కాశ్మీర్ వేర్పాటువాదం : మంచు మాటున వంచన పర్వం!

Publish Date:Aug 22, 2016

Advertisement


కొన్నాళ్ల కింద కాశ్మీర్ అట్టుడికిపోయింది. ఆర్మీపైన అక్కడి అల్లరి మూకలు రాళ్ల వర్షం కురిపించాయి. బుర్హాన్ అనే ఉగ్రవాదిని ఎన్ కౌంటర్లో చంపినందుకు నిరసనగా రోడ్లపైకి వచ్చి వేర్పాటు వాదులు అరాచకం సృష్టించారు. ఆర్మీ కూడా ఆత్మరక్షణ కోసం రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించింది. ఈ మొత్తం గొడవలో చాలా మందే మరణించారు. కాని, నిజంగా కాశ్మీర్ వేర్పాటు వాదం వెనుక నమ్మలేని నిజాలు మీకు తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు!


కాశ్మీర్ విషయంలో మన శత్రువులు కేవలం పాకిస్థాన్ లో లేరు. అంతర్గతంగానే ఎక్కువ వున్నారు. అభ్యుదయవాదులుగా, మేధావులుగా, జర్నలిస్టులుగా చలామణి అవుతూ 'కాశ్మీరియత్' అనే కొత్త పదాలు ప్రయోగిస్తూ యావత్ భారతదేశాన్ని మోసం చేస్తున్నారు. కాశ్మీర్ లో అసలు ఇండియాతో కలిసి వుండేందుకు ఇష్టపడే జనమే లేరన్నట్టు కొన్ని లెఫ్ట్ భావజాలం ముదిరిన న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. కాని, సత్యం మరోలా వుంది!


కాశ్మీర్ కి ఇండియా జెండా కాకుండా తనదైన ప్రత్యేక జెండా వుంది. ఈ విషయం మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కాని, అక్కడి వేర్పాటు వాదులు తమ నిరసనల్లో భాగంగా కాశ్మీర్ జెండా ఎగురవేయరు. పాకిస్తాన్ జెండా రెపరెపలాడిస్తుంటారు. ఇది దేనికి సంకేతం? కాశ్మీర్ లో వేర్పాటువాదం వినిపిస్తోన్న అరాచక వర్గం నిజంగా స్వేఛ్ఛ కోరుకోవటం లేదు. పాకిస్తాన్ కాసులకు ఆశపడి అమ్ముడుపోతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా ఏదో ఒక రోజు మొత్తం కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ధారదత్తం చేయాలని కుట్రపన్నుతున్నారు. అందుకే, రకరకాలుగా కాశ్మీరీ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయినా కూడా ఇలా స్వతంత్ర కాశ్మీర్ కావాలని కోరుకుంటున్న జనం ఎంతో తెలుసా? జస్ట్ పదిహేను శాతం! అదెలాగో చూద్దం రండి...
భారతదేశం ఆధీనంలో వున్న జమ్మూ, కాశ్మీర్ మొత్తం విస్త్రీర్ణం 101380 చ.కి. అందులో 15శాతం మాత్రమే వేర్పాటు వాదం వున్న కాశ్మీర్ ప్రాంతం. మిగతా 85శాతం జమ్మూ, లద్ధాఖ్ ప్రాంతాలు. ఇక్కడ ఇండియాకి వ్యతిరేకమైన సెంటిమెంట్ అస్సలు వుండదు.


భారతదేశంలో ఇప్పటి వరకూ హిందూ ముఖ్యమంత్రే లేని రాష్ట్రం జమ్మూ, కాశ్మీర్. కాని, నిజానికి అంతా అనుకున్నట్టు జె అండ్ కే ముస్లిమ్ మెజార్టీ రాష్ట్రం కాదు. అక్కడి 85శాతం ప్రాంతంలో ముస్లిమ్ లు మైనార్టీలే. జమ్మూ, లద్ధాఖ్ లాంటి చోట్లలో హిందువులు, ఇతర వర్గాలే అత్యధికులు. మొత్తం 1.25కోట్లున్న జనాభాలో 69లక్షలు కాశ్మీర్లో, 53లక్షలు జమ్మూలో, 3లక్షలు లద్ధాఖ్ లో వుంటారు. మరో 7.5లక్షలు మంది జమ్మూ, కాశ్మీర్ పౌరసత్వం లేని సెటిలర్స్.


ఇకపోతే 22జిల్లాల మొత్తం రాష్ట్రంలో కేవలం 5జిల్లాలు మాత్రమే వేర్పాటు వాదుల ప్రభావంలో వున్నాయి. అవ్వి శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, కుల్గాం, పుల్వామాలు. ఇవి కాక 17జిల్లాలు ఎలాంటి వేర్పాటువాదంతోనూ లేవు. అంతే మెజార్టీ ప్రాంతం, ప్రజలు ఇండియాతోనే వుండాలని కోరుకుంటున్నారన్నమాట! అలాగే, ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ జపం చేసే వేర్పాటు వాదులున్న 5జిల్లాలు పాక్ సరిహద్దుకి దూరంగా వుంటాయి. నిజంగా ఆ దేశంతో సరిహద్దు పంచుకునే కాశ్మీరీ జిల్లాలు ఎంత మాత్రం వేర్పాటువాదానికి సహకరించవు. ఇండియాతోనే వుండాలని కోరుకుంటాయి.
జమ్మూ, కాశ్మీర్ జనాభాలో 85శాతం రకరకాల మతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన వారు. వీళ్లెవరూ భారత్ కు వ్యతిరేకం కాదు. ఇందులో ముస్లిమ్ లే అయిన షియాలు కూడా వుంటారు. వీళ్లు ఇస్లాం అనుసరించినా సున్నీ ప్రాబల్యం వున్న పాకిస్తాన్ అంటే అస్సలు ఇష్టపడరు. ఒకింత భయపడతారు కూడా...


కాశ్మీర్ లో షియా ముస్లిమ్ లు కాకుండా రాజ్ పుత్, బ్రాహ్మణ, మహాజన వర్గాలకు చెందిన డోగ్రాలనే సామాజిక వర్గం వుంటుంది. వీళ్లతో పాటూ దారుణంగా హింసకు గురైన కాశ్మీరీ పండిట్లు కూడా ప్రధానంగా వుంటారు. అంతే కాకుండా ఈ హిమాలయ రాష్ట్రంలో సిక్కులు, బౌద్ధులు, గుజ్జర్లు, బకర్ వాల్స్, పహరీస్, బాల్టీస్, క్రిస్టియన్లు, ఇంకా మైక్రో మైనార్టీ వర్గాలు వుంటారు. వీళ్లెవరూ వేర్పాటు వాదానికి అనుకూలం కాదు.   


ఇక మన జాతీయ మీడియాలో ప్రధానంగా వినిపంచే కాశ్మీరియత్ ఒట్టి భ్రమ మాత్రమే. జమ్మూ, కాశ్మీర్లో నిజంగా కాశ్మీరీ భాష మాట్లాడేది 33శాతం జనాబానే. మిగతా వారు డోగ్రీ, గుజ్జరీ, పంజాబీ, లద్దాఖీ లాంటి భాషలు మాట్లాడతారు. కాని, 33శాతం కాశ్మీరీ మాట్లాడేవారే వేర్పాటు వాద హురియత్ ని, ఉగ్రవాద సంస్థల్ని, ఒమర్ అబుద్ధల్లా నేషనలిస్ట్ కాంగ్రెస్ ని, మెహబూబా ముఫ్తీ పీడీపీని కంట్రోల్ చేస్తారు. అంతే కాదు, వ్యాపారాలు, వ్యవసాయం, గవర్నమెంట్లో కీలక పదవులు అన్నీ కూడా ఈ కాశ్మీరీ మాట్లాడే వారి చేతుల్లోనే వుంటున్నాయి. అందుకే, వారి మాటే చెల్లుతూ వస్తోంది.


మొత్తం మీద కాశ్మీర్ లోని సున్నీ ముస్లిమ్ లు తప్ప మిగతా ముస్లిమ్ వర్గాలతో సహా హిందు, సిక్కు, బౌద్ధ మరే ఇతర వర్గం కూడా వేర్పాటు కోరుకోవటం లేదు. అలా కోరుకునే సున్నీ వర్గం కేవలం 15శాతానికే పరిమితం. వాళ్లే పాకిస్తాన్ తో అంటకాగి, ఆర్మీ పై రాళ్లు రువ్వుతూ అల్లకల్లోలం సృష్టిస్తుంటారు. వాళ్లకే మన మీడియా అభ్యుదయవాదం ముసుగులో చేతనైనంత సాయం చేస్తుంటుంది. మొత్తం జమ్మూ, కాశ్మీర్ ఇండియాకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చేసిందని హడావిడి చేస్తుంటుంది. కాని, గొడవంతా జరిగేది 5జిల్లాల్లో మాత్రమే. మిగతా 17 జిల్లాలు మిగతా భారతదేశంలో అన్ని ప్రాంతాలు ఎలాగ ఈ దేశంలో అంతర్భాగంగా వుండాలని కోరుకుంటున్నాయో అలాగే భావిస్తున్నాయి. వీటిలో 90శాతం పైగా ముస్లిమ్ జనాభా వున్న సరిహద్దు జిల్లాలైన పూంచ్, కార్గిల్ వంటివి కూడా వున్నాయి!

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.