Publish Date:Jul 15, 2022
ఇంజనీరింగ్ అద్బుతంగా, టీఆర్ఎస్ ప్రభుత్వ ఘన విజయంగా కేసీఆర్ ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వస్తున్న కాళేశ్వరం బండారం భారీ వర్షాలకు బట్టబయలైంది. చాలా కాలంగా కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం అవినీతి మయం అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎమ్ అంటూ దుయ్యబడుతూనే ఉన్నారు. ఆ విమర్శలను, ఆరోపణలనూ ఇంత కాలం ఖండిస్తూ వచ్చిన టీఆర్ఎస్ ఇటీవలి వర్షాలకు కాళేశ్వరం పంప్ హౌస్ మునిగిపోయి నీటిని ఎత్తిపోయడానికి వీల్లేనంతగా ధ్వంసమవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ సర్కార్ డిఫెన్స్ లో పడింది.
చాలా కాలంగా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరు చెప్పి కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శిస్తూ వస్తున్న విపక్షాలు ఇప్పుుడు వారి విమర్శలకు మరింత పదును పెట్టాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు కేసీఆర్ అవినీతిని బ్లాక్ అండ్ వైట్ లో బయటపెట్టేశాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునిగిపోయి మరో మూడు నాలుగేళ్ల వరకూ ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాళేశ్వరం మునకకు ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతే కారణమని ధ్వజమెత్తారు. వరద ముంపులో బాధితులు అష్టకష్టాలూ పడుతున్నా రాష్ట్రం వారికి సహాయ సహకారాలందించే విషయంలో మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు.
కాంగ్రెస్ శ్రేణుులు వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గురువారం మీడియాలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైందనీ, బాధితులను ఆదుకునేందుకు వెంటనే తక్షణ సాయం కోసం కేంద్రానికి లేఖ రాయాలనీ డిమాండ్ చేశారు. వరద ప్రబావిత ప్రాంతాలలో తాను ఈ నెల 17న పర్యటిస్తానని రేవంత్ చెప్పారు.
అంతకు ముందు రాహుల్ చేపట్టనున్న భారత్ జోడో యాత్రపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కార్ దేశాన్ని మతాలు, కులాల వారీగా విభజించి విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 150 రోజుల పాటు 3600 కిలోమీటర్లు సాగే రాహుల్ గాంధీ జోడో యాత్ర మక్తల్ వద్ద తెలంగాణలో ప్రవేశించి జుక్కల్ మీదుగా నాందేడ్ కు వెళుతుందన్నారు.
రాహుల్ యాత్రను తెలంగాణలో బ్రహ్మాండంగా నిర్వహిస్తామని రేవంత్ అన్నారు. కేసీఆర్ ను విమర్శిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎందుకు ఆగ్రహం వస్తోందో ప్రజలు గ్రహించాలన్నారు. ఆ రెండూ పార్టీలూ కలిసే రాజకీయ డ్రామాలాడుతున్నాయన్నారు. బండి సంజయ్ కార్యక్రమం పెట్టుకున్న సమయంలోనే రేవంత్ కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించడమేమిటని బండి సంజయ్ విమర్శించడాన్ని రేవంత్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో క్రియాశీలంగా ఉందనీ, ఎవరి కోసమే కాంగ్రెస్ తన కార్యాచరణను ఆపదని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kaleswaram-pump-house-drown-with-heavy-rains-and-floods-25-139770.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.