Publish Date:Sep 22, 2025
బీఆర్ఎస్ ను జూబ్లీ ఉప ఎన్నికలు గాభరా పెడుతున్నాయా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ కవిత విషయంలో పునరాలోచిస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్నసమాధానమే వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ రెడీ అయ్యింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. దీంతో తమ సిట్టింగ్ సీటును ఎలాగైనా కైవశం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ కు కవిత వ్యవహారం ఇబ్బంది పెడుతున్నది. జూబ్లీ ఉప ఎన్నికలో కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఉండటంతో బీఆర్ఎస్ లో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
అధికారంలో ఉన్నంత కాలం విపక్షాలను నానా ఇబ్బందులకూ గురి చేసి ఆ పార్టీల్లో చీలికలకు ప్రోత్సహించిన బీఆర్ఎస్.. ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తులు పెచ్చరిల్లడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరీ ముఖ్యంగా కవిత తిరుగుబావుటా ఆ పార్టీని ఊపిరితీసుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాజకీయాలలో గత కొంత కాలంగా కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ అయిన సంగతి విదితమే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలకు హరీష్ బాధ్యుడంటూ ఆమె చేసిన ఆరోపణలు, విమర్శలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసి తప్పుచేశామా అన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సస్పెన్షన్ కు గురైన కవిత ఎక్కడా వెనక్కు తగ్గకుండా ముందుకు సాగడమే కాకుండా జూబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ జాగృతి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత అలీఖాన్ ను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
అదే జరిగితే.. తమ ఓటమి ఖాయమన్న భయం బీఆర్ఎస్ లో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడో, రేపో కేసీఆర్ కవితను తన ఫామ్ హౌస్ కు పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఆమెతో చర్చించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాగృతి అభ్యర్థిని నిలబెట్టకుండా బుజ్జగించే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఆ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ జూబ్లీ ఉప ఎన్నికలో కవిత కనుక జాగృతి అభ్యర్థిని నిలబెట్టడమంటూ జరిగితే బీఆర్ఎస్ ఓట్లు చీలి ఓటమి పాలవుతామన్న భయంతో పాటు అది అధికార పార్టీకి లాభం చేసే అవకాశం ఉంటుందన్న భావనతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితతో చర్చించడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jublee-fear-in-kcr-39-206668.html
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.