Publish Date:Jun 29, 2025
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వేచ్చ సుసైడ్కి కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ రాత్రి 11 గంటలకు న్యాయవాది సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిరు. తన కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్రావే కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పూర్ణచందర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. స్వేచ్ఛ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పూర్ణచంద్రను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పూర్ణచందర్ విడుదల చేసిన లేఖ వైరల్గా మారింది. ఇక పూర్ణ చందర్ విడుదల చేసిన లేఖలో స్వేచ్ఛ జీవితం, వారి సంబంధం, ఆమె మానసిక స్థితి, కుటుంబ నేపథ్యంకి సంబంధించి అనేక కీలక విషయాలను వెల్లడించారు. తనకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసని, ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశామని చెప్పారు. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను తనతో పంచుకుంటూ ఉండేదని గుర్తుచేశారు. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైందని ఆయన పేర్కొన్నారు.
2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా తన వద్దకు తీసుకువచ్చిందని పూర్ణచందర్ పేర్కొన్నారు. తాజాగా పూర్ణ చందర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసు ఫైల్ చేశారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు అరణ్య స్టేట్మెంట్ ఇచ్చారు. నమ్మించి మోసం చేయడం.. ఆత్మహత్య కు ప్రేరేపించిన కేసులో.. 69 BNS, 108 BNS సెక్షన్ల కింద కేసు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/journalist-swetcha-39-200883.html
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. జగన్ పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల అమలులో స్పీడ్ పెంచారు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచీ అమలు చేయనున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం డ్యామ్కు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగానే సమయం వుంది. జమిలి ఎన్నికలు వస్తేనో, ఇంకేదైనా జరిగితేనో ఏమో కానీ, లేదంటే.. 2028 సెకండ్ హాఫ్ లో కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. నిజానికి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నిండా రెండేళ్ళు అయినా కాలేదు.
ఒక్కో వంశానికి ఒక్కో మూల పురుషుడు ఉంటారు. రాజమౌళి వంశానికి శివశక్తిదత్త అలాగ. ఎందుకంటే ఆయనేగానీ తాను సినిమాల్లోకి రావాలని అనుకోకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అసలా కుటుంబానికి సినిమా పిచ్చి పట్టి ఉండేదే కాదు.
ఎవరో వస్తారని,ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న ఓ కవి మాటను ఆదర్శంగా తీసుకున్న ఆ గ్రామాల ప్రజలు తమ సొంత వ్యయంతో సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (జులై 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
ఏపీ బ్రాండ్ను దెబ్బతీసేందుకై మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కుట్రలు చేస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
టీటీడీలో పనిచేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును అధికారులు సస్పెండ్ చేశారు
నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి , వైసిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని మంగళవారం తిరుపతి లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు.
తిరుమల ఎంప్లాయిస్ గదుల కౌంటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గదులు కోసం గంటల గంటలు నిరీక్షించిన భక్తులు సమయమనం కోల్పోయి నేరుగా గదులు పొందుతున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. తాజాగా ఇవాళ సీఎం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు.