Publish Date:May 28, 2025
సర్కమ్ స్టెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్.. అంటూ ఒకటుంటుంది. దీని అర్ధమేంటంటే వారి వారి మానసిక- శారీరక- సామాజిక- రాజకీయ- ఆర్ధిక- స్థితిగతులను అనుసరించి వారెలా బిహేవ్ చేస్తారో.. ఒక అంచనాకు రావడం. దీన్నే ఇప్పుడు రెడ్ టీమిజం అని కొత్తగా కూడా పిలుస్తున్నారు. ఇది వేరే విషయం.
ఇక్కడ కవితకు అలాంటి పరిస్థితి ఉందా? లేక బీఆర్ఎస్ పార్టీకే ఇలాంటి సిట్యువేషన్ తలెత్తిందా? అని చూస్తే ఇది జస్ట్ కవిత పరిస్థితిలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ఒక వేళ కవితే కాంగ్రెస్ లోకి వెళ్తే.. కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఈ- కార్ రేస్ విషయంలో కావచ్చూ.. బీఆర్ఎస్ కి ఒక రిలీఫ్ రావచ్చు. కారణమేంటంటే.. కవితే కాంగ్రెస్ లో ఉంటే.. ఇలాంటి అంశాల్లో చేతి పార్టీ ప్రభుత్వం అంత అగ్రెసివ్ గా దూకుడు ప్రదర్శించక పోవచ్చు. దీంతో కవిత ద్వారా కేసీఆర్ ఇటు నుంచి నరుక్కొస్తున్నదిగా ఒక అంచనా.
ఇక రెండోది.. దీన్ని రేవంత్ , ఆయన సన్నిహితులు ఇటు పీసీసీ అటు కేంద్ర నాయకత్వాన్ని వద్దని వారించినట్టు భావించడం. అదేమంటే అనవసరంగా కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన నింద మన మీద వేసుకోవడం ఎందుకని.. వారు అనుకున్నట్టు! అందుకే వద్దన్నట్టు చెప్పడం కూడా ఒకరకంగా.. తాను చంపబోయే జింకను చూసి పులే జాలి పడ్డట్టుగా ఉంది.
ఇప్పుడు నడుస్తోన్నదంతా ఏంటి? తనను కేసీఆర్ జైలుకు పంపినట్టే నేను కూడా ఆయన్ను పంపాలన్నదే కదా? కేటీఆర్ ని కూడా వదలకుండా వెంటాడి వేటాడి రివేంజ్ తీర్చుకోవడమే అసలు ఉద్దేశం అదే కదా? అంటారు కొందరు ఎనలిస్టులు.
బేసిగ్గా ఇవన్నీ జరక్కుండా కడియం శ్రీహరి చెప్పినట్టు కేసీఆర్ తొలి నాళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి ఉండొచ్చు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొందర్ని కొని.. సొంతంగా అధికారంలోకి రావచ్చు. ఇందుకు ఆస్కారాలు లేక పోలేదు. కానీ కేసీఆర్ అసలైన ఆలోచన అది కాదు. డీఎంకే, అన్నాడీఎంకే ఫార్ములా... అంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్, టీబీఆర్ఎస్ ఉండాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒక వేళ అలా లేకుంటే అధికార పార్టీ కాంగ్రెస్ లో మన వాళ్లు ఎవరో ఒకరుండటం. మరీ లేకుంటే బీజేపీలో ఉండటం. ఒక సారి మనం (అంటే బీఆర్ఎస్) అధికారంలోకి వచ్చినా.. రెండో సారి అటు వైపు వాళ్లు(కాంగ్రెస్ లేదా బీజేపీ) అధికారంలోకి వచ్చినా.. మన వాళ్లు అటు వైపు ఉంటారు కాబట్టి.. మనం ఎన్ని చేసినా చెల్లుబాటు అయ్యేలా ఒక ఎత్తుగడ. ఇదీ కేసీఆర్ 2018 నాటి నుంచి కలలు కంటోన్న పొలిటికల్- స్కెచ్.
ఇప్పుడున్న రోజుల్లో అధికారంలో లేకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. పరిపాలనలో ఏవో ఒక లోటు పాట్లు ఉండనే ఉంటాయి. అధికారం పోయాక వాటిని అడ్డు పెట్టుకుని ఏవో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ కండీషన్లో.. మనమలా ఇరుకున పడకుండా ఉండాలంటే ఇదే సేఫ్ ప్లాన్. ఇందులో భాగమే ఒక కవిత- ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి పదవి కాన్సెప్ట్ గా అంచనా వేస్తున్నారు కొందరు. అర్ధమవుతోందా!?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kaviths-bargain-with-congress-39-198889.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.