Publish Date:Jul 17, 2025
కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అంటారు సీఎం రేవంత్. కానీ ఇక్కడ సీన్ చూస్తే అది కొందరు ఉన్నతాధికారుల పాలిట కాసుల కల్పవృక్షం అన్నది తెలుస్తోంది. మొన్న హరిరాం అనే ఈఎన్సీ పట్టుబడితే అతడి అక్రమాస్తుల విలువ వంద కోట్లు. అదే ఓపెన్ మార్కెట్లో రెండు వందల యాభై కోట్లు. తర్వాత నూనె శ్రీధర్ అనే మరో ఈఈ పట్టుబడితే ఇతడి ఆస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు ఏసీబీ అధికారులు. అయితే దీని మార్కెట్ వాల్యూ 450 కోట్ల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అనే ఈ పెద్దమనిషి అక్రమాస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు. దీని ఓపెన్ మార్కెట్ వాల్యూ కూడా 450 నుంచి ఐదు వందల కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఈ ముగ్గురి అక్రమాస్తుల విలువే వెయ్యికోట్ల పై మాట.
ఈ ముగ్గురి అక్రమార్జన కథ ఒక్కొక్కొరిదీ ఒక్కో ప్రత్యేక అవినీతి అధ్యాయంగా చెబుతారు. శ్రీధర్ తన అక్రమార్జన ద్వారా వచ్చిన డబ్బు ఏం చేయాలో అర్ధం కాక కొడుకు పెళ్లి థాయ్ ల్యాండ్ లో చేశారట. ఇక మురళీధర్ రావు తన కొడుకును ఒక కంపెనీలో బలవంతానా డైరెక్టర్ గా చేసి.. ఈ కంపెనీకి కాళేశ్వరం సబ్ కాంట్రాక్టులు వచ్చేలా చేసి.. తద్వారా తన అవినీతి సొమ్ము ఏరులై పారించారట.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పదవీకాలం పూర్తయిన ఈ ఈఎన్సీని అదే పనిగా.. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే మురళీధరరావు అనే ఈ ఈఎన్సీ అవినీతి సరళి ఎలా సాగిందంటే.. ప్రతి సంతకానికి విలువ కట్టడం. బిల్లులు ఆపేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి.. ఆపై తన బంధు మిత్రులకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించడం.. ఇదీ ఈయనగారి నిర్వాకం. దీంతో కుప్పలు తెప్పలుగా అక్రమాస్తులు కూడబెట్టిన ఘనత ఈయన సొంతంగా చెబుతున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.
పై స్థాయి అధికారులే ఒక్క కాళేశ్వరం పేరు చెప్పి వెయ్యి కోట్ల పైగా కూడేస్తే.. కింది స్థాయి అధికారుల మాటేంటి? ఆపై ఈ మొత్తం ప్రాజెక్టు రూపకల్పన చేసిన ఆ పై స్థాయి వారి మాటేంటి? అన్నదిప్పుడు ఎవరికీ అంతు చిక్కడం లేదట.
ఈ ప్రాజుక్టును 80 వేల 500 కోట్లతో మొదలు పెట్టగా.. దాని అంచనా వ్యయాలను అంచలంచలుగా పెంచీ పెంచీ లక్షా ముప్పై వేల కోట్లకు చేర్చారట. ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టునే వంద సార్లకు పైగా.. రివైజ్ అంచనాలను పెంచి ప్రాజెక్టు కాస్ట్ పైపైకి ఎగబాకేలా చేశారట. దీన్నిబట్టీ ఈ ప్రాజెక్టు కూలేశ్వరమా.. లేక కాసులు రాల్చేశ్వరమా? అర్ధం చేసుకోవాలంటారు ఇరిగేషన్ నిపుణులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kaleswaram-corruption-sky-is-the-limit-25-202120.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.