బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు

Publish Date:May 29, 2025

Advertisement

కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రశ్నే లేదన్న సంకేతం
ఇంటి  ఆడబిడ్డపై సోషల్ మీడియాలో టార్గెట్ చేశారంటూ ఆరోపణ

బీఆర్ఎస్  అధినేత కుటుంబంలో  అంతర్గత విభేదాల రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 2023 ఎన్నికలలో పరాజయం తరువాత కూడా పార్టీ ఇంతటి సంక్షాభాన్ని ఎదుర్కొనలేదు. ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే సారి గుప్పిట తెరిచేశారు. తన ధిక్కారం, తిరుగుబాటు సోదరుడు కేటీఆర్ పైనే అని కుండబద్దలు కొట్టేశారు. కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓపెన్ అప్ అయిపోయారు. సొంత సోదరుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కుటుంబంలో చీలిక అనివార్యమని తేల్చేశారు. తాను సొంత పార్టీ పెట్టుకోవడం ఖాయమన్న సంకేతాలిచ్చేశారు. తన సోదరుడి నాయకత్వంలో పని చేసే ప్రశక్తే లేదని పరోక్షంగానైనా విస్పష్టంగా తేల్చి చెప్పారు. 

బీఆర్ఎస్ లో ఏకైక నాయకుడు కేసీఆరేననీ, మరెవరి నాయకత్వాన్నీ తాను అంగీకరించే ప్రశ్నే లేదనీ కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఆమె  ఎలాంటి శషబిషలూ లేకుండా పార్టీపై ధిక్కార స్వరాన్ని చాలా చాలా గట్టిగా వినిపించారు. దీంతో ఆమెకు ఇప్పుడో, ఇహనో షోకాజ్ నోటీసు జారీ చేసి.. పార్టీ నుంచి ఉద్వాసన చెప్పాలని అధినేత భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు షోకాజ్ నోటీసు, పార్టీ నుంచి ఉద్వాసన విషయాన్ని పక్కన పెడితే కల్వకుంట్ల కవిత  మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ పునాదులకు కుదిపేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనంచేసే కుట్ర జరుగుతోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్రంలో రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నంచీ కూడా ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏర్పడిన తరువాత కూడా బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రి గురించిన ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా బీఆర్ఎస్ గాలి తీసేశాయి.

అంతే కాకుండా పార్టీలో తనను పక్కన పెట్టడం అన్నది ఇప్పుడు కాదనీ.. చాలా కాలం నుంచీ జరుగుతోందనీ ఆమె అన్యాపదేశంగా చెప్పారు. గతంలో అంటే మద్యం కుంభకోణం కేసులో తాను జైలుకు వెళ్లే సమయంలోనే పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యానని కవిత చెప్పుకోచ్చారు. ఇక తాను జైలులో ఉన్న సమయంలోనే తనపై కుట్రలు మొదలయ్యాయని ఆరోపణలు గుప్పించారు. పార్టీలోని కొందరు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత.. బీఆర్ఎస్ కు కేసీఆర్ వినా ఎవరి నాయకత్వాన్నీ తాను అంగీకరించేది లేదని కుండబద్దలు కోట్టడం ద్వారా.. తన సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి తాను ససేమిరా అంగీకరించబోనని స్పష్టం చేశారు.  

ఇక తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.   సొంత పార్టీ వాళ్లే సోషల్ మీడియాలో తననుటార్గెట్ చేశారన్న కవిత, ఇంటి ఆడబిడ్డపై సోషల్  మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులపై దాడి చేయిస్తారా అంటూ పేరు ప్రస్తావించకుండానే సోదరుడు కేటీఆర్ పై విరుచుకు పడ్డారు. నామీద పడి ఏడిస్తే ఏమొస్తుందంటూ పరోక్షంగానైనా తన తిరుగుబాటు సోదరుడిపైనేనని చెప్పేశారు.  తన లేఖను లీక్ చేసిన లీకు వీరులను పట్టుకోమంటూ గ్రీకు వీరులను తనపై రెచ్చగొట్టారని విమర్శలు గుప్పించారు.

ఇప్పటికైనా సరే తన లేఖను లీక్ చేసిందెవరో చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ప్రణాళికాబద్ధంగా తనకూ కేటీఆర్ కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందనీ, తనను దూరం చేస్తే పార్టీలో లాభ పడేదెవరో అందరికీ తెలుసు అనడం ద్వారా ఆమె అన్యాపదేశంగా కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు కవితకు ఉద్వాసన చెప్పి బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారా? లేక మరో సారి కుమారుడి పట్టాభిషేక ముహూర్తాన్ని వాయిదా వేస్తారా అన్నది కేసీఆర్ నిర్ణయించుకోవలసిన పరిస్థితి వచ్చింది. మరి యువరాజ పట్టాభిషేకం జరుగుతుందా... మరోసారి వాయిదా పడుతుందా..చూడాల్సిందే. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు
జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు.
రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు.
ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆలపాటి సురేశ్‌కుమార్‌ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్‌కు ఆయన వివరించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదా? అంటే అవున‌నే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల ప‌ట్ల ఉండాల్సిన నిబద్ధ‌త మ‌రచి మ‌రీ జ‌గ‌న్ అనుంగు మీడియా వ్య‌వ‌హ‌రించ‌డం చేటు తెస్తుందా? అంటే అదే నిజ‌మ‌ని తెలుస్తోంది.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి శైలజ తీవ్రస్థాయిలో స్పందించారు.
అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సాక్షి వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు.
మోహ‌న్ బాబు బేసిగ్గా చిత్తూరు వాసి. ఆయ‌న శ్రీ విద్యానికేత‌న్ సైతం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల‌తో పాటు వాటి ఉప ఆల‌యాలు వెర‌సీ.. ఈ ప్రాంతంలో బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం కానీ ఈ సామాజిక వ‌ర్గం ప‌ట్ల గౌర‌వాభిమానాలు గానీ ఇత‌ర ప్రాంతాల‌తో పోలిస్తే ఒకింత‌ ఎక్కువ‌గానే ఉంటాయ్. తిరుమ‌లలాంటి ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంత‌టి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌మైందంటే అందుకు కార‌ణం ఈ బ్రాహ్మ‌ణుల నిష్టాగ‌రిష్ట‌త‌లే కార‌ణం అన్న భావనతో ఒకింత గౌరవం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.