క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా..? అదంతా సింప‌తీ డ్రామాయేనా?

Publish Date:Feb 25, 2024

Advertisement

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఏడాదిగా స్త‌బ్దుగా ఉన్న కేసు మ‌రోసారి సంచ‌నాలు రేపుతోంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈ స్కాంలో  సీబీఐ ఏకంగా నిందితురాలిగా చేర్చింది. ఇంత‌వ‌ర‌కు సాక్షిగా మాత్ర‌మే క‌విత‌ను  విచారించిన సీబీఐ.. ప్ర‌స్తుతం నిందితురాలిగా చేర్చ‌డంతో బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది. గ‌తంలో 41ఏ సీఆర్పీసీ నోటీసుల‌ను స‌వ‌రించి సోమవారం (ఫిబ్రవరి 26) విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని క‌వితకు పంపించిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. క‌విత‌ను ఇప్ప‌టికే మూడు సార్లు సీబీఐతోపాటు ఈడీ విచార‌ణ చేసింది. అయితే, ఈసారి క‌విత విచార‌ణ‌కు వెళితే అరెస్టు ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే   లిక్క‌ర్ స్కాంలో విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు పంపించింది. ప‌లు సార్లు నోటీసులు అందించినా కేజ్రీవాల్ విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. అయితే ఈసారి కేజ్రీవాల్ తో పాటు క‌విత‌ను కూడా విచార‌ణ అనంత‌రం అరెస్టు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు సీబీఐ వ‌ర్గాల స‌మాచారం.  తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నా.. మ‌రోప‌క్క సంతోషంకూడా వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి కార‌ణం త్వరలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌ట‌మేన‌ంటున్నారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు విచార‌ణ ముదుకు సాగుతున్న కొద్దీ అనేక సంచ‌ల‌నాల‌కు తెర‌లేస్తోంది. ఈ కేసులో ఇప్ప‌టికే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయ‌న కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు అఫ్రూవర్ గా మారిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలోని క‌విత పీఏ అశోక్ కౌశిక్ కూడా అప్రూవ‌ర్ గా మారిపోయారు. ఈ నేప‌థ్యంలో క‌విత‌కు ఈ స్కాంలో ప్ర‌మేయం ఉంద‌ని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో క‌విత‌ను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. మ‌రి కొద్ది నెల‌ల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ అంశం బీఆర్ ఎస్ కు మేలు చేస్తుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.   సీబీఐ అధికారులు క‌విత‌ను నిజంగానే అరెస్టు చేస్తే..  లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ కు సానుభూతి పవనాలు వీచే అవకాశం ఉందని  ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నార‌ని బీఆర్ ఎస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత పేరును త‌ప్పించేలా ఢిల్లీ కేంద్రంలో కేసీఆర్ పావులు క‌దిపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే,  ఎన్నిక‌లున్న నేప‌థ్యంలో కేసీఆర్ ఆ ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌చ్చున‌ని ప‌రిశీలకులు అంటున్నారు. 

లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత‌ను నిందితురాలిగా చేర్చుతూ సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. గ‌త కొంత‌కాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లిక్క‌ర్ కేసులో క‌వితను కాపాడుతున్నార‌ని బీజేపీపై ఆరోప‌ణ‌లు చేస్తుంది. బీజేపీ, బీఆర్ ఎస్ రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని, అందుకే లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు కాలేద‌ని కాంగ్రెస్ నేత‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధిష్టానం మాత్రం.. విచార‌ణ జ‌రుగుతుంద‌ని, పూర్తి ఆధారాలు సేక‌రించ‌గానే క‌విత అరెస్టు ఉంటుంద‌ని పేర్కొటోంది. అయితే, గ‌త‌ కొంత‌ కాలంగా క‌విత పేరు ఎత్త‌ని సీబీఐ.. తాజాగా లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ క‌వితను ఏకంగా నిందితురాలిగా చేర్చ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ వ్య‌వ‌హారం మొత్తం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేందుకేన‌ని, బీఆర్ ఎస్, బీజేపీ క‌లిసి ఆడుతున్న నాట‌కంలో ఇదొక భాగ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో రోజురోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించ‌డ‌ంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. గ‌ రోజుల క్రితం జ‌రిగిన కొస్గీ బ‌హిరంగ స‌భ‌లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అభ్య‌ర్థిని సైతం ప్ర‌క‌టించిన రేవంత్‌.. 14 పార్ల‌మెంట్ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు నిచ్చారు. ఇటీవ‌ల ప‌లు సంస్థ‌ల స‌ర్వే ఫ‌లితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని తేలింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ, బీఆర్ ఎస్ లోపాయికారి ఒప్పందం ప్ర‌కారం కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

ఈ క్ర‌మంలోనే లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత‌ను నిందితురాలిగా చేర్చ‌డంతో పాటు సోమవారం (ఫిబ్రవరి 26)  విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ నోటీసులు అందించింది. క‌విత విచార‌ణ‌కు వెళితే అరెస్ట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ప‌రిణామాల‌ను లోక్ స‌భ ఎన్నిక‌ల వేల బీఆర్ ఎస్‌, బీజేపీ ఆడుతున్న డ్రామాగా కాంగ్రెస్ నేత‌లు బ‌లంగా వాదిస్తున్నారు. క‌విత అరెస్ట్ అయితే సంప‌తీ ఓట్ల‌తో బీఆర్ ఎస్ అధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని చూస్తున్నద‌ని, మ‌రోవైపు.. మేము మాట ఇచ్చిన ప్ర‌కారం క‌విత‌ను అరెస్టు చేశామంటూ బీజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఎక్కువ స్థానాల్లో  కాషాయం జెండా ఎగుర‌వేయాల‌ని ప్లాన్ చేస్తున్నదని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. ఫ‌లితంగా కాంగ్రెస్ నిర్దేశించుకున్న 10 నుంచి 14 పార్ల‌మెంట్‌ సీట్ల ల‌క్ష్యానికి గండిప‌డుతుంద‌ని బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు భావిస్తున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మొత్తానికి ఎన్నిక‌ల వేళ లిక్క‌ర్ కేసు వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.