న వలసల నెపాన్ని ఇప్పుడే బీజేపీపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
2018 ఎన్నికల తరువాత ఆయన విపక్షాలపై ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు బూమరాంగ్ అవుతుందన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందన్నారు. జాతీయ రాజకీయాలు అంటే ఆయన నేల విడిచి సాము చేస్తున్నారనీ, ఆయన వైఖరిని తెరాస శ్రేణులే తప్పుపడుతున్నాయనీ బండి పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన మూర్ఖుడిగా బండి కేసీఆర్ ను అభివర్ణించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-cant-hide-his-fear-of-defeat-25-139457.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.