కమలంలో కారు విలీనం?.. తెర పైకి కొత్త చర్చ!

Publish Date:May 30, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మరో సంచలనానికి తెర తీశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగున్నాయని  మీడియా చిట్ చాట్ లో చెప్పారు. నిజానికి మై డియర్ డాడీ  అంటూ కేసేఅర్ కు రాసిన, లేఖలోనూ కవిత, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధాలని ప్రస్తావించారు. వరంగల్ రజతోత్సవ సభలో  కేసీఆర్ బీజేపీ పట్ల కొంత మెతక వైఖరి అవలంబించారనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.  బీజేపీని గట్టిగా తిట్టకపోతే.. బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయనే తప్పుడుసంకేతాలు ప్రజల్లోకి వెళతాయని అంటూ..  కేసీఆర్ తమ ప్రసంగంలో కేవలం రెండు నిముషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడాన్ని నెగటివ్ పాయింట్స్ లో  చేర్చారు. 

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న  కొత్త చర్చను తెర పైకి తెచ్చారు. అయితే..  కవిత లేఖలో పేర్కొన్న అంశాలలో కొంత నిజం ఉన్నా..  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఎలా చూసిన అయ్యే పని కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి  కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీలోనే కాదు, కాంగ్రెస్ సహా మరే పార్టీలోనూ విలీనం చేయరని..  ఒక్క ఏన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ అస్తిత్వాన్ని చంపుకునే తప్పు కేసీఆర్ చేయరని ఆయన సన్నిహితులు అంటున్నారు.  నిజానికి.. గతంలో ఉద్యమ సమయంలోనూ కేసీఆర్  తెలంగాణ సాధించుకునే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్  ముందు విలీనం ప్రతిపాదనను ఉంచారని..  ఒక పావుగా మాత్రమే విలీనం ప్రతిపాదన  చేశారని  కేసీఆర్ మాజీ మిత్రులు అంటున్నారు. 

అయితే..  బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టి వేయలేమని మాజీ మిత్రులతోపాటుగా,  ప్రస్తుత పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. నిజానికి..  ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల పొత్తు ఉభయ తారకంగా రెండు పార్టీలకూ లాభ దాయకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులతో పాటుగా  ఉభయ పార్టీలలో ఒక వర్గం గట్టిగా భావిస్తోంది. అయితే..  అదే సమయంలో రెండు పార్టీలలోనూ కూడా పొత్తు వద్దనే వాదన కూడ అంతే బలంగా వినిపిస్తోందని అంటున్నారు.   

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలను, ఉభయ పార్టీల ఓటు షేర్ లో వస్తున్న మార్పును గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ ఓటు పరస్పరం బదిలీ అవుతున్న వైనం కనిపిస్తుందని  విశ్లేషకులు అంటున్నారు.  ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. బీజేపీకి వచ్చిన ఓటు షేర్  జస్ట్ 7 శాతం. అసెంబ్లీలో కమలానికి దక్కింది ఒక్కటే సీటు..  కానీ, ఆతర్వాత కొద్ది నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్  ఏకంగా 20 శాతానికి పెరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ ఓటు షేర్ తగ్గింది. 

అలాగే..  2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14 శాతం ఓట్లు 8 సీట్లు వచ్చాయి.  కానీ.. 2024లోక్ సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ ఓటు షేర్ ఏకంగా 35 శాతానికి చేరింది.  అసెంబ్లీ స్థానాలతో సమానంగా  8 లోక్ సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. మరోవంక అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓటు షేర్ సొంతం చేసుకున్న బీఆర్ఎస్ ఓటు షేర్ లోక్ సభ ఎన్నికల్లో  17 శాతానికి పడిపోయింది. అంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిన ఓటర్లలో 20 శాతం మంది లోక్ సభ ఎన్నికల్లో కమలానికి ఓటు వేశారు. ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు షేర్ లో మార్పు అంతగా లేదు.  అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం ఓటుతో 65 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, అదే 40 శాతం ఓటుతో లోక్ సభ ఎన్నికలలో 8 సీట్లు తెచ్చుకుంది.
సో.. కళ్ళ ముందున్న ఓటు షేర్ లెక్కలు.  ఓటు ట్రాన్స్ఫర్  ప్యాట్రన్  ను గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉభయతారకంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా, జాతీయ పార్టీగా బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో గెలుపు, కేంద్రంలో అధికారం కీలకం. అదే విధంగా ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్  కు అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, రాష్టంలో అధికారం కీలకం అవుతుంది. సో.. పొత్తుకు ఉభయ పార్టీలు ఒకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. 

అయితే.. నడుస్తున్న చరిత్రను గమనిస్తే, గడచిన పాతికేళ్ళ ప్రస్థానంలో బీఆర్ఎస్  కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ, బీజేపీతో మాత్రం ఏనాడూ పొత్తు పెట్టుకోలేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాల లేదు. మరో వంక   కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలలో కలిసి పనిచేసింది. ఉభయ పార్టీలూ చెట్టపట్టాల వేసుకుని పనిచేయడమే కాదు, ఎమ్మెల్యేలను ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని, బీఆర్ఎస్ తో పొత్తు వద్దకునే బీజేపీ నాయకులు చరిత్రను తిరగేస్తున్నారు. అలాగే, కమలంతో పొత్తు వద్దనుకునే  బీఆర్ఎస్ నాయకులు, డీఎన్ఎలు కలవని బీజేపీతో పొత్తు వలన దీర్ఘ కాలంలో ప్రమాదమే  పేస్ చేయవలసి ఉంటుందని అంటున్నారు.  సో .. కవిత చెప్పిన విలీనం ఉండక పోవచ్చిని, అయితే గియితే కారు కమలం మధ్య తొలి  ‘పొత్తు’ పొడిచే అవకాశం లేక పోలేదని అంటున్నారు.

By
en-us Political News

  
వ‌న్ విన్ ఎన‌ఫ్- టు క్రియేట్ బెట‌ర్ బ‌జ్ ఇన్ ఫ్యూచ‌ర్ అంటారు. ఈ ఒక్క విజ‌యం కోసం ఎన్నో ఏళ్ల నిరీక్ష‌ణ అవ‌స‌ర‌మైంది ద‌క్షిణాఫ్రికాకు. ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌క్షిణాఫ్రికాకు ఎంద‌రో కెప్టెన్లుగా ప‌ని చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు.
సొంత ఇంట్లో అడుగుపెట్టలేని విధంగా తయారైంది అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకరరెడ్డి ఇచ్చిన అల్టిమేటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుపెట్ట లేకపోతున్నారు.
మంత్రి నారా లోకేశ్‌ తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు
తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగా నియమితులైన సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు.
బవుమా.. బవుమా.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మార్మోగిపోతున్న పేరిది. డబ్ల్యూటీసీ ఫైనల్లో బవుమా దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా జట్టును నడిపించిన తీరు.. బ్యాటర్‌గా సాగించిన పోరాటం గురించి అందరూ కొనియాడుతున్నారు.
ఈనెల 21వ తేదీన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు . ఆ మేరకు ఆయన పర్యటన ఖరారు అయింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు.
అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలి కూలి 274 మంది మరణించిన దుర్ఘటన మరవక ముందే ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు. తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న పార్టీ. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొంత వెనుకబడింది.
గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం వైసీపీకి అలవాటే. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం.. ఆ పార్టీకి ఆవిర్భావం నుంచీ కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ అదే చేసింది. న్యాయ సమీక్షకు నిలబడని ఆరోపణలతో తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధించి, తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.