Publish Date:Sep 19, 2025
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానమేంటో తేలిపోనున్నదా? మంత్రి పొంగులేటి కామెంట్ల అర్ధమేంటి? వచ్చే మూడున్నరేళ్లలో అసలు పార్టీయే ఉండదనీ.. బీజేపీలో కలిపేసి.. విదేశాలకు వెళ్లినా వెళ్తారనీ కామెంట్ చేశారు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి. ఈ సరికే కేటీఆర్ పెట్టేబేడా సర్దుకుని పేకప్ చెప్ప డానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్య చేశారు. పొంగులేటి మాటలను అటుంచితే.. అధికార ప్రతిపక్షాల మధ్య జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక మాత్రం మహా రంజుగా సాగేలా కనిపిస్తోందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఉన్న రసవత్తర పోరుకు తోడు ఇటు కవిత జాగృతి తరఫున అభ్యర్ధి బరిలోకి దిగేలా తెలుస్తోంది. అలాగే ఎన్డీయే కూటమి అభ్యర్థి కూడా పోరులో ఉండటం తథ్యం. అంటే ఎటు నుంచి ఎటు చూసినా గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై అన్ని పార్టీలూ దృష్టి పెట్టారన్నది స్పష్టమౌతోంది.
అన్నిటికీ మించి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సినీ ప్రముఖులు, సినీమా పరిశ్రమకు చెందిన వారు అధికంగా ఉండే ప్రాంతం. ఒక సమయంలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగుతారని కూడా వినిపించింది. సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సతీమణి శైలిమను బరిలోకి దింపినా దింపుతారనే మాట కూడా గట్టిగా వినిపించింది. శైలిమగానీ బరిలోకి దిగితే.. జాగృతి అధ్యక్షురాలు కవిత తన వదినపై పోటీ చేస్తారన్న టాకూ వచ్చింది.
అదలా ఉంటే ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాకు ఆమోదం లభించలేదు. ఒక వేళ ఆమె రాజీనామాను మండలి చైర్మన్ఆమోదిస్తే.. అప్పుడు కవిత అనివార్యంగా ఏదో ఒక పదవి కోసం పోటీ పడాల్సి ఉంది. ఇటు సోదరితో పాటు అటు సోదరుడికి కూడా ఈ సీటు సో- సో- సో ఇంపార్టెంట్. ఎందుకంటే అధికార పక్షం, పొంగులేటి వంటి వారి రూపంలో ఎప్పుడూ ఏదో ఒ పరీక్ష ఎదురవుతూనే ఉంది. ఈ అవమానాలన్నిటి నుంచి బయట పడాలంటే కేటీర్ సైతం ఇక్కడ తన సత్తా చాటాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, పార్టీకి భవిష్యత్ అధినేతగా కేటీఆర్ కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక పరీక్ష అనే చెప్పాలి. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటితేనే.. ఆయన నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో విశ్వాసం ఇనుమడిస్తుంది. తన సత్తా చాటాల్సి ఉంటుంది.
వీటన్నిటితో పాటు.. కాంగ్రెస్ కి కూడా జూబ్లీ ఉప పోరు అత్యంత ప్రతిష్ఠాత్మకం అనడంలో సందేహం లేదు. అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికలో గెలవకుంటే అది ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడానికి దోహదపడుతుంది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ కవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jublee-by-poll-key-to-all-political-parties-in-telangana-39-206439.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.