బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో విభేదాలు ఇక ఇసుమంతైనా దాపరికం లేకుండా రచ్చకెక్కాయి. కేసీఆర్ కుమార్తె కవిత శషబిషలు లేకుండా పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కూడా బీఆర్ఎస్ ను, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆధర్ ను టార్టెట్ చేసి విమర్శలతో చెలరేగిపోతున్నారు. అంతే కాదు.. ఇక తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు కూడా మద్దతుగా గళమెత్తడానికి కూడా అమె పెద్ద సుముఖంగా లేరన్న సంకేతాలిస్తున్నారు.
తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు యత్నాలను అడ్డుకునేందుకు వ్యూహరచన చేసేందుకు బీఆర్ఎస్ కీలక సమావేశం సోమవారం జరిగింది. ఆ సమావేశానికి కవిత దూరంగా ఉన్నారు. పార్టీ రానీయలేదా? ఆమె దూరం జరిగారా అన్నది పక్కన పెడితే.. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ లోఅత్యంత కీలకంగా ఉన్న కవిత.. కీలకమైన కాళేశ్వరం విషయంలో పార్టీ వ్యూహరచనకు దూరం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేననీ, అక్రమాలకు కారకులు వీరే అంటే కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ నేత ఈటల పేర్లను కూడా కమిషన్ నివేదిక వెల్లడించినట్లు సమాచారం. ఈ నివేదక తెలంగాణలో కలకలం రేపుతుండగా, బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసింది. ఈ నేపథ్యంలోనే ఎర్రవల్లి ఫాం హౌస్ లో సోమవారం ( ఆగస్టు 4) పార్టీ కీలక నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి కవిత దూరంగా ఉన్నారు. లేదా కేసీఆర్ దూరంగా ఉంచారు.
ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక భేటీ జరుగుతుంటే.. కవిత మాత్రం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల డిమాండ్ తో నిరశన దీక్షలో కూర్చున్నారు. వాస్తవానికి కవిత మూడు రోజుల నిరశన దీక్ష ప్రకటించినప్పటికీ.. కోర్టు సూచనతో కవిత ఒక్కరోజుకే పరిమితం చేశారు. ఈ సందర్భంగా ఆమె కాళేశ్వరం నివేదికపై ఏమీ మాట్లాడలేదు. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ నివేదిక తో కేసీఆర్ అరెస్టు ఎదుర్కొంటున్నారన్న విషయాలను ఆమె ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తన సోదరుడు కల్వకుంట్ల తారకరామారావుపై తిరుగుబావుటా ఎగురవేసిన కవిత.. తండ్రి కేటీఆర్ కు కూడా దూరంగా ఉంటూనే తన సొంత బాటలో నడుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా కవిత.. కల్వకుంట్ల కుటుంబానికి దూరమయ్యారనడానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక పై ఆమె మాట్లాడకపోవడమే తార్కానమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-distance-herself-with-kalvakuntla-family-39-203523.html
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.