క్లైమాక్స్‌కు చేరిన కడపస్టోరీ.. జగన్‌ను దెబ్బకొట్టేది తమ్ముడు అవినాషే?!

Publish Date:Jun 19, 2023

Advertisement

 ఏపీలో ఎన్నికలకు ఇంకా ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ సమయం. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజూకీ పెరిగిపోతోంది. ఈ విమర్శల దాడిలో మనకి ఎప్పటికప్పుడూ వినిపించే మాట వివేకా హత్య కేసు. మాజీ సీఎం వైఎస్ఆర్ కు స్వయానా తమ్ముడు, ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయంలో హత్య కాబడిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన వివేకా ఇంట్లోనే ఇప్పుడు అధికారం ఉండడం.. హత్య టీడీపీ హయంలో జరగడం.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు.. ఆ హత్యను టీడీపీ కుట్రగా ఫోకస్ చేయడంతో ఇప్పుడు అదే కేసు విచారణకు వచ్చేసరికి ఎవరికి వారికి అస్త్రాలు దొరికినట్లయింది.

ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసు క్లైమాక్స్ కి చేరింది. క్లైమాక్స్ కి చేరిందనే మాట చాలా కాలంగా వినిపిస్తున్నా.. గడువులు విధించి కేసు దర్యాప్తు పూర్తి చేయాలనీ న్యాయస్థానాలు ఆదేశాలిచ్చినా.. ఈ కేసు ఇంకా ఇంకా సాగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ కేసు సాగదీత కోసం ఓ వర్గం సర్వశక్తులూ ఒడ్డింది. ఆ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. అయితే  ఈసారి క్లైమాక్స్ కు చేరింది అంటే చేరింది అంతే. దాని వెనక కారణాలు కూడా లేకపోలేదు. నిన్న మొన్నటి వరకు ఈ కేసు సాగదీతలో కేంద్రం అంతో ఇంతో సాయపడుతోందని ఢిల్లీ నుండి గల్లీ వరకూ కోడై కూసింది. విశ్లేషకుల నుండి అతి సామాన్య ప్రజల వరకూ అందరి నోటా ఈ మాటే వినిపించింది. అయితే, ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు మారాల్సిన సమయం వచ్చేసింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు పాత మిత్రుల అవసరం వచ్చింది పడింది.  కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యమా అని దేశవ్యాప్తంగా బీజేపీ పాత మిత్రుల వైపు చూస్తోంది. తమతో కలిసి వచ్చే స్నేహితులకు చేయి అందించాలని బీజేపీ పెద్దలే రాష్ట్ర నాయకత్వాలకు సూచనలు, సలహాలు ఇచ్చేశారు. ఇప్పటికే జనసేనతో దోస్తీకి ఫిక్సయిపోయిన తెలుగుదేశం తాజాగా చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత ఆల్ మోస్ట్ ఇక పాత అలియన్స్ కి రాజమార్గం పడ్డట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలో ఇకపై వివేకా కేసులో కేంద్రం నుండి సాయం అంటే ఎడారిలో నీటి ఊటే అవుతుంది.  అదే జరిగితే సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీకి తప్పించుకోలేని జంజాటమే అవుతుంది.

సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలలో వివేకా హత్యకేసు ప్రధానమైనది  అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకోవడంతో ఆ ఎన్నికలలో వైఎస్ కుటుంబం, వైసీపీ పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. అయితే  సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి అదే కేసు వైసీపీ మెడకి చుట్టుకోనుందా అంటే నిస్సందేహంగా ఔనని చెప్పవచ్చు. అప్పుడు వైసీపీకి ఈ కేసు  ఏ స్థాయిలో ఎన్నికల సమరంలో సానుభూతిని ఏరులై పారించిందో.. ఇప్పుడు టీడీపీ జగన్ మోహన్ రెడ్డిని నేరస్తుడిగా ముద్ర వేయడంలో అదే స్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2014 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు టీడీపీ రూ.వెయ్యి కోట్ల ప్రచారాన్ని ఏ విధంగా హైలెట్ చేసిందో.. ఈసారి జగన్ నేరస్థుడు అనేలా హైలెట్ చేయడం తధ్యం.

నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ  రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే అటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్ ఈ కేసులో కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎం జగన్ ను   దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ కేసులో అవినాష్ తప్పించుకునేందుకు అప్పటి నుండి వేసిన ఎత్తులు కూడా వైసీపీకి తీరని నష్టమే అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తమ్ముడిని కాపాడేందుకు స్వయంగా సీఎంనే  అధికారాన్ని అడ్డం పెట్టుకుని చే యాల్సిందంతా చేస్తున్నారనే  ప్రచారం ప్రజలలోకి బలంగా వెళ్లిపోయింది.

దీనిని బట్టి చూస్తే రానున్న ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తే కనుక అందులో అవినాష్ వాటాయే సింహభాగంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జూన్ నెలాఖరునే ఈ కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. సిబిఐ అనుమానించిందే నిజమైతే.. ఆ తర్వాత ఏం జరిగినా అది జగన్ కు గ్రహపాటే!

By
en-us Political News

  
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.