విశాఖ ఎంపీగా కె.ఎ.పాల్ ఘన విజయం!

Publish Date:May 16, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలతోపాటు అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా  హోరాహోరీగా పోటీ నెలకొంది.. ఒక్క విశాఖపట్నం స్థానంలో తప్ప. ఎందుకంటే, ఈ స్థానం నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పోటీలో వున్నారు. దాంతో ఇక్కడ వార్ వన్‌సైడ్ అయిపోయింది. విశాఖ ఓటర్లు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న మతుకుమిల్లి భరత్‌ని, వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీరాణిని ఎంతమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ లాంటి మిగతా పార్టీల అభ్యర్థులను గానీ, ఇండిపెండెంట్లను గానీ ఎంతమాత్రం లెక్కచేయలేదు. విశాఖ ఓటర్లందరూ గంపగుత్తగా కేఏ పాల్‌కి ఓటేశారు. ఈవీఎంలలో సీరియల్ నంబర్ 14, కుండ గుర్తు పక్కనే వున్న బటన్ నొక్కేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా కేఏ పాల్ విజయం కన్ఫమ్ అయిపోయింది. ఇక ఓట్ల లెక్కింపు, రిజల్ట్ ప్రకటన లాంటి ఫార్మాల్టీస్ మాత్రమే మిగిలి వున్నాయి.

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో కేఏ పాల్ చేసిన ప్రచారం ఓటర్ల మీద బాగా ప్రభావం చూపింది. తన సింబల్ కుండని పట్టుకుని రోడ్ల వెంట తిరగడం, సముద్రంలో వల వేసి చేపలు పట్టడం, అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేసి ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం, విశాఖలో సముద్ర తీరం వెంట బోలెడన్ని మినీ హార్బర్లు కట్టిస్తానని చెప్పడం, అందరికీ ఉద్యోగాలు, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తానని చెప్పడం, ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా కామెడీ పనులు చేసి ఓటర్లని కడుపారా నవ్వించడం.. ఇవన్నీ ఓటర్లను ఆకర్షించాయి.

ఓట్ల లెక్కింపు జరగడానికి ఇంకా 20 రోజుల టైమ్ వుంది. అప్పటి వరకూ వెయిట్ చేయడం ఎందుకని, ఎలాగూ తన విక్టరీ కన్ఫమ్ అయిపోయింది కాబట్టి, విశాఖ పార్లమెంట్ సభ్యుడి హోదాలో నియోజకవర్గ వ్యాప్తంగా రకరకాల అధికారిక కార్యక్రమాలు చేపట్టడానికి కేఏ పాల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎంపీగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘నా విజయం ఖాయమైపోయింది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 14 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో మొత్తం పది లక్షల ఓట్లు నాకు పడ్డాయి. మా పార్టీ చేసిన ఇంటర్నల్ సర్వేల్లో నేను 10 లక్షల మెజారిటీతో గెలవబోతున్నట్టు తెలిసిపోయింది. నియోజకవర్గంలో వున్న నాలుగు లక్షల క్రిస్టియన్ల ఓట్లు, రెండు లక్షల మంది యూత్ ఓట్లు, స్టీల్ ప్లాంట్ కొంటానని అన్నా కాబట్టి... రెండు లక్షల నిరుద్యోగుల ఓట్లు, ఇంకా రెండు లక్షల బలహీన వర్గాల ఓట్లు నాకు పడ్డాయి. విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ఢి కోసం ప్రణాళికలు రచిస్తున్నాను. రేపటి నుంచి నేను నియోజకవర్గంలో ఏం చేయాలనేది ప్లాన్ చేస్తున్నా. 100 రోజుల్లో విశాఖను అభివృద్ధి  చేసేస్తాను. ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అమలు చేసేస్తాను.  నా బర్త్ డే సెప్టెంబర్ 25. ఈలోగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి చూసి అందరూ షాకైపోతారు’’ అని కె.ఎ.పాల్ చెప్పారు. కె.ఎ.పాల్ లాంటి వ్యక్తి విశాఖ ఎంపీగా గెలవటం విశాఖ ప్రజల అదృష్టం. 

(రచన: మతిలేని మంగపతి, (ఎక్స్ వార్డ్ మేట్ టు కె.ఎ.పాల్), వార్డు నంబర్ 14, ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్, విశాఖపట్నం)

By
en-us Political News

  
అసలు ‘మెడిటేషన్’ అనే మాటని క్యాన్సిల్ చేసేసి ‘మోడిటేషన్’ అని మారిస్తే మంచిది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన పదవీ విరమణ చేశారు
ఏబీవీకి జగన్ కరుణించి పోస్టింగ్ ఇవ్వలేదు.. జగన్ ఇవ్వనుగాక ఇవ్వను అని పట్టుదల మీద వుంటే, ఏబీవీ పోరాడి సాధించుకున్నారు. 
బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అయినా కేసీఆర్‌కు ఇంకా తత్త్వం బోధపడినట్లు లేదు. అధికారాన్ని కోల్పోయిన ఆరు మాసాల్లోపే ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలో చేరిపోతున్నారు. 4వ తేదీ త‌రువాత‌ ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో ప్ర‌జ‌ల స్పంద‌న‌, తాజా పరిస్థితులు కేసీఆర్‌కు మింగుడుపడటం లేదు. ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ క్యాడ‌ర్‌ను కాపాడుకోవాల‌నుకుంటున్నారు.
సరిగ్గా  సార్వత్రిక ఎన్నికల  కౌంటింగ్ కు ఒక రోజు ముందు ఎపిలో పరిపాలనా విభాగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఒక రోజు మాత్రమే అధికారంలో ఉంటుంది అని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో డిప్యూటి కలెక్టర్లపై బదిలీవేటు సంచలనమైంది. 
మునుపెన్నడూ లేని విధంగా ఈ యేడు లోకసభ ఎన్నికల వ్యయం తడిసి మోపెడయ్యింది.  లోక్‌సభ ఎన్నికలు-2024 నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.1100 కోట్ల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది
ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జవహర్‌రెడ్డి భూకుంభకోణం తీగ కదిలి డొంకంతా బయటపడింది. ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్‌ భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కొట్టేశారంటూ ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఆధ్యాత్మిక యాత్ర కోసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం కన్యాకుమారికి  చేరుకున్న మోదీ అక్కడ వివేకానంద రాక్‌ మెమోరియల్‌  వద్ద ధ్యానం లోకి వెళ్లిపోయారు.
బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రాని పక్షంలో మోడీ ప్రధానిగా మళ్ళీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకోవడం కష్టమే. కాంగ్రెస్ తన చాణక్యం ప్రదర్శించిందంటే, కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావడం అసాధ్యమయ్యే అవకాశం కూడా వుంది.
బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ పరిస్థితి నెలకొని ఉంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఉన్న ఐక్యత పదేళ్ల తరువాత మచ్చుకు కూడా కనిపించడం లేదా? అంటే బీజేపీ వర్గాలే ఔనని అంటున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న కమలం, ఆ విజయం సాధించినా ముచ్చటగా మూడో సారి మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని చెబుతున్నాయి.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావం సదర్భంగా జూన్ 2న నిర్వహించే అధకారిక కార్యక్రమానికి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్విటేషన్ పంపారు. ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ స్వయంగా లేఖ రాసి దానిని ప్రభుత్వ సలహాదారు హ‌ర్కార వేణుగోపాల్ కు ఇచ్చి స్వయంగా కలిసి ఆహ్వానపత్రికను, తన లేఖను ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కోరారు.
ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా  ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు
న్యాయం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, మన కోసం, తెగించి పోరాడే వాళ్ళ భుజం తట్టి ప్రోత్సాహించడం మన కనీస ధర్మం అని... ఏబీ వెంకటేశ్వరరావుని అభినందించడానికి బంధుమిత్ర సమేతంగా రండి అని ఆహ్వానిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.