కర్ణాటకలో సెమీ ఫైనల్ ఆడనున్న రాహుల్ గాంధీ

Publish Date:Mar 21, 2013

Advertisement

 

మే 5న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న సాధారణ ఎన్నికలకి సెమీ ఫైనల్స్ వంటివని చెప్పవచ్చును. దక్షిణాదిన ఏకైక బీజేపీ పాలిత రాష్ట్రమయిన కర్ణాటకలో రాహుల్ గాంధీ తన పార్టీని గెలిపించుకొనగలిగితే అది ఆయన సామర్ధ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతే కాకుండా అది వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడానికి, ఆయనకు అవసరమయిన మనోబలం కూడా కలిగిస్తుంది. ఎన్నికల షెడ్యుల్ వెలువడక ముందే ఒకసారి ఆ రాష్ట్ర పర్యటన చేసి అక్కడి పరిస్థితులను ఆరా తీసివచ్చిన ఆయన, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమీక్ష సమావేశాలు మొదలుపెట్టేసారు.

 

ఒకనాడు తిరుగులేని విధంగా ఆ రాష్ట్రాన్ని ఏలిన బీజేపీ ప్రభుత్వం, ప్రస్తుతం అవినీతి, అంతర్గత కుమ్ములాటలతో అత్యంత దయనీయమయిన పరిస్థితులలో చిక్కుకొని, కాంగ్రెస్ కొత్త రధసారధి రాహుల్ గాంధీకి అన్ని విధాల అనుకూలమయిన వాతావరణం కల్పించి ఆహ్వానిస్తోంది. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న ఇంత చక్కటి అవకాశం బహుశః మరెప్పుడూ, మరెక్కాడా కూడా ఆయనకి దొరకకపోవచ్చును.

 

కానీ, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల పద్దతులు, ఆలోచన తీరు, కులాల లెక్కల గురించి అవగాహన ఉన్న రాహుల్ గాంధీకి దక్షిణాది రాష్ట్రాల మీద అంత పట్టులేదనే చెప్పవచ్చును. అయితే, అతిరధ మహారధులు తోడున్నఆయనకి ఇదేమంత పెద్ద సమస్య కాదు. కానీ, గత రెండు దశబ్దాలుగా ఆ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడిన కాంగ్రెస్ పార్టీని ఇంత తక్కువ సమయంలో చక్కదిద్ది, వారిలోంచి గెలుపు గుర్రాలను ఎంచుకోవడమే ఆయన ముందున్న అతి క్లిష్టమయిన సమస్య అని చెప్పవచ్చును.

 

కర్ణాటక రాష్ట్రంలో తన కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దడమే కాకుండా రాహుల్ గాంధీకి మరో సవాలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును. అది తన రాజకీయ జీవితాన్ని సవాలు చేయనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నుంచి కావచ్చును. దక్షిణాదిన తనకున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కేవలం నాయకత్వ సమస్య కారణంగా బీజేపీ అంత తేలికగా వదులుకొంటుందని భావించలేము. గనుక, రాబోయే సాధారణ ఎన్నికలను నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న బీజేపీ, ఆయనను ఇప్పుడే ముందుంచుకొని కర్ణాటక ఎన్నికలలో రాహుల్ గాంధీని డ్డీ కొనవచ్చును. ఒకవేళ, బీజేపీ నరేంద్ర మోడీకి గనుక కర్ణాటక బాద్యతలు అప్పగించినట్లయితే, ఆయనను డ్డీ కొనడం రాహుల్ గాంధీకి తలకు మించిన పనే అవుతుంది.

 

కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రాహుల్ గాంధీకి వరమయితే, మంచి రాజకీయ అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు అనే మంచి పేరు నరేంద్ర మోడీకి సానుకూలాంశంగా ఉంటుంది. ఒకవేళ బీజేపీ తన అంతర్గత సమస్యల వలన నరేంద్ర మోడీకి కాకుండా మరెవరికి కర్ణాటక బాధ్యతలు అప్పగించినా అది రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి ఆ రాష్ట్రంలో మార్గం సుగమం చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన పురపాలక సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ , అధికార బీజేపీపై పూర్తి పై చేయి సాదించడమే బీజేపీ పట్ల ప్రజల వ్యతిరేఖతకు అద్దం పడుతోంది. అందువలన నరేంద్ర మోడీ తప్ప ఇతరులెవరు బీజేపీకి సారద్యం వహించినా కూడా, కర్ణాటక రాష్ట్రాన్ని పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అందించినట్లే అవుతుంది.

 

ఇదివరకు నితిన్ గడ్కారికి పార్టీ అధ్యక్షా పదవికి ఆఖరి నిమిషంలో గండికొట్టినట్లు, మళ్ళీ మోడీకి కూడా అడ్డుపడేందుకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఏమయినా పధకాలు ఉంటే, కర్ణాటకలో రాహుల్ గాంధీ ప్రయాణం సజావుగా సాగిపోతుంది. లేదంటే మాత్రం ఆయనకు మోడీతో అగ్నిపరీక్ష ఎదుర్కోక తప్పదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.