బొమ్మై కన్నీరు కథేంటో ..?

Publish Date:Jun 14, 2022

Advertisement

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కన్నీరు పెట్టుకున్నారు. ఒక విధంగా ఆయన ఏడ్చేశారు. అయితే, ఆయన కన్నీరు పెట్టుకుంది, రాజకీయంగా ఏదో ఇబ్బంది వచ్చికాదు.  అవును గతంలో అప్పటి ముఖ్యమంత్రి కుమారా స్వామి, సంకీర్ణ ప్రభుత్వ సారధ్య కష్టాలు తట్టుకోలేక అనేక పర్యాయాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు శాసన సభలో కూడా సంకీర్ణ  భాగస్వామ్య పక్షం, తనను అడుగడుగునా అడ్డు తగులుతూ, అవమానాలకు గురి చేస్తోందని ఆయన సభలో కన్నీరు పెట్టుకున్నారు.అయితే, పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా, బీజేపీ కాంగ్రెస్, జేడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి, గద్దె నెక్కి కూర్చుంది, అనుకోండి అది వేరే విషయం. 

అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మైకు కూడా రాజకీయ కష్టాలు లేక పోలేదు. ఆయన అధికార పగ్గాలు చేపట్టి ఇంకా నిండా సంవత్సరం అయినా పూర్తి కాలేదు. అయినా, ఇప్పటికే ఆయన కుర్చీ కిందకు నీళ్లోచ్చాయనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత యడ్యూరప్ప  ముఖ్యమత్రి  బొమ్మైకి పక్కలో బల్లెమై కూర్చున్నారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని, బొమ్మై వర్గీయులు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం, విచారణలు జరగడం వంటి క్రతువంతా జరిగింది, జరుగుతూనే వుంది. అయితే, బొమ్మై కన్నీరుకు రాజకీయాలు కారణం కాదు. 

ఒక సినిమా, అందులో కుక్క పాత్ర  అయన చేత కన్నీరు పెట్టించాయి. ఒకే సారి ఐదు భాషల్లో విడుదలైన, ‘777 చార్లీ’ సినిమా చూసి ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఈ చిత్రం ఆయనకు, ఒక సంవత్సరం క్రితం చనిపోయిన  తన పెంపుడు కుక్కను గుర్తుచేసింది. ఆ ఉద్వేగంలోనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. 

ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘777 చార్లీ’ చిత్రం ఒక్క బొమ్మైని మాత్రమే కాదు, ఆ సినిమా చుసిన చాలామంది చేత కంటతడి పెట్టిస్తోంది. నిజానికి, కుక్కలంత విశ్వాసపాత్రమైన జంతువూ మరొకటి ఉండదని అంటారు. అది చాలా మందికి అనుభవంలో ఉన్న విషయమే, ఇప్పుడు ఈ సినిమా కథ కూడా అదే. ఒక మనిషి, కుక్కకు  మధ్య అనుబంధాన్ని చక్కగా తెరకెక్కించిన చిత్రం ‘777 చార్లీ’. అందుకే ఈ చిత్రం ప్రేక్షకులను విరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి బొమ్మై కూడా వీక్షించారు.

‘కుక్కల మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి.కానీ ఈ చిత్రంలో ఒక జంతువులో ఉండే ఎమోషన్‌ను బాగా చూపించారు.అది కళ్లతోనే తన భావాలను పలికించింది.ఇది అందరూ వీక్షించాల్సిన చిత్రం. మనుషుల ప్రేమ కంటే కుక్క మనిషి పట్ల చూపే ప్రేమ షరతులు లేని ప్రేమ. అది స్వచ్ఛమైంది’ అంటూ ఆయన ఉద్వేగానికి గురయ్యారు. తన పెంపుడు కుక్క స్నూబీ గుర్తుకు రావడంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కొద్దిరోజుల ముందు అది మరణించింది. ఆ కుక్కతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన కన్నీరు పెట్టుకున్నారు. 

అయితే, ఆయన ఎందుకు కనీరు పెట్టుకున్నా, బొమ్మై కన్నీరు మీద సోషల్  మీడియాలో , ‘మంచి నటుడే’ వంటి పొలిటికల్ కామెంట్స్ కూడా రాకపోలేదు. అయితే, ఈ సినిమా  ఒక్క బొమ్మైని మాత్రమే కాదు, భూతదయ ఉన్న ఎవరినైనా ఈ సినిమా కన్నీరు పెట్టిస్తుందని అంటున్నారు. అయితే మాత్రమేంటి, రాజకీయాలకు కాదేదీ అనర్హం, అనే కదా అంటారు.

By
en-us Political News

  
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.