ఇంకా వేర్పాటువాదం అవసరమా?

Publish Date:Apr 18, 2014

Advertisement

 

తెరాస నేతలు తమది ఉద్యమ పార్టీ అని చెప్పుకొంటున్నప్పటికీ, అధికారమే లక్ష్యంగా సాగే ఇతర రాజకీయ పార్టీల వలే అది కూడా ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉంది. రాజకీయ పార్టీలు స్థానిక సమస్యలో, అభివృద్ధి నినాదమో మరొకటో అందిపుచ్చుకొని ఎన్నికలను ఎదుర్కొంటుంటే, తెరాస మాత్రం ప్రధానంగా తెలంగాణా సెంటిమెంటుని, దానితో ముడిపడున్న ప్రజల భావోద్వేగాలపైనే ఆధారపడి నెట్టుకొస్తోంది. అందుకు ప్రధాన కారణం గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం జరుగకపోవడమే. తెరాస తరపున పనిచేసేందుకు గ్రామ స్థాయి నుండి కార్యకర్తలు, నాయకులతో కూడిన సరయిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం వలన, ప్రజలని తనవైపు తిప్పుకొనేందుకు కేసీఆర్ వారిని తెలంగాణా పేరుతో రెచ్చగొడుతుంటారు.

 

ప్రతీసారిలాగే ఈసారి కూడా మాటల మాంత్రికుడు కేసీఆర్ తన మాటకారితనమంతా తెలంగాణా ప్రజల మీద ప్రయోగిస్తున్నారు. తమ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్, తెదేపా-బీజేపీలను అసలు నమ్మరాదని ప్రజలకు నూరిపోస్తున్నారు. ఇతర పార్టీలు వేటికీ కూడా తెలంగాణాతో ఎటువంటి అనుబందమూ లేదని, కేవలం తెరాస మాత్రమే తెలంగాణా ప్రజల పార్టీ అని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆంధ్రా బూచోళ్ళు’ మిమ్మల్ని దోచుకోనేందుకు వస్తున్నారని ప్రజలను భయపెడుతూ వారిలో అభద్రతాభావం రేకెతిస్తూ, అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎన్నికలలో మొత్తం యంపీ, యం.యల్యే. సీట్లన్నీతెరాసకే ఇస్తే తప్ప ప్రజలను ఆ దేవుడు కూడా ఈ ‘బూచాళ్ళ’ నుండి కాపడలేడన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. తమ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి మరీ నీళ్ళు, నిధులు తీసుకువచ్చి బంగారి తెలంగాణా నిర్మిస్తుందని కేసీఆర్ నమ్మబలుకుతున్నారు.

 

ప్రజలను భయపెడుతూ, రెచ్చగొడుతూ, ఊరిస్తూ కేసీఆర్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇది కూడా ఎన్నికలలో గెలిచేందుకు ఒక రకమయిన వ్యూహమేనని అర్ధమవుతోంది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని కోరిక ఉండటం తప్పు కాదు. కానీ అందుకోసం తెలంగాణా ప్రజల మనసులను ఇంకా ఈవిధంగా కలుషితం చేయడం, వారిలో విద్వేషభావాలు రెచ్చగొట్టడం చాలా హేయమయిన ఆలోచన.

 

నేటికీ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మరియు పార్టీ యం.యల్యేలు చాలామంది తమ తమ పదవులలోనే కొనసాగుతున్నారు. కానీ వారందరూ ఇంతవరకు తెలంగాణా కోసం ఉద్యమాలు చేయడం, ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప తెలంగాణా ప్రజల సమస్యలను తీర్చడానికి చేసిందేమీ లేదు. ఆ సంగతి ఇతరుల కంటే తెలంగాణా ప్రజలకే బాగా తెలుసు. అయినప్పటికీ తెరాస నేతలు తాము అధికారంలోకి వస్తే ఏవో అద్భుతాలు చేస్తామని ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు.

 

ప్రజలను మభ్యపెట్టడం రాజకీయ నాయకులకు, పార్టీలకు కొత్తేమి కాదు గనుక, కేసీఆర్ ఆయన పార్టీ నేతలు కూడా తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రజలలో ఇంకా విద్వేష భావాలు రెచ్చగొట్టే బదులు, మిగిలిన పార్టీలు, నేతలు లాగే ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించుకొంటే కనీసం ఎవరికీ నష్టం ఉండదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.