Publish Date:Oct 16, 2025
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న లంకల దీపక్ రెడ్డి 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక నవీన్ సైతం ఇంచుమించు ఇలాంటి ట్రాక్ రికార్డే కలిగి ఉన్నారు. కానీ, ఆయనకీ ఈయనకీ ఉన్న తేడా ఒక్కటే.. అధికారపార్టీ.
దీపక్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే పార్టీ సైతం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్కడ అదేమంత పని చేసేలా లేదు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ స్థాయి గెలుపు దీపక్ రెడ్డి నుంచి ఆశించడం అయ్యే పని కాదు. కారణం అప్పట్లో ఉన్న సిట్యువేషన్ వేరు- ఇప్పుడున్న పరిస్థితి వేరు.
ఉన్న సమస్యలు చాలవన్నట్టు.. దీపక్ రెడ్డి పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం ఒక ఆటంకమైతే.. రెండోది ఇక్కడ అత్యధికంగా మైనార్టీ ఓట్లుండటం. దీపక్ ఇక్కడి మైనార్టీలను ఆకర్షించడంలోనూ తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో చెబుతూ మైనార్టీలు ఎంఐఎం పార్టీ అధినేత చెప్పిందల్లా చేసే గొర్రెలు కారంటూ పరుష పదజాలం వాడారు.
ఆమాటకొస్తే తాము బీసీలకు ఎంతో మేలు చేస్తోన్న పార్టీకి చెందిన వారమనీ. ఇంకా మాట్లాడితే తమ ప్రధానే ఒక బీసీ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు దీపక్ రెడ్డి. కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చినట్టు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఉంటే ఆ మాటకు ఒక అర్ధముండేది. అంతే కాకుండా ఎందరో మహిళలు పోటీ పడగా.. వారందరినీ తోసి రాజని.. తనకున్న కిషన్ రెడ్డి సపోర్ట్ మొత్తాన్ని వాడారు దీపక్ రెడ్డి. దీంతో ఇది కూడా పార్టీకి మైనస్ గా మారి దీపక్ రెడ్డి విజయావకాశాలను గండి కొట్టేలా కనిపిస్తోంది.
ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నుంచి అది కూడా కన్నీటిపర్యంతమై ప్రచారం చేస్తున్న సునీత ముందు, అధికార పార్టీకి చెందిన లోకల్ బాయ్ నవీన్ ముందు.. దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ అనే ఈ లంకను జయించడం అంత సులభసాధ్యం కాదంటున్నారు పరిశీలకులు. కాకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు జనరల్ అయ్యిందిగానీ గతంలో ఇది ఎస్సీ స్థానం. ముస్లిం మైనార్టీలు ఎక్కువున్న ప్రాంతం కూడా కావడంతో.. ఇక్కడ దీపక్ రెడ్డిది పేరుకు పోటీ కానీ.. అసలు యుద్ధం మొత్తం సునీత, నవీన్ మధ్య ఉండనుందని అంటున్నారు విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jublee-bypoll-bjp-candidate-lankala-deepakreddy-win-oppourtunities-25-208044.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.