ఆకాశం లాంటి జీవితం! నక్షత్రాల్లాంటి విశిష్టతలు!

Publish Date:Aug 8, 2018

Advertisement

ఇప్పుడు దేశమంతా కరుణానిధి గురించే చర్చించుకుంటోంది! స్వయంగా ప్రధాని మోదీ చెన్నైకి చేరుకుని దివంగత దిగ్గజానికి నివాళి అర్పించారు. 94 ఏళ్ల కరుణానిధి అయిదు సార్లు సీఎంగా తమిళనాడును పరిపాలించి చరిత్ర సృష్టించారు! అయితే, కలైంగర్ ది విలక్షణ వ్యక్తిత్వం. అందువల్లే ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. పరమ నాస్తికుడిగా ముద్రపడ్డ ఆయన తల్లిదండ్రులు తనకు పెట్టిన దేవుడి పేరును మార్చుకోవటం మొదలు పెద్ద కొడుకును కాదని చిన్న కొడుకును పార్టీ అధినేతగా నియమించటం వరకూ అడుగడుగునా అంకితభావం, తెలివితేటలు ప్రదర్శించారు. కరుణానిధి జీవితంలోని విభిన్న కోణాల్ని, విశేష అంశాల్ని ఇప్పుడు చూద్దాం.

 

 

1924లో జన్మించిన కరుణానిధి తన సుదీర్ఘ ప్రస్థానాన్ని సాదాసీదాగా ప్రారంభించారు. ఆయన బాగా డబ్బున్నవారు కాదు. పలుకుబడి కలిగిన రాజకీయ , వ్యాపార కుటుంబంలోని వారు కూడా కాదు. మధ్యతరగతి మూలల నుంచీ అంచెలంచెలుగా ఎదిగారు. అయితే, ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు దక్షిణామూర్తి. ఇది శివుడి నామాల్లో ఒకటి. కానీ, క్రమక్రమంగా నాస్తికుడుగా మారిన కరుణానిధి దేవుడి పేరును తాను కలిగి వుండటం అంగీకరించలేదు. అందుకే, దక్షిణామూర్తి కాస్త కాలక్రమంలో కరుణానిధి అయ్యారు. దీని వెనుక కూడా ఒక పెద్ద ఉద్యమమే వుంది.

 

 

కరుణానిధి 14 ఏట నుంచే సామాజిక ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యారు. జస్టిస్ పార్టీ నేత అయిన అళగిరి స్వామి ప్రసంగాలకు ప్రేరితుడై ఒక యువజన సంఘం స్థాపించారు. తరువాతి కాలంలో ఒక విద్యార్థి సంఘం కూడా నెలకొల్పారు! అయితే, కరుణానిధి నాయకత్వ లక్షణాలకి అసలు అవకాశం 1953లో వచ్చింది. అప్పటి నెహ్రు ప్రభుత్వం తమిళనాడులోని కళ్లకుడి అనే ప్రాంతాన్ని దాల్మియాపురంగా మార్చాలని భావించింది. డీఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ, అనాటి 29 ఏళ్ల దక్షిణామూర్తి ఒకడుగు ముందుకేసి కదులుతున్న ట్రైన్ కు అడ్డంగా పడుకున్నారు. చివరకు, అరెస్టై జైలుకి వెళ్లారు. 35 రూపాయల ఫైన్ కట్టమంటే నిరాకరించి సంవత్సరం జైల్లో గడిపారు. ఆఖరుకు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కళ్లకుడి పేరు మార్చలేదు. అందుకోసం తీవ్రపోరాటం చేసిన దక్షిణామూర్తిని జనం కళ్లకుడి కొండ కరుణానిధి ( కళ్లకుడిని జయించిన కరుణానిధి! ) అని తమిళంలో పొగిడేవారు! అదుగో… అలా కరుణానిధి ఆయన మారు పేరైపోయింది! తరువాత అదే అసలు పేరైపోయింది.

 

 

మారిన పేరుతో చరిత్రలో తన పేరు రాసిపెట్టుకున్న కరుణానిధి తన అందరు సంతానానికి తమిళ పేర్లే పెట్టారు. సినిమా రచయిత, కవి అయిన కలైంగర్ కు తమిళం అంటే చాలా ఇష్టం. కాకపోతే, ప్రస్తుతం డీఎంకే పగ్గాలు కరుణ తరువాత అందుకోబోతోన్న స్టాలిన్ కు మాత్రం తమిళ భాషలో పేరు పెట్టేలేదు! అందరిలో కరుణానిధికి స్టాలిన్ అంటేనే ఎక్కువ ఇష్టం! అయినా ఆయనకు రష్యా నాయకుడి పేరు పెట్టటానికి కారణం… స్టాలిన్ చనిపోయేనాటికి కరుణానిధి చిన్న కుమారుడు కేవలం నాలుగు రోజుల పసివాడు. అతడికి స్టాలిన్ అని పేరు పెట్టుకుంటానని కరుణానిధి ఒక బహిరంగ సభలో ప్రకటించారు. అప్పట్లో భారత్ రష్యాకు దగ్గరగా వుండటంతో స్టాలిన్ చనిపోయిన తరువాత అనేక సంస్మరణ సభలు జరిగాయి. అలాంటి ఓ సభలోనే తన కొడుక్కి స్టాలిన్ అని పేరు పెట్టారు కరుణ! స్టాలిన్ కు నిజానికి కరుణానిధి పెట్టాలనుకున్న పేరు… అయ్యాదురై! ఎందుకంటే, ఆయన తన అభిమాన నేత పెరియార్ ను ‘అయ్యా’ అనేవారు. అలాగే మరో మహానేత అన్నాదురైలో దురై అనే పదం వుంది! ఈ రెండూ కలిపి అయ్యాదురై అని పెట్టాలనుకున్నారట. కానీ, అంతలోనే రష్యా కమ్యూనిస్టు పాలకుడు స్టాలిన్ మరణంతో ఆయన పేరు కరుణ కొడుక్కి స్థిరపడిపోయింది! అంతా సవ్యంగా సాగితే వచ్చే ఎన్నికల్లో ఈ భారతీయ స్టాలిన్ తమిళనాడును ఏలే ముఖ్యమంత్రి కావొచ్చు!

 

 

కరుణానిధి రచయిత, కవి అయినా కూడా ఎంతో తెలివితేటలున్న రాజకీయ నాయకుడు కూడా! డీఎంకే పార్టీకి అన్నాదురై తరువాత పెద్ద దిక్కైన ఆయన క్రమంగా ఆ పార్టీని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నాడు. ఆ క్రమంలో ఎంజీఆర్, వైగో లాంటి నాయకుల్ని అవతలకి పంపించాడు. చివరకు, తన కొడుకుల్లోనూ అంతగా నమ్మకం లేని పెద్ద కొడుకు అళగిరిని పక్కకు పెట్టేశాడు. చిన్న కొడుకు స్టాలిన్నే అందలం ఎక్కించారు. ఇప్పుడు డీఎంకేలో తిరుగులేని శక్తిగా స్టాలిన్ ఎదిగిపోయారు. అందుకు కారణం గత రెండు దశాబ్దాలుగా కరుణానిధి స్టాలిన్ ను పార్టీలో అంచెలంచెలుగా పెంచుతూ రావటమే! ఇది కరుణానిదిలోని రాజకీయ కోణం! ఇలాంటి వ్యూహాల కారణంగానే ఆయన సుదీర్ఘ ప్రస్థానం సాధ్యమైంది!

ముఖ్యమంత్రిగా పాలనలోనూ కరుణానిధి దేశంలో చాలా మందికి కొత్త దారులు చూపించారు. ఇవాళ్ల ఎన్నికల మ్యానిఫెస్టోలు విడుదల కాగానే మనకు వినిపించే ఫ్రీ గిఫ్టుల సంస్కృతి ఒక విధంగా ఆయనే పాప్యులర్ చేశారు. 1967లో మొదటిసారి సీఎం అయినప్పుడు చెన్నైలో మనుషులు లాగే రిక్షాలను ఆయన నిషేధించారు. వారికి సైకిల్ రిక్షాలను ఉచితంగా అందించారు. అలా మొదలైన ఆయన ఉచిత సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతూనే వచ్చింది. 1989లో ఉచిత విద్యుత్ కూడా ఆయనే మొదటిసారి అందించారు! ఇక 2006లో కరుణానిధి ఉచిత కలర్ టీవీలు అందిస్తామని ప్రకటించి సాటి రాజకీయ నేతలకి పెద్ద షాకే ఇచ్చారు!

 

 

కేవలం ఉచిత పథకాలే కాదు… పాలనలో అడుగడుగునా కరుణానిధి తన ముద్ర వేసే వారు. ఆయన వ్యక్తిగత జీవితంలో తాళికట్టమని పట్టుబట్టినందుకు ప్రేమను , ప్రేయసిని వదులుకున్నారు! ఎందుకంటే, ఆయన నాస్తికుడు కాబట్టి! కానీ, అదే కరుణానిధి ముఖ్యమంత్రిగా తమిళనాడులోని ఆలయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణాలకు ఎంత ఖర్చు చేశారో తెలుసా? 420 కోట్లకు పైనే! తన వ్యక్తిగత నమ్మకాలు పాలనలో ప్రభావం చూపనీయలేదాయన! అలాగే, పార్టీపైన , తన కుటుంబంపైనా కూడా ఆయన ఏనాడూ నాస్తికత్వం రుద్దలేదు. ఆయన ఇంట్లో పూజలు జరిగిన ఫోటోలు మీడియాలో వస్తే కూడా కరుణ చలించలేదు. తన నమ్మకాలు, ఇంట్లోని వారు విశ్వాసాలు వేరు వేరంటూ కుండబద్దలు కొట్టారు!

మాధవ సేవని నమ్మని కరుణానిధి మానవ సేవని మాత్రం మనస్ఫూర్తిగా నమ్మేవారు! అందుకే, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించారు. స్వయంగా తన తల్లి పేర ట్రస్టు స్థాపించి పేదలకు సాయం అందిస్తూ వస్తున్నారు. తన తదనంతరం తాను మొట్ట మొదటిసారి చెన్నైలో కొన్న గోపాలపురం ఇల్లు కూడా హాస్పిటల్ గా మార్చాలని ఆయన కోరుకున్నారు! ఇంత కాలం కలైంగర్ నివాసంగా వున్న ఆ భవనం ఇక మీదట ఆసుపత్రి కాబోతోంది! ఇలా బోలెడు విభిన్న కోణాల సమ్మేళనమే… కరుణానిధి! అందుకే, ఆయన తన ప్రస్థానం దేవుడ్ని నమ్మని నాస్తికుడిగా మొదలు పెట్టి… చనిపోయే క్షణానికి… కొన్ని లక్షల మందికి ‘దేవుడు’ కాగలిగారు!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.