Publish Date:Oct 16, 2025
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న లంకల దీపక్ రెడ్డి 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక నవీన్ సైతం ఇంచుమించు ఇలాంటి ట్రాక్ రికార్డే కలిగి ఉన్నారు. కానీ, ఆయనకీ ఈయనకీ ఉన్న తేడా ఒక్కటే.. అధికారపార్టీ.
దీపక్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే పార్టీ సైతం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్కడ అదేమంత పని చేసేలా లేదు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ స్థాయి గెలుపు దీపక్ రెడ్డి నుంచి ఆశించడం అయ్యే పని కాదు. కారణం అప్పట్లో ఉన్న సిట్యువేషన్ వేరు- ఇప్పుడున్న పరిస్థితి వేరు.
ఉన్న సమస్యలు చాలవన్నట్టు.. దీపక్ రెడ్డి పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం ఒక ఆటంకమైతే.. రెండోది ఇక్కడ అత్యధికంగా మైనార్టీ ఓట్లుండటం. దీపక్ ఇక్కడి మైనార్టీలను ఆకర్షించడంలోనూ తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో చెబుతూ మైనార్టీలు ఎంఐఎం పార్టీ అధినేత చెప్పిందల్లా చేసే గొర్రెలు కారంటూ పరుష పదజాలం వాడారు.
ఆమాటకొస్తే తాము బీసీలకు ఎంతో మేలు చేస్తోన్న పార్టీకి చెందిన వారమనీ. ఇంకా మాట్లాడితే తమ ప్రధానే ఒక బీసీ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు దీపక్ రెడ్డి. కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చినట్టు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఉంటే ఆ మాటకు ఒక అర్ధముండేది. అంతే కాకుండా ఎందరో మహిళలు పోటీ పడగా.. వారందరినీ తోసి రాజని.. తనకున్న కిషన్ రెడ్డి సపోర్ట్ మొత్తాన్ని వాడారు దీపక్ రెడ్డి. దీంతో ఇది కూడా పార్టీకి మైనస్ గా మారి దీపక్ రెడ్డి విజయావకాశాలను గండి కొట్టేలా కనిపిస్తోంది.
ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నుంచి అది కూడా కన్నీటిపర్యంతమై ప్రచారం చేస్తున్న సునీత ముందు, అధికార పార్టీకి చెందిన లోకల్ బాయ్ నవీన్ ముందు.. దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ అనే ఈ లంకను జయించడం అంత సులభసాధ్యం కాదంటున్నారు పరిశీలకులు. కాకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు జనరల్ అయ్యిందిగానీ గతంలో ఇది ఎస్సీ స్థానం. ముస్లిం మైనార్టీలు ఎక్కువున్న ప్రాంతం కూడా కావడంతో.. ఇక్కడ దీపక్ రెడ్డిది పేరుకు పోటీ కానీ.. అసలు యుద్ధం మొత్తం సునీత, నవీన్ మధ్య ఉండనుందని అంటున్నారు విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jublee-bypoll-bjp-candidate-lankala-deepakreddy-win-oppourtunities-25-208044.html
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.