Publish Date:Oct 16, 2025
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న లంకల దీపక్ రెడ్డి 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక నవీన్ సైతం ఇంచుమించు ఇలాంటి ట్రాక్ రికార్డే కలిగి ఉన్నారు. కానీ, ఆయనకీ ఈయనకీ ఉన్న తేడా ఒక్కటే.. అధికారపార్టీ.
దీపక్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే పార్టీ సైతం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్కడ అదేమంత పని చేసేలా లేదు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ స్థాయి గెలుపు దీపక్ రెడ్డి నుంచి ఆశించడం అయ్యే పని కాదు. కారణం అప్పట్లో ఉన్న సిట్యువేషన్ వేరు- ఇప్పుడున్న పరిస్థితి వేరు.
ఉన్న సమస్యలు చాలవన్నట్టు.. దీపక్ రెడ్డి పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం ఒక ఆటంకమైతే.. రెండోది ఇక్కడ అత్యధికంగా మైనార్టీ ఓట్లుండటం. దీపక్ ఇక్కడి మైనార్టీలను ఆకర్షించడంలోనూ తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో చెబుతూ మైనార్టీలు ఎంఐఎం పార్టీ అధినేత చెప్పిందల్లా చేసే గొర్రెలు కారంటూ పరుష పదజాలం వాడారు.
ఆమాటకొస్తే తాము బీసీలకు ఎంతో మేలు చేస్తోన్న పార్టీకి చెందిన వారమనీ. ఇంకా మాట్లాడితే తమ ప్రధానే ఒక బీసీ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు దీపక్ రెడ్డి. కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చినట్టు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఉంటే ఆ మాటకు ఒక అర్ధముండేది. అంతే కాకుండా ఎందరో మహిళలు పోటీ పడగా.. వారందరినీ తోసి రాజని.. తనకున్న కిషన్ రెడ్డి సపోర్ట్ మొత్తాన్ని వాడారు దీపక్ రెడ్డి. దీంతో ఇది కూడా పార్టీకి మైనస్ గా మారి దీపక్ రెడ్డి విజయావకాశాలను గండి కొట్టేలా కనిపిస్తోంది.
ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నుంచి అది కూడా కన్నీటిపర్యంతమై ప్రచారం చేస్తున్న సునీత ముందు, అధికార పార్టీకి చెందిన లోకల్ బాయ్ నవీన్ ముందు.. దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ అనే ఈ లంకను జయించడం అంత సులభసాధ్యం కాదంటున్నారు పరిశీలకులు. కాకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు జనరల్ అయ్యిందిగానీ గతంలో ఇది ఎస్సీ స్థానం. ముస్లిం మైనార్టీలు ఎక్కువున్న ప్రాంతం కూడా కావడంతో.. ఇక్కడ దీపక్ రెడ్డిది పేరుకు పోటీ కానీ.. అసలు యుద్ధం మొత్తం సునీత, నవీన్ మధ్య ఉండనుందని అంటున్నారు విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jublee-bypoll-bjp-candidate-lankala-deepakreddy-win-oppourtunities-39-208043.html
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.