Publish Date:Jan 31, 2025
కల్వకుంట్ల కుటుంబాన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా స్కాంలు చుట్టుముడుతున్నాయా? అవినీతి, అక్రమార్జన విషయంలో వారు ఆరోపణల ఊబిలో కూరుకుపోయారా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తుంటే ఔననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, కుమారుడూ కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఇప్పటికే అరెస్టై బెయిలుపై ఉన్నారు. ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిండా మునిగి ఉన్నారు. ఈ విషయంలో నిధుల మళ్లింపు జరిగిందనీ, దానిలో కేటీఆర్ ప్రమేయానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనీ కోర్టులు కూడా వ్యాఖ్యానించాయి. ఆయనకు ముందస్తు బెయిలు తిరస్కరించాయి. ప్రస్తుతం ఆయన ఏసీబీ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్నారు.
ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై బెయిలుపై విడుదలైన కవితపై అదే మద్యం విషయంలో మరోమారు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సారి ఆరోపణలు కేరళ మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి వచ్చిన తరువాత చాలా కాలం పాటు మౌనాన్ని ఆశ్రయించిన కవిత ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ.. రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. అంతలోనే కేరళ మద్యం విధానంలోనూ కుంభకోణం జరిగిందనీ, అందులో కూడా కవిత ప్రమేయం ఉందనీ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆరోపణలకు చేసింది కేరళ విపక్ష నేత వీడీ సతేషన్ చేశారు.
ఢిల్లీలో జరిగిన విధంగానే కేరళలోనే మద్యం విధానంలో పెద్ద కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రధాన పాత్ర పోషించారనీ ఆయన ఆరోపించారు. కవిత పలుమార్లు కేరళ వచ్చి ఓ కంపెనీకి మద్యం ప్లాంట్ల కోసం లాబీయింగ్ చేశారని సతేషన్ ఆరోపణలు గుప్పించారు. కేరళలో అధకారంలో ఉన్న వామపక్ష కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే ఇదంతా జరిగిందన్న నతేషన్ కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేరళలో ఈ మద్యం కుంభకోణం 2023లో జరిగిందని చెప్పిన ఆయన పాలక్కాడ్లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ లిమిటెడ్ పేరుతో భారీగా భూములు సేకరించారని , ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసి మరీ ఆ సంస్థకు మద్యం తయారీ లైసెన్సు మంజూరు చేశారని సతేషన్ ఆరోపించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ లు ఏకపక్షంగా వ్యవహరించి మరీ లైసెన్సులు మంజూరు చేశారన్నారు. ఇదంతా కల్వకుంట్ల కవిత కేరళ వచ్చి పెద్దలతో భేటీల తరువాతే జరిగిందని సతీష్ ఆరోపణ. ఈ ఆరోపణలను కవిత ఖండించారు. అయితే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టై బెయిలుపై ఉన్న నేపథ్యంలో తాజా ఆరోపణలపై ఆమె ఖండనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు సరికదా.. నిప్పు లేకుండా పొగరాదుగా అని వ్యాఖ్యానిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-in-another-liquor-scam-25-192149.html
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.