Publish Date:Jun 13, 2025
ఎలా అర్ధం చేసుకోవాలి గురూ!
మొన్నామధ్య కేసీఆర్ మాగంటి నివాసానికి వచ్చి ఆయన బంధువులను పరమార్శించిన విషయం గుర్తుందా? అప్పుడు కేసీఆర్ ఎంత ప్రశాంతంగా ఉన్నారో.. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైనపుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు. మీడియా కళ్లన్నీ కేసీఆర్ పైనే. కానీ కేసీఆర్ మాత్రం ఏ మీడియానూ చూడలేదు. ఎవరికీ ఎలాంటి బైట్ ఇవ్వలేదు. ఎలాంటి యాక్టివిటీ లేదు. కమిషన్ ఎదుట హాజరైయ్యారు. వెళ్లారు. వాళ్లు అడిగింది. కేసీఆర్ చెప్పింది. రికార్డుల్లో భద్రంగా ఉంటుందేమోగానీ కేసీఆర్ హావభావాలు ఏమంత తోట్రు పాటుకు గురైనట్టు కనిపించలేదు. అధికారం నుంచి దిగినోళ్లకి ఇదంతా సహజంర భయ్ అంటా ఒక ఈవెంట్ కి వచ్చినట్టు వచ్చి వెళ్లిపోయారాయన.
అదే ఏపీలో చంద్రబాబు విచారణ సమయంలో నరాలు తెగే ఉత్కంఠ. ఆయన్ను అరెస్టు చేయడం నుంచి కోర్టులో ప్రవేశ పెట్టడం దగ్గర వరకూ హై టెన్షన్. ఆపై జైలుకు పంపడం వరకూ ఒక సుదీర్ఘమైన ఉత్కంఠ భరితమైన వ్యవహారం. ఈ మొత్తం మూడు నాలుగు ఎపిసోడ్లుగా సాగింది. ఎంతో ఎగ్జైట్ మెంట్ నడిచింది. మరీ ముఖ్యంగా ఆయన ఒక కుర్చీలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న పోజ్ అయితే బాబు అభిమానులను, టీడీపీ మద్దతుదారులను ఒక ఊపు ఊపేసింది. తీవ్ర స్థాయిలో చలించిపోయారంతా. బాబుకేమి జరుగుతుందో అన్న ఆందోళన అప్పట్లో వ్యక్తమైంది. అప్పట్లో బాబు ఆయన అరెస్టు విచారణ జైలు జీవితం అదో పెద్ద చర్చ.
అదే ఇక్కడ కేసీఆర్.. వచ్చారు వెళ్లారు. అంతే మధ్యలో ఎలాంటి హైడ్రామా లేదు. ఒక పక్క కుమార్తె గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించే యత్నం చేస్తే ఆగు అన్నట్టు సైగ చేశారు తప్పించి.. ఆమెతో కనీసం మాట్లాడలేదు. ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్ ని మరీ ఇబ్బంది పెట్టే యత్నం చేసినట్టు కూడా కనిపించలేదు.బహుశా కేసీఆర్ ని అంతకన్నా మించి టచ్ చేయొద్దని రేవంత్ సర్కార్ అనుకుందో ఏమో. మధ్యలో ఎలాంటి తోట్రుపాటు, తడబాటు ఏదీ లేదు. అంటే అక్కడికి ఇక్కడికీ హై డ్రామాలో ఎంత మార్పు? ఇది ప్రాంతాల వారీగా ఉన్న తేడానా? లేక నాడు జగన్ చంద్రబాబును వేధించినంతగా.. నేడు రేవంత్ సర్కార్ కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడం లేదనుకోవాలా? ఎక్కడో ఎమోషనల్ డ్రామా మిస్ అవుతోందని అంటున్నావాళ్లు లేక పోలేదు.
ఒక్క కవిత నుంచి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామాకు తెరలేపడం తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనంలో కేసీఆర్ పట్ల రేవంత్ ప్రభుత్వ చర్యలపై కనీస స్పందన లేదు. ఈ విషయంలోని విభిన్నత గుర్తించిన చాలా మంది నాటి చంద్రబాబు విచారణ- నేటి కేసీఆర్ విచారణకు పోలిక తెస్తున్నారు. అంత హై డ్రామా లేదిక్కడ అంటూ కేసీఆర్ విచారణా పర్వాన్ని ఒకింత తేల్చేసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఏదో ఒక ఈవెంట్ కి వచ్చినట్టు వచ్చి వెళ్లిపోవడంతో అదే కరెక్ట్ అనుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-attend-kaleswaram-commission-investigation-39-199845.html
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.