పెద్దల సభకు భారతీయుడు !

Publish Date:May 30, 2025

Advertisement

 

రాజకీయ, సినిమా రంగాల సంబంధ బాంధవ్యాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ, సినిమా రంగాలు పాలు నీళ్ళలా కలిసి పోయాయి. తమిళ రాజకీయాలు అనగానే తెరఫై కొచ్చే, మాజీ ముఖ్యమంత్రులు ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత మొదలు ద్రవిడ పార్టీల ముఖ్య నాయకులు చాలావరకు, సిల్వర్ స్క్రీన్’ తో ఓ వెలుగు వెలిగినవారో, వెలుగుతున్నవారో అవుతారు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత స్టాలిన్’ రాజకీయ స్టేజిపైనే కానీ, సిల్వర్ స్క్రీన్ పై నటించిన అనుభవం ఉండకపోవచ్చును.

 కానీ,ఆయన తండ్రి మాజీ ముఖ్యమత్రి కరుణానిధి,కుమారుడు,ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్ ఇద్దరూ, వెండి తెర వెలుగులే... ముఖ్యమంత్రి  స్టాలిన్’ కు కూడా సినిమా రంగంతో డైరెక్ట్ లింక్స్ లేక పోవచ్చేమో కానీ, పరోక్ష బంధాలు లేకుండా ఉండవు. అదలా ఉంటే, ఇప్పడు తమిళనాడు నుంఛి మరో ప్రముఖ నటుడు,రాజకీయ చిత్రం ‘భారతీయుడు’ సినిమా ఫ్రేమ్’  కమల్ హసన్’ అధికార డిఎంకే మద్దతుతో రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. కమల హసన్’ తమిళ సినిమా ద్వారా బాల నటుడిగా పరిచయం అయినా, ఆ తర్వాత  తెలుగు’, హిందీ, కనడ భాషలు సహా అనేక భాషా చిత్రాల్లో నటించారు. బహు బాషా నటుడిగా గుర్తింపు, గౌరవం పొందారు. పురస్కారాలు అందుకున్నారు.కమల్ హసన్ వ్యక్తిగత జీవితంలో కొన్ని మచ్చలు, మరకలు ఉన్నా, సినిమా నటుడిగా మాత్రం ఆయన అద్భుత ప్రతిభను చూపారు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ హసన్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు అందుకున్నారు.

2014లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.ఇక కమల్ హసన్ రాజకీయాల విషయానికి వస్తే, 2018లో అనూహ్యంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. నిజానికి, ఆ సమయంలో మరో ప్రముఖ తమిళ హీరో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న ముమ్మర ప్రచారం జరుగతున్న సమయంలో ఆయన ఎందుకో వెనక్కు తగ్గారు. ఆ సమయంలో కమల్ హసన్’ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి నుంచి వామ పక్ష భావాలున్న వ్యక్తిగా, కూడా కమల్ హాసన్’  అదే అదే ఐడియాలజీతో సొంత పార్టీని తెరపైకి తెచ్చారు. రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయాలలో మార్పు కోసం, ‘మార్పే’ లక్ష్యంగా., మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించారు. అయితే,పార్టీ పెట్టినప్పటి నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ ఎంఎన్ఎం పోటీచేసింది. పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ ఓడిపోయింది. కనీసం, ఓ చిన్న గెలుపు కూడా దక్కలేదు. హిట్’ అన్నదే లేకుండా ప్రతి ఎన్నికల్లోనూ హీరో పార్టీ జీరోగా మిగిలింది. 

చివరకు, అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆశయంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హసన్’ స్వయంగా కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఆయన పరాజయం చవిచూశారు. అక్కడితో ఆయనకు, సినిమా, రాజకీయం ఒకటి కాదనే తత్త్వం బోధపడింది. ఇక చేసేది లేక చివరకు 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు  ఇండియా కూటమిలో చేరారు. ఎన్నికలలో పోటీ  చేయలేదు కానీ, డిఎంకేకు మద్దతు ఇచ్చారు. డిఎంకే అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు.అందుకు పారితోషికంగా కాదంటే ప్రతిఫలంగా ఆయన్ని రాజ్య సభకు పంపేందుకు అధికార డీఎంకే పార్టీ నిర్ణయించింది.తమిళనాడులో జులై 2025లో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ సీట్లలో నాలుగు డీఎంకే కూటమికి, రెండు అన్నాడీఎంకే కూటమికి దక్కే అవకాశం ఉంది. డీఎంకే తమ నాలుగు సీట్లలో ఒకదాన్ని కమల్ హాసన్‌కు కేటాయించింది. సో.. చివరాఖరుకు చట్ట సభలో కాలు పెట్టాలన్న భారతీయుడదు, కమల హసన్ కల,ఈ విధంగా నెరవేరుతోంది. 


రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, జరగనున్నాయి.నామినేషన్ల ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అదలా ఉంటే, ఈ మధ్యనే రాజకీయ అరంగేట్రం చేసిన మరో తమిళ హీరో, టీవీకే పార్టీ విజయన్’కు బీజేపీ వల విసిరింది. డిఎంకే అవినీతి పాలనను అంతమొందిచడమే ఇరు పార్టీల లక్ష్యం కాబట్టి,విజయన్ ఎన్డీఎలో చేరాలని, తమిళనాడు బీజేపే అధ్యక్షుడు, నయినార్‌ నాగేంద్రన్‌ .. విజయన్ను  ఆహ్వానించారు. హీరోగారూ అవినీతి డిఎంకే పార్టీని ఓడిద్దాం,మా కూటమిలోకి రండి,, అంటూ బహిరంగ ఆహ్వానం పలికారు. అయితే, విజయన్ పార్టీ పెట్టింది మొదలు, బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. సో .. ఇప్పడు ఆయన తమ స్టాండ్ మార్చుకుని బీజేపీతో జట్టు కడతారా? ఎన్డీఎ కూటమిలో చేరతారా? అనేది తేలవలసి వుంది. కాగా, విజయన్’ను ఎన్డీఎ కుతమిలోకి తెచ్చేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్’తో పాటుగా, తెలుగు దేశం పార్టీతో సంనిహతంగా ఉండే మరి కొందరు సినిమా ప్రముఖులు ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.