Publish Date:Apr 28, 2025
తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ సభ ఏదైనా ఉందంటే... అది ఆదివారం వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవ సభ మాత్రమే. బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ జరుపుకున్న రజతోత్సవ సభకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. పార్టీ పరాజయం తరువాత కేసీఆర్ పాల్గొన్న భారీ బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం. అంతకు ముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నా.. వాటికి ఇంతటి హైపూ లేదూ, జనమూ పట్టించుకోలేదు.
కానీ బీఆర్ఎస్ (టీఅర్ఎస్) అవిర్భవించి పాతికేళ్లు పూర్తి అయిన సందర్భంగా జరిగిన ఈ బహిరంగ సభలో కేసీఆర్ దాదాపు గంట సేపు ప్రసంగించారు. ఈ ప్రసంగం మొత్తం వ్యూహాత్మకంగా సాగింది. అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో కేసీఆర్ ఇంత సుదీర్ఘ ప్రసంగం చేసిన సందర్భం లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రచార సభలలో ఒకటి రెండు సార్లు ప్రసంగించినా ఆ ప్రసంగాలన్నీ చప్పగా సాగాయి. క్లుప్తంగా ప్రసంగాన్ని ముగించేశారు.
అన్నిటి కంటే చెప్పుకోవలసిన విషయమేంటంటే గంట సేపు ప్రసంగంలో కేసీఆర్ ఒక్కటంటే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావంచలేదు. అయితే ప్రసంగం మొత్తం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విధ్వంసకరంగా ఉందని విమర్శలు గుప్పించారు. రేవంత్ సర్కార్ టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగం సాగినా రేవంత్ పేరు మాత్రం ఆయన నోటి వెంట రాలేదు. గతంలో కూడా రేవంత్ పేరు ప్రస్తావించడానికి కానీ, ఆయనను అసెంబ్లీలో చూడడానికి కానీ కేసీఆర్ ఇష్టపడలేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
ఇప్పుడు కూడా ఆయన తన నోటి వెంట రేవంత్ పేరు ఉచ్ఛరించలేదు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరు కావడానికి కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటమే కారణమని కూడా పార్టీ వర్గాలు చెబుతుంటాయి. రేవంత్ నుఅందుకే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారని అంటారు. ఇప్పుడు ఆయన తాజా ప్రసంగంలో కూడా వ్యూహాత్మకంగా రేవంత్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన పాలనను తూర్పారపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-avoid-revanth-name-in-his-one-hour-speach-39-197056.html
డీఎంకే, బీజేపీలతో పొత్తులుండవ్. మా పార్టీ సీఎం కేండెట్ నేనేనంటూ విజయ్ ప్రకటన. ఇదయ దళపతి, టీవీకే అధినేత విజయ్.. ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. తమిళ స్పీకర్ అప్పావు వంటి వారు విజయ్ మరో రజనీ కాంత్ అవుతారని భావించారు.
గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ నూతన ఆధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్. రామచంద్ర రావు, బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడితో ఇంచుమించుగా సంవత్సరం పైగా సాగుతున్న, కౌన్ బనేగా బీజేపీ అధక్ష్ కహానీలో ఒక అధ్యాయం ముగిసింది.
ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులతోపాటు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు.
అధికారులు అంటే లెక్కలేని తనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తుంది. అధికారుల పట్ల వారి దురుసు ప్రవర్తన వారి పెత్తందారి పోకడలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతల్లో పెత్తందారి పోకడలు పోలేదు అనడానికి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం.
సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.
భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి ఘన సంప్రదాయ స్వాగతం పలికింది.
జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జర్నలిస్ట్లకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధ సారధి, నారాయణలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది.
ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, చాలావరకు రాష్ట్రాల్లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది.
సాధారణ వైద్యల పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు.
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పునిచ్చారు
గాంధీ భవన్లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా భూ సమస్యలు పరిష్కారస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు