కేసీఆర్ కాంగ్రెస్ ని బ్లాక్ మెయిల్ చేశారా?

Publish Date:Apr 2, 2013

Advertisement

 

రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతుంటే తెలంగాణ ఉద్యమాలు వేడి మాత్రం పూర్తిగా చల్లబడిపోవడంతో కాంగ్రెస్ నేతలందరికీ మళ్ళీ నోరు విప్పే దైర్యం కలిగిస్తోంది. వాయలార్ రవి వేసిన తెలంగాణా దోశని చాలా తేలికగా జీర్ణించుకొన్న తెరాస నేతలను చూసిన తరువాత కాంగ్రెస్ నేతలకు మరింత దైర్యం వచ్చిందిపుడు. పైగా తెరాస నేతలప్పుడు తమ తెలంగాణా ఉద్యమాలను పక్కన బెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల ప్రయత్నాలలో పడటంతో ఇప్పుడు వారిని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి మరింత దైర్యం చిక్కింది.

 

ఖమ్మం కాంగ్రెస్ యంపీ రేణుకా చౌదరి నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తెరాస పార్టీ తెలంగాణా ఉద్యమాలను ఒక పెద్ద వ్యాపారంగా మార్చుకొందని టీబీ, కేన్సర్, గుండెపోటు వంటి జబ్బులతో చనిపోయినవారిని కూడా తెలంగాణా కోసం ఆత్మబలిదానాలుగా చిత్రిస్తూ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణా కోసం నిజంగా ఆత్మహత్యలు చేసుకొన్న యువత మరణాలకు మాత్రం స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఉద్యమాలు నడిపిస్తున్న కేసీఆర్ దే బాధ్యత అని ఆమె అన్నారు. కొద్ది రోజుల క్రితం మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధి ఓడిపోవడమే తెరాసపై అది చేస్తున్న ఉద్యమాలపై తెలంగాణా ప్రజలు క్రమంగా నమ్మకం కోల్పోతున్నట్లు ఋజువు చేస్తోందని ఆమె అన్నారు.

 

తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణా ఉద్యమాల పేరిట కాంగ్రెస్ పార్టీని డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? అని మీడియా అడిగిన మరో ప్రశ్నకు ఆమె ఖండించకపోగా ఆ సంగతి ఆయననే అడగండి అని జవాబు చెప్పడం, మీడియా సందేహాలు నిజమేనని ఆమె చెప్పకనే చెప్పినట్లు భావించవలసి ఉంటుంది.

 

కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మ కూడా యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సమాజ్ వాది అధినేత ములాయం సింగు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించినట్లే, ఇప్పుడు రేణుకా చౌదరి కూడా కేసీఆర్ కు వ్యతిరేఖంగా ఆరోపిస్తున్నట్లు ఉంది.

 

తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా విదించుకొన్ననెలరోజుల గడువు వరకు కూడా తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేయడానికి షరతుల గురించి మీడియాలో చాలా పెద్ద చర్చే జరిగింది. ఆ సమయంలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుండే కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా హాట్ లయిన్లో చర్చలు జరుపుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం అందరికి తెలిసిందే. గానీ, నెల రోజుల గడువు పూర్తయిన తరువాత కేసీఆర్ మాటలలో అకస్మాత్తుగా పెద్ద మార్పుకనబడింది. తానూ తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేందుకు సిద్దపడినా కూడా కాంగ్రెస్ (తెలంగాణా ఇచ్చేందుకు) ఒప్పుకోలేదని చెప్పడంతో అన్ని రాజకీయ పార్టీలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి.

 

సీపీఐ పార్టీ నాయకుడు నారాయణ అయితే మరో అడుగు ముందుకు వేసి అసలు కాంగ్రెస్ పార్టీ, తెరాసాలు తెలంగాణపై రహస్య ఒప్పందాలు చేసుకోవడానికి, బేరాలు ఆడుకోవడానికి తెలంగాణా ఏమి వ్యాపార వస్తువు కాదు, నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలకు సంబందించిన సున్నితమయిన సమస్య, అసలు ఆ రెండు పార్టీలు ఏ అధికారంతో ఈ విధమయిన రహస్య ఒప్పందాలు చేసుకొంటున్నాయంటూ నిలదీశారు.

 

అయితే ఇటువంటి దుమారాల నుండి బయటపడటం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన రహస్య ఒప్పందం పైనుండి అందరి దృష్టినీ మళ్ళించడానికి ‘ఎన్నికలు టికెట్స్’ అంటూ హడావుడి మొదలుపెట్టి తప్పించుకొన్నాడు.

 

అయితే, అతను తెలంగాణా ఉద్యమాలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని డబ్బు లేదా ఇతరత్రా ప్యాకేజీలకోసం డిమాండ్ చేసాడని, అవేవి కుదరకపోవడం చేతనే కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ మళ్ళీ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాడని, ఇప్పుడు రేణుకా చౌదరి తన మాటలతో చెప్పకనే చెపుతున్నారు. బహుశః కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమె మాటలను అందుకే ఇంతవరకు ఖండించలేదు.

 

తెలంగాణా కోసం తల నరుకొంటాన్నన కేసీఆర్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలలో పార్టీని గెలిపించుకొనే పనిలో తలమునకలయి ఉన్నాడు. కానీ, అతని మాటలను, అతని ఉద్యమాలను నమ్మిన యువత మాత్రం తమ చదువులు పాడుచేసుకోవడమే కాకుండా ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకొని కన్నవారికి జీవితకాలం తీరని దుఃఖం మిగిల్చారు. రాజకీయ పార్టీలు ఆడుకొంటున్న ఈ రాజకీయ చదరంగంలో సమిధలు కాకుండా విజ్ఞత చూపవలసిన బాద్యత ప్రజలదే.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.