తొమ్మిదో తేదీ రాఖీ పండగ వస్తోంది. అన్నా చెల్లెళ్ల బంధం మరంత పెరుగుతుందేమో అని చూస్తే.. కేటీఆర్ టార్గెట్ గా కవిత మరిన్ని అస్త్రాలు సంధించడంతో గులాబీ దళాలు మరింత నీరసపడ్డట్టు తెలుస్తోంది. జగదీశ్వర్ రెడ్డిలాంటి వారి చేత తనను తిట్టించడం వెనక పెద్ద నాయకుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయ్. నేను ఎవరా? నేనెవరో తెలీకుండానే జగదీశ్వర్ రెడ్డి ఇన్నాళ్లూ పార్టీలో ఉన్నడా? అంటూ నిలదీయడమే కాకుండా.. జగదీశ్ రెడ్డిని లిల్లిపుట్ అంటూ సంబోధించి.. తన అక్కసు మొత్తం తీర్చుకున్నారు కల్వకుంట్ల కవిత.
ఇప్పటికే కాళేశ్వరం మీద సిట్ వేస్తారన్న వార్తలు వినవస్తున్నాయ్. అసెంబ్లీలో చర్చకు ఆస్కారముంది. మూడ్రోజుల పాటు సభ పెట్టి సభ్యులందరికీ నివేదిక ఇచ్చి సిట్ వేయడమా? చర్చలకు ఉపక్రమించడమా? అన్నది తేల్చనున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అభిప్రాయం అడిగి తెలుసుకోనున్నారు. అసలేం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ జరగనుంది.
ఒకపక్క తండ్రి పరువు ఈ స్థాయిలో పోతుంటే.. తనయ దానిని అడ్డుకోవల్సింది పోయి.. రోజుకో రచ్చ. దీంతో ప్రత్యర్ధులు దించే గునపాలన్నా బలమైన గాయాలు తగులుతున్నాయి కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు అంటున్నారు. ఇంటి మనిషైన కవిత వెనక నుంచి అనుకోని సమయంలో అనుకోని విధంగా దించుతున్న ఈ గునపాల నొప్పి మరింత ఎక్కువగా ఫీలవుతున్నారట అధినేత కేసీఆర్.
ఎవరు అవునన్నా కాదన్నా.. తన తర్వాత అంతటి స్థాయిలో తన కొడుకు కేటీఆర్ ఈ పార్టీకి కాబోయే రాజు ప్రస్తుత యువరాజు. అలాంటి యువరాజు పట్ల కనీసం గౌరవ మర్యాదలు చూపకుండా కవిత పరోక్షంగా చేస్తున్న కామెంట్లు కేసీఆర్ కి గట్టిగానే తగులుతున్నట్టు సమాచారం. ఒక సమయంలో చంద్రబాబులా తాను కూడా ఒక్కడ్నే కని ఉంటే ఈ గొడవలే లేక పోయేవని ఫీలవుతున్నారట పెద్ద సారు. అంతగా కవిత సూటి పోటి మాటలు ఆయన గుండెల్లో సలుపుతున్నాయట.
ఇంకో సస్పెన్స్ ఏంటంటే వచ్చే రాఖీ పండక్కి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుందా కట్టదా? ఇదొక చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కేటీఆర్ కేంద్రంగా అనేక కామెంట్లు చేసి ఉన్నారు. ఈ క్రమంలో అన్నకు చెల్లె రాఖీ కడతదా కట్టదా? అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నట్టు సమాచారం.
ఇక తాజా కబర్ విషయానికి వస్తే తనను కవిత లిల్లీ పుట్ అన్న విషయంపై చర్చించడానికి జగదీశ్వర్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చారు. తన ఉద్యమ ప్రస్తానం గురించి తెలీకుండా పార్టీని జిల్లాలో నాశనం చేశాడంటూ ఆమె తిట్టడంపై కేసీఆర్ తో కలసి చర్చించేలా తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-comments-hurting-kcr-badly-25-203459.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.