Publish Date:May 11, 2024
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కీలక సూచన చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని చెప్పారు.ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతోందని లోక్ సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ గత మార్చి నెలలో మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని వివరించారు. వైసీపీ వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, కమ్మ, కాపులు విపక్షాల వైపు ఉన్నారని పేర్కొన్నారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు విడుదల చేసిన ప్రకటనలో జెపి వివరణ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు వోటర్లకు డబ్బులు పంచుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఓటు అనేది ఆ రోజు కలిగే ఆవేశంతోనో, ఆ పూట కలిగే కోపంతోనో, నేతలు ఇచ్చిన డబ్బు కోసమో, రేపు ఎవరో ఏదో ఇస్తారనే ఆశతోనో, మద్యం మత్తులోనో వేసేది కాదు. కొద్దిగా రేపేం జరగబోతోందో ఆలోచించి, జాగ్రత్తగా ఓటు వేయండి అని తెలుగు రాష్ట్రాల ఓటర్లకు సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jp-advice-to-the-voters-of-telugu-states-39-175656.html
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో కేసీఆర్ అర్జెంటుగా చంద్రబాబుకు, పవన్కి అభినందనలు తెలియజేశాడు. బీజేపీకి మాత్రం అభినందనలు తెలపలేదు.
ఢిల్లీలో ఏడు స్థానాలనూ గెలుచుకున్న బీజేపీ పంజాబ్లో మాత్రం బోర్లా పడింది. పంజాబ్ ఓటర్ పంజా విసరడంతో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. మొత్తం 14 స్థానాల్లో 10 స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకోగా, మూడు స్థానాలు ఇతర పార్టీలు సొంతం చేసుకున్నాయి.
రాజస్థాన్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ పైచేయి సాధించింది. మొత్తం 25 స్థానాల్లో బీజేపీ 14 స్థానాలు సాధించగా, కాంగ్రెస్ 10 స్థానాలు సాధించింది. ఇతరులు 1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
72 సంవత్సరాల మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో నారా లోకేష్ రికార్డ్ మెజారిటీ సాధించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో జగన్ రాజీనామా చేశారు.
ఎన్నికలలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్య, కుమారుడితో కలసి వెళ్ళారు.
మధ్యప్రదేశ్ని బీజేపీ ఊడ్చేసింది. మొత్తం 29 స్థానాలనూ కొల్లగొట్టింది.
కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం ఢిల్లీ ఓటర్ల మీద ఎంతమాత్రం కనిపించలేదు. ఢిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో మొత్తం బీజేపీనే సొంతం చేసుకుంది.
బీజేపీకి ఎప్పుడూ గుజరాత్ అండగా నిలుస్తూనే వుంటుంది. పైగా మోడీ, అమిత్ షా నాయకత్వంలో వున్న పార్టీ కాబట్టి గుజరాత్ బీజేపీ వైపే వుంటుంది. అందుకే గుజరాత్లో మొత్తం 26 పార్లమెంట్ స్థానాల్లో 26 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో కాంగ్రెస్ గెలిచాయి.
కర్నాటకలో బీజేపీకి ఊరట లభించింది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాలు 19 స్థానాలు గెలుచుకుంటే, కాంగ్రెస్ 9 స్థానాలతో సరిపెట్టుకుంది.
కేరళలో యూడీఎఫ్ అదరగొట్టేసింది. మొత్తం 20 పార్లమెంట్ స్థానాల్లో 17 స్థానాలను యూడీఎఫ్ కొల్లగొట్టింది.
తెలంగాణ ఓటర్లు ఎవరికి ఎన్ని పార్లమెంట్ స్థానాలో ఇవ్వాలో అన్ని స్థానాలు ఇచ్చారు. కాంగ్రెస్కి 8, బీజేపీకి 8, మజ్లిస్కి 1 ఇచ్చి సరిపెట్టుకోమన్నారు. బీఆర్ఎస్ని పక్కకెళ్ళి ఆడుకోమ్మా అని పంపించేశారు.
రాజకీయాల్లో కొందరు నాయకులకు చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. పార్టీ అధికారంలోకి వస్తే వారు ఎమ్మెల్యేగా ఓడిపోతారు లేదా వారు ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుంది.