Publish Date:Jul 23, 2024
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అంతుకు ముందు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించడంతో.. ఈ సమావేశాలు వాడి వేడిగా సాగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా దూరంగానే ఉన్నారు. ప్రతిపక్ష నేతగా సభకు హాజరు కావడం ఇష్టం లేకే ఆయన అసెంబ్లీకి రావడం లేదన్న ప్రచారం జరిగింది. గత కొంతకాలంగా ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం కావడంతో కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు అయ్యే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషించారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరైతే బీఆర్ఎస్ ప్రతిష్ఠ మరింత మసకబారుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో వ్యక్తం కావడంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావడం ఇదే తొలి సారి.
ఇలా ఉండగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమకు విడిగా సీటింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు పది మంది ఉన్నారు. వీరి ప్రజెన్స్ సహజంగానే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతుంది. గతంలో తాను అధికారంలో ఉండగా కేసీఆర్ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆయన విమర్శలు చేసే అవకాశం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా వారి సమాధానం ఉంటుందన్నది తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీలో తాము విడిగా కూర్చేనేందుకు తగిన సీటింగ ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన పది మంది ఎమ్మెల్యేలూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-attend-telangana-budget-session-25-181263.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు