Publish Date:May 29, 2025
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తొలి సారిగా కడపలో మహానాడు నిర్వహించి ఇక కడప ఎంత మాత్రం జగన్ అడ్డా కాదని నిరూపించామని పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి అన్నారు. మమానాడు చివరి రోజున గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడపలో ఇంత విజయవంతంగా మహానాడు నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. జగన్ ఇలాకాలో మహానాడు అంటూ మీడియాలో వచ్చిందనీ, అయితే 2024 ఎన్నికలకు ముందు వరకూ కడన జగన్ అడ్డా అయితే అయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడు కడప చంద్రబాబు ఖిల్లా అని బీటెక్ రవి అన్నాడు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏడింటిలో కూటమి విజయం సాధించిందనీ, ఇంకా కడన జగన్ ఇలాకా ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలిపారు.
చంద్రబాబు గారి కృషితోనే నేడు పులివెందుల హార్టికల్చర్ హబ్గా మారింది. ఇక్కడ పండిస్తున్న అరటి, బత్తాయి పంటలు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి అన్న బీటెక్ రవి.. పులివెందులకు చెందిన ఇద్దరు సీఎంలు వైఎస్, జగన్ పులివెందులకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు జల్ జీవన్, అమృత్ పథకాల ద్వారా పులివెందుల మున్సి పాలిటీకి తాగునీరు అందిస్తే.. జగన్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేసిన బీటెక్ రవి వైఎస్ఆర్ హయాంలో పని చేసిన పలువురు ఉన్నతాధికారులు జైలుకెళ్లారనీ, ఆ తరువాత జగన్ హయాంలో ఆయన చెప్పినట్లల్లా ఆడిన ధనుంజయ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి అధికారులు కూడా జైలుకెళ్లారనీ అన్నారు. పరిటాల రవి హత్య కేసు, మద్దెలచెరువు సూరి హత్య కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో నిందితులంతా జైలుకు వెళ్లారని గుర్తుచేస్తూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, లిక్కర్ కేసులో జగన్ రెడ్డి కూడా వచ్చే మహానాడు నాటికి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు బీటెక్ రవి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kadapa-not-jagan-adda-it-is-cbn-khilla-39-198953.html
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిల్ సాల్ట్.. కైల్ జెమీసన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
మధుర ఫలం మామిడిని పండించే రైతు ధర లేక కుదేలవుతున్నాడు. ఈసారి మామిడి దిగుబడి బాగా వచ్చినా ధర అధ్వాన్నంగా ఉండడంతో ఢీలా డ్డారు. ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు మామిడి కి రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుంది
తెలంగాణలో కరోనా కలకలం సష్టించున్నాయి. రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్ బెంగళూరుతోో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
చాలా మంది జగన్ అనేవాడు. చాలా చాలా బాధ పడుతున్నాడు. నీరసించి పోయాడు..అస్సలు డబ్బులు లేవంట
కనీసం ఆఫీసు రెంటు కూడా కట్టలేక పోతున్నాడంట..అని తీవ్ర నిరాశా నిస్పృహలతో అలమటించిపోతున్నారుగానీ.. జగన్ పరిస్థితి అలాగేం లేదు.
ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది.
ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు నేటి సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమన్ని నిర్వహిస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆనారోగ్యం కారణంగా ఇటీవల వంశీకి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5 మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో నిర్వహించానున్నారు.
ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడి విచారణ చేయడానికి సిట్ కి దారులు బార్లా తెరుచుకున్నాయి. ఇప్పటి వరకూ అంటే గత 14 నెలలుగా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వ్యవహారం, ఎన్నో మలుపుల మీద మలుపులు తిరిగి, ఆయన ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చే వరకూ సాగింది.
ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3) సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది.
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ తన సినిమా థగ్ లైఫ్ జూన్ 05 న కర్ణాటకలో విడుదల కావడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.