Publish Date:May 15, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించి, ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి కలిగిస్తున్నది కడప లోక్ సభ నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఎంట్రీతో కడప లోక్ సభ నియోజకవర్గ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
గత రెండు ఎన్నికలలో అంటే 2014, 2019 ఎన్నికలలో వైసీపీ ఆధిపత్యం కొనసాగిన కడపలో షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగడంతో వైసీపీ ఆధిపత్యానికి భారీగా గండి పడింది. గత రెండు ఎన్నికలలో కూడా షర్మిల వైసీపీ విజయం కోసం శ్రమించారు. ప్రచారం చేశారు. ఆ రెండు ఎన్నికలలో వైఎస్ కుటుంబం ఏకతాటిపై నిలిచి వైసీపీకి అండగా నిలిచారు. అయితే ప్రస్తుతానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. వైఎస్ కుటుంబం మొత్తం షర్మిల వెనుక నిలబడింది.
వీటన్నిటి కంటే ప్రధానంగా చెప్పుకోవలసింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ అన్న జగన్ పై వార్ ప్రకటించిన షర్మిలకు, వివేకా కుమార్తె డాక్టర్ సునీత అండగా నిలిచారు. దీంతో కడప లోక్ సభ స్థానం నుంచి రెండు సార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ పై కన్నేసిన అవినాష్ రెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురౌతున్నాయి.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. షర్మిల విమర్శలు, ప్రశ్నల ధాటికి ఉక్కిరిబిక్కిరై.. వాటిని అడ్డుకునేందుకు కడప కోర్టును ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో షర్మిల సెంటిమెంట్ ను ఆశ్రయించారు. వైఎస్ బిడ్డను కొంగుచాచి అడుతున్నా అంటే ఓటర్లకు చేసిన అభ్యర్థన కడప వాసుల హృదయాలను నేరుగా తాకిందని విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని అర్థం చేసుకున్న జగన్ చెల్లెలి చీర రంగును సైతం కామెంట్ చేస్తూ షర్మిల తెలుగుదేశం పలుకులు పలుకుతోందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కడపలో వైసీపీకి తీరని నష్టం చేకూర్చాయి. పార్టీలకు అతీతంగా షర్మిలకు మద్దతు వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నియోజవర్గంలో పోలింగ్ సరళిని నిశితంగా గమనించిన పరిశీలకులు కడప ఓటర్లు షర్మిలకే జై కొట్టారని విశ్లేషిస్తున్నారు. అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం ఓట్లు లోక్ సభ స్థానానికి వచ్చేసరికి షర్మిలకు, అసెంబ్లీ స్థానం వరకూ సొంత పార్టీకీ పడ్డాయని అంటున్నారు. అదే వాస్తవమైతే కడపలో షర్మిల విజయం నల్లేరు మీద బండినడకేనని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kadapa-voter-favours-sharmila-39-176080.html
ఐసీసీ మెగా టోర్నమెంట్లలో పాకిస్థాన్ పై విజయాల సంప్రదాయాన్ని భారత్ కొనసాగిస్తోంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం (జూన్ 9)న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
కేంద్రమంత్రిగా గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
కేంద్రమంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.
భారత ప్రధానిగా ఆదివారం నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ప్రధాని నెహ్రూ వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని పదవి అధిరోహించిన సంగతి తెలిసిందే.
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఐదేళ్ళపాటు జగన్తో అంటకాగి ఆయన ఆడమన్నట్టల్లా ఆడిన పాపం తన పీకకు భారీ స్థాయిలో చుట్టుకుంటున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారిపోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మళయాళ నటుడు సురేష్ గోపి అరుదైన రికార్డు దక్కించుకున్నారు.
కేరళలోని త్రిస్సూర్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి రికార్డ్ సృష్టించిన ప్రముఖ నటుడు సురేశ్ గోపి... మోదీ కేబినెట్లో చోటు దక్కించుకోవడం ద్వారా మరో మైలురాయిని అందుకుంటున్నారు.
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా ఉలవచారు బిర్యానీ చిత్రంలో ఈ సాంగ్ గుర్తొచ్చే విధంగా ఉంది మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో నడ్డా విందు.
ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీయే ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన విందు ఇస్తున్నారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన మెనూ కూడా వెల్లడైంది.
తాజాగా రాష్ట్రం నుంచి మరో ఎంపీకి కూడా మోదీ కేబినెట్లో స్థానం దక్కుతుందని తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కిందని సమాచారం.
వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. వారిలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు.
జడ్చర్ల పంచాయతీ కార్యాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో ఉన్న క్రీ. శ. 12వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా .ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం వున్న మద్యం పాలసీని రద్దు చేపి కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది.
భారతీయ చట్టాలు ప్రధానంగా ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని రూపుదిద్దారు. బ్రిటీషు కాలం నుంచి ఇదే విధానం కొనసాగుతుంది. ఒకటి ఇండియన్ పినల్ కోడ్ రెండు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ , మూడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్యాధార చట్టం. సాక్ష్యం బట్టి నేరం రుజువు అవుతుంది. దేన్ని సాక్ష్యం తీసుకోవాలి అనే విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.