చంద్రబాబు అభివృద్ధికి, కేసీఆర్ గిల్లికజ్జాలకి ప్రాధాన్యం

Publish Date:May 22, 2014

Advertisement

 

త్వరలో తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కేసీఆర్ నేటికీ ఆంధ్ర ప్రజల పట్ల విద్వేషాన్ని ప్రదర్శిస్తుండటం చాలా దురదృష్టకరం. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆయన పోరాటం మొదలుపెట్టినపుడు, ఆయన తెలంగాణా ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు వారిలో ఈ విద్వేష భావనలను వ్యాపింపజేశారు. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, ముఖ్యమంత్రి అవ్వాలనే ఆయన కల నెరవేరుతున్నప్పటికీ ఆయన ఆంద్ర ప్రజలు, పాలకులపై విషం కక్కుతూనే ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆయన మాట్లాడిన మాటలే అందుకు ఒక ఉదాహరణ. ముఖ్యమంత్రి వంటి ఒక గౌరవ ప్రధమయిన, అత్యున్నతమయిన పదవిని చెప్పట్టబోతున్న కేసీఆర్, ప్రభుత్వోద్యోగుల విషయంలో అంత హేళనగా మాట్లాడవలసిన అవసరం లేదు. స్వయంగా తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నపుడు, ఈ సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకొనే అవకాశం ఉంది. అవసరమయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కూడా. కానీ కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలా కాక నేటికీ ఒక ఉద్యమ నేతలాగే మాట్లాడుతూ, తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలలో అభద్రతాభావం కలిగిస్తున్నారు.

 

ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్, చంద్రబాబుల వైఖరిలో తేడా చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నచంద్రబాబు, కేసీఆర్ కి స్నేహ హస్తం అందిస్తే, ఆయన నుండి ఇంతవరకు కనీస స్పందన కూడా లేదు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తో బాటు తెలంగాణా అభివృద్ధికి కూడా తను యధాశక్తిన సహకరిస్తానని, కేసీఆర్ తో కలిసిపనిచేస్తానని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు చొరవ చూపుతానని చెపుతుంటే, కేసీఆర్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు మాట్లాడుతున్నారు.

 

తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణాలో ఒక్క ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థను కూడా అడుగు పెట్టనీయమని కేసీఆర్ చెప్పడం అవివేకమే. చంద్రబాబు ఇంకా అధికారం చేప్పటక ముందే దేశవిదేశాలలోని పారిశ్రామికవేత్తలను, సాఫ్ట్ వేర్ కంపెనీలను, వ్యాపార సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించి వారిచే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, కంపెనీలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేందుకు అప్పుడే గట్టిగా ప్రయత్నాలు మొదలుపెడితే, కేసీఆర్ మాత్రం ఇంకా గిల్లికజ్జాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

 

గత పదేళ్లుగా ఆయన చేసిన తెలంగాణా ఉద్యమాలతో తెలంగాణా అస్తవ్యస్తమయింది. ఉద్యమాల కారణంగా వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు హైదరాబాద్ అంటేనే భయపడుతున్నాయి. ఇక హైదరాబాదులో స్థిరపడిన సినీ పరిశ్రమ, ప్రైవేట్ విద్యాసంస్థలు తీవ్ర అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అటువంటప్పుడు కేసీఆర్ వారందరికీ దైర్యం కలిగేవిధంగా మాట్లాడకపోగా వారి భయాలను మరింత పెరిగేలా మాట్లాడుతున్నారు.

 

అనేక ఆర్ధిక సమస్యలకు తోడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవలసిన దుస్థితిలో ఉన్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చాలా సానుకూల వాతావరణం కనబడుతోందంటే అందుకు కారణం చంద్రబాబు సమర్ధతపై ప్రజలకున్న నమ్మకమేనని చెప్పవచ్చును. కానీ అన్నివిధాల అభివృద్ధి చెంది ఆర్ధికంగా బలంగా ఉన్న తెలంగాణాలో ఒక అనిశ్చిత, అభద్రతా వాతావరణం కనబడుతోంది అంటే అందుకు కేసీఆర్ వైఖరే కారణమని చెప్పవలసి ఉంటుంది. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరివల్ల తెలంగాణాకు, ప్రజలకు కూడా ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఉండదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.