Publish Date:Oct 16, 2025
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న లంకల దీపక్ రెడ్డి 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక నవీన్ సైతం ఇంచుమించు ఇలాంటి ట్రాక్ రికార్డే కలిగి ఉన్నారు. కానీ, ఆయనకీ ఈయనకీ ఉన్న తేడా ఒక్కటే.. అధికారపార్టీ.
దీపక్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే పార్టీ సైతం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్కడ అదేమంత పని చేసేలా లేదు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ స్థాయి గెలుపు దీపక్ రెడ్డి నుంచి ఆశించడం అయ్యే పని కాదు. కారణం అప్పట్లో ఉన్న సిట్యువేషన్ వేరు- ఇప్పుడున్న పరిస్థితి వేరు.
ఉన్న సమస్యలు చాలవన్నట్టు.. దీపక్ రెడ్డి పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం ఒక ఆటంకమైతే.. రెండోది ఇక్కడ అత్యధికంగా మైనార్టీ ఓట్లుండటం. దీపక్ ఇక్కడి మైనార్టీలను ఆకర్షించడంలోనూ తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో చెబుతూ మైనార్టీలు ఎంఐఎం పార్టీ అధినేత చెప్పిందల్లా చేసే గొర్రెలు కారంటూ పరుష పదజాలం వాడారు.
ఆమాటకొస్తే తాము బీసీలకు ఎంతో మేలు చేస్తోన్న పార్టీకి చెందిన వారమనీ. ఇంకా మాట్లాడితే తమ ప్రధానే ఒక బీసీ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు దీపక్ రెడ్డి. కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చినట్టు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఉంటే ఆ మాటకు ఒక అర్ధముండేది. అంతే కాకుండా ఎందరో మహిళలు పోటీ పడగా.. వారందరినీ తోసి రాజని.. తనకున్న కిషన్ రెడ్డి సపోర్ట్ మొత్తాన్ని వాడారు దీపక్ రెడ్డి. దీంతో ఇది కూడా పార్టీకి మైనస్ గా మారి దీపక్ రెడ్డి విజయావకాశాలను గండి కొట్టేలా కనిపిస్తోంది.
ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నుంచి అది కూడా కన్నీటిపర్యంతమై ప్రచారం చేస్తున్న సునీత ముందు, అధికార పార్టీకి చెందిన లోకల్ బాయ్ నవీన్ ముందు.. దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ అనే ఈ లంకను జయించడం అంత సులభసాధ్యం కాదంటున్నారు పరిశీలకులు. కాకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు జనరల్ అయ్యిందిగానీ గతంలో ఇది ఎస్సీ స్థానం. ముస్లిం మైనార్టీలు ఎక్కువున్న ప్రాంతం కూడా కావడంతో.. ఇక్కడ దీపక్ రెడ్డిది పేరుకు పోటీ కానీ.. అసలు యుద్ధం మొత్తం సునీత, నవీన్ మధ్య ఉండనుందని అంటున్నారు విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jublee-bypoll-bjp-candidate-lankala-deepakreddy-win-oppourtunities-39-208043.html
2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు.
తమిళ సినిమా లెనిన్ ఇండియన్ అనే సినిమాతో రోజా వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ మేరకు ఆ మూవీ మేకర్స్ రోజా తమ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
జూబ్లీ హిల్స్లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టీడీపీ నాయకులను ఆదేశించారు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గోన్ననున్నారు.
హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థి ఎంపికకే చాలా సమయం తీసుకున్న ఆ పార్టీ.. ప్రచారంలోనూ వెనుకబడింది. ప్రచార సరళిని బట్టి చూస్తుంటే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అన్న అభిప్రాయం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదని నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం శ్రేణులు అంటుండేవి. ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి పర్యటనను తన సోదరుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నుంచే మొదలు పెట్టారు. కానీ ఆ పర్యటన ఆద్యంతం తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే విధంగానే సాగింది.
రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టి బెరుకు లేకుండా, బెదురు లేకుండా నిలదొక్కుకుని ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు.
రైతులు కోరినా జగన్ మాత్రం పొలాల్లోకి అడుగుపెట్టలేదు. ఇదే రకం పరిశీలనో అర్ధంగాక రైతులు తలలుబాదుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నానన్నారు. మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పాతిక జిల్లాల్లో పంటనష్టం జరిగిందన్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదన్నారు.
ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.