Publish Date:Jul 15, 2022
ఇంజనీరింగ్ అద్బుతంగా, టీఆర్ఎస్ ప్రభుత్వ ఘన విజయంగా కేసీఆర్ ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వస్తున్న కాళేశ్వరం బండారం భారీ వర్షాలకు బట్టబయలైంది. చాలా కాలంగా కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం అవినీతి మయం అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎమ్ అంటూ దుయ్యబడుతూనే ఉన్నారు. ఆ విమర్శలను, ఆరోపణలనూ ఇంత కాలం ఖండిస్తూ వచ్చిన టీఆర్ఎస్ ఇటీవలి వర్షాలకు కాళేశ్వరం పంప్ హౌస్ మునిగిపోయి నీటిని ఎత్తిపోయడానికి వీల్లేనంతగా ధ్వంసమవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ సర్కార్ డిఫెన్స్ లో పడింది.
చాలా కాలంగా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరు చెప్పి కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శిస్తూ వస్తున్న విపక్షాలు ఇప్పుుడు వారి విమర్శలకు మరింత పదును పెట్టాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు కేసీఆర్ అవినీతిని బ్లాక్ అండ్ వైట్ లో బయటపెట్టేశాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునిగిపోయి మరో మూడు నాలుగేళ్ల వరకూ ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాళేశ్వరం మునకకు ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతే కారణమని ధ్వజమెత్తారు. వరద ముంపులో బాధితులు అష్టకష్టాలూ పడుతున్నా రాష్ట్రం వారికి సహాయ సహకారాలందించే విషయంలో మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు.
కాంగ్రెస్ శ్రేణుులు వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గురువారం మీడియాలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైందనీ, బాధితులను ఆదుకునేందుకు వెంటనే తక్షణ సాయం కోసం కేంద్రానికి లేఖ రాయాలనీ డిమాండ్ చేశారు. వరద ప్రబావిత ప్రాంతాలలో తాను ఈ నెల 17న పర్యటిస్తానని రేవంత్ చెప్పారు.
అంతకు ముందు రాహుల్ చేపట్టనున్న భారత్ జోడో యాత్రపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కార్ దేశాన్ని మతాలు, కులాల వారీగా విభజించి విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 150 రోజుల పాటు 3600 కిలోమీటర్లు సాగే రాహుల్ గాంధీ జోడో యాత్ర మక్తల్ వద్ద తెలంగాణలో ప్రవేశించి జుక్కల్ మీదుగా నాందేడ్ కు వెళుతుందన్నారు.
రాహుల్ యాత్రను తెలంగాణలో బ్రహ్మాండంగా నిర్వహిస్తామని రేవంత్ అన్నారు. కేసీఆర్ ను విమర్శిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎందుకు ఆగ్రహం వస్తోందో ప్రజలు గ్రహించాలన్నారు. ఆ రెండూ పార్టీలూ కలిసే రాజకీయ డ్రామాలాడుతున్నాయన్నారు. బండి సంజయ్ కార్యక్రమం పెట్టుకున్న సమయంలోనే రేవంత్ కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించడమేమిటని బండి సంజయ్ విమర్శించడాన్ని రేవంత్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో క్రియాశీలంగా ఉందనీ, ఎవరి కోసమే కాంగ్రెస్ తన కార్యాచరణను ఆపదని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kaleswaram-pump-house-drown-with-heavy-rains-and-floods-39-139769.html
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.