కర్ణాటక సీఎం యడ్డీకి ఉద్వాసన?

Publish Date:May 27, 2021

Advertisement

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఉద్వాసనకు రంగం సిద్దమవుతోందా... అంటే అధికార బీజేపీ వర్గాలు అవుననే అంటున్నాయి. నిజానికి యడియూరప్ప పదవీ గండాన్ని వెంటపెట్టుకునే ప్రమాణ స్వీకారం  చేశారు. అదెలా ఉన్నా, ఇంచుమించుగా సంవత్సర కాలంగా, ఈ ఉద్వాసన వార్త, రిపీటెడ్’గా వినవస్తూనే వుంది. అయితే, ఎప్పటికప్పుడు యడ్డీ ఎదో ఒక విధంగా గండం నుంచి గట్టెక్కుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ...ఇక గండం గట్టెక్కే మార్గం లేదని,అందుకే యడ్డీ కూడా షరతులతో తప్పుకునేందుకు సంసిద్దత వ్యక్త చేశారని అటు ఢిల్లీలో ఇటు బెంగళూరులో చోటు చేసుకుంటున్న పరిణామాలు సూచిస్తున్నాయి. 

చాలా కాలంగా యడ్డీ ఉద్వాసన వార్తలు వినవస్తున్నా ఇంతవరకు ఎవరూ మీడియా ముందుకు వచ్చి నోరు విప్పలేదు. కానీ , ఇప్పుడు కర్ణాటక రెవెన్యూ మంత్రి  ఆర్.అశోక్, బుధవారం , “అవును యడియూరప్పను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరో వంక యడియూరప్ప తమ పదవిని కాపాడుకునేందుకు పావులు కదుపు తున్నారు, తమ విధేయులను ఢిల్లీకి పంపి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు’’ అని మీడియా ముందు కొచ్చి నిజాన్ని చెప్పేశారు. అలాగే, ‘అవును అసమ్మతి నాయకుల సమావేశాలు జరుగుతున్నాయి. కొందరు మంత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరావుతున్నారు.కొందరు పరోక్షంగా మద్దతు నిస్తున్నారు .ఇవ్వన్నీ నిజం. యడియూరప్పను పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం” అని, అశోక కుండ బద్దలు కొట్టారు. అశోక్ ఓపెన్ స్టేట్మెంట్, అనుమానాలను బద్దలు చేస్తే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన యడ్డీ ఉద్వాసన ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. 

హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీఎన్ అస్వంత్ నారాయణ్ సహా మరో ముగ్గురు నలుగురు మంత్రులు మాత్రం, యడియూరప్ప ఉద్వాసన ఉండదని, అసలు అలాంటి అవకాశమే లేదని ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఏమి జరుగుతుందో ఏమో కానీ, చాలా చాలా కష్టపడి, 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలను గోడ దూకించి, రాష్టంలో అధికారంలోకి  వచ్చిన బీజేపీ ఇప్పుడు యడ్డీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది, అంతవరకు అయితే ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర లేదు. మంత్రి పదవులు వచ్చినవారు విధేయతను చాటుకుంటుంటే, పదవులు దక్కని ఎమ్మెల్ల్యేలు అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. 

ఇరు వర్గాలు తమ తమ వాదనని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. “కొంతమంది పదవులు దక్కని ఎమ్మెల్ల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కోరుకోవచ్చును, కానీ, అది జరగదు” అని చన్నగిరి ఎమ్మెల్యే మడల్ విరుపాక్ష ధీమా వ్యక్త పరిచారు. అంతే కాదు, యడియూరప్పను తప్పించాలనుకునే ఎమ్మెల్యేలకు  మళ్ళీ ఎన్నికల్లో గెలిచే సీన్  కూడా లేదు,అంటూ చులకన చేసి మాట్లాడుతున్నారు. అంతే కాదు, యడియూరప్పను ఎందుకు తప్పించాలి.. ఆయన చేసిన తప్పేంటి అని విరుపాక్ష ప్రశ్నిస్తున్నారు. అలాగే, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా, పార్టీలో కొన్ని విబేధాలు ఉన్నాయి, అయినా యడియూరప్ప పదవిలో కొనసాగుతారు అని అంటున్నారు.

ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, యడ్డీ ఉద్వాసన  ముహూర్తం దగ్గర పడిందని, అనిపిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలున్నాయి, మరోవంక, కొవిడ్ 19 నియత్రణలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు, కాబట్టి ఆయనకు ఎంత త్వరగా  ఉద్వాసన పలికితే రాష్ట్రానికి, ప్రజలకు అంత మంచిందని  సిద్దరామయ్య అన్నారు. ఈ అన్నింటినీ మించి, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా యడ్డీని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే, పార్టీ కేంద్ర నాయకత్వం, అసమ్మతి నాయకులు కోరుతున్న విధంగా అన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించేందుకు వచ్చే నెల మొదటివారంలో, శాసన సభ పక్ష సమావేశం  ఏర్పాటు చేయమని యడియూరప్పను కోరినట్లు అసమ్మతి నాయకులు చెపుతున్నారు.

అయితే, శాసన సభాపక్ష సమావేశం, అందుకోసమేనా .. యడ్డీకి ఉద్వాసన పలికేందుకేనా ? అనేది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న. కానీ, హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, ముఖ్యమంత్రి యడియూరప్ప  కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేందర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకొని కేంద్ర హోం మంత్రి అమిత్ షా’, బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ అరుయన్ సింగ్ ‘తో సమావేశం కావడం, ఈ సమావేశంలో  ఒకవేళ యడియూరప్ప నిజంగానే తప్పుకోవలసి వస్తే, ఆయనకు ఇష్తమైన, తమ వర్గానికి చెందిన వారికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని షరతులు విధించినట్లు తెలు స్తోంది. అయితే తామోచ్చింది ‘అందుకు’ కాదని, కొవిడ్ సమస్యలు చర్చించేందుకని బొమ్మై చెప్పుకొచ్చారు. అయితే, ఎవరు ఏమి చెప్పినా,యడ్డీ ఉద్వాసన ఈ సారి నిజంగానే తప్పేలా లేదు.
 

By
en-us Political News

  
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.