Publish Date:Aug 29, 2022
భగవంతుడు ఎక్కడ ఉండునో.. అంబికా దర్భార్ అక్కడ ఉండును ఇది బుల్లి తెరపై వచ్చే ఓ యాడ్. కానీ అంకుశం హీరో రాజశేఖర్ ఎక్కడ ఉండునో.. ఆయన భార్య జీవితా రాజశేఖర్ అక్కడ ఉండును అనే ఓ టాక్ అయితే ఫిలింనగర్లో ఎప్పటి నుంచో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా జీవితా రాజశేఖర్ మళ్లీ కమలదళంలో చేరారు. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే... బీజేపీలో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. యాద్రాద్రి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఆ క్రమంలో మోత్కురు మండలం.. పొడిచేడులో యాత్ర చేస్తున్న సంజయ్ సమక్షంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ఏమీ బాగోలేదన్నారు. ఈ పార్టీ హయాంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న తన మనస్సులోని మాటను జీవిత ఈ సందర్బంగా బయటపెట్టారు. పార్టీ ఆదేశిస్తే.. ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. అయితే జీవితా రాజశేఖర్ మరోసారి ఇలా రాజకీయాల్లోకి రావడం పట్ల నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజకీయంగా నిలకడలేనితనమే జీవితా రాజశేఖర్కు అసలు సిసలు మైనస్ పాయింట్ అంటూ వారు పోస్టులు పెడుతున్నారు.
తొలుత జీవిత హస్తం పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. టీడీపీ చేరారు.. అనంతరం సైకిల్ దిగి.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ మీదట బీజేపీలోకి జంపింగ్ రాగం ఆలపించారని.. తిరిగి 2019 ఎన్నికల వేళ.. లోటస్పాండ్లో జగన్ని కలిసి ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకున్నారని నెటిజన్లు .. జీవితా రాజశేఖర్ పోలిటికల్ హిస్టరీని కంఠస్తం చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంత కాలం సైలెంట్గా ఉండి.. తాజాగా మళ్లీ బీజేపీలోకి వచ్చారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. జీవితా రాజశేఖర్ ఇప్పటి వరకు అన్ని పార్టీల్లోకి ఇలా వెళ్లి... అలా వచ్చారని.. కానీ ఇక జీవితా రాజశేఖర్ భవిష్యత్తులో చేరే పార్టీ ఏదైనా ఉందంటే.. అది కేవలం కేఏ పాల్ స్థాపించిన ప్రజా శాంతి పార్టీనే అనే ఓ సెటైరికల్ టాక్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతిని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.
ఇలా పార్టీలో చేరగానే.. అలా పదవులు రావని.. పార్టీ స్థాపించిన నాటి నుంచి దశబ్దాలుగా పని చేసిన వారికే ఏ పదవి దక్కడం లేదని.. అలాంటి సమయంలో.. పార్టీలో చేరగానే.. పదవి రావాలంటే .. అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఓ నెట్జన్ జీవిత రాజకీయ వ్యవహర శైలిపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. మరి జీవితా రాజశేఖర్.. ఈ సారి అయిన బీజేపీలో నిలకడగా ఉంటారా? అంటే.. వేచి చూడాల్సిందే.
మరోవైపు సహజ నటి జయసుధతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆమెను కమలం పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. అందుకు ఆమె సానుకూలంగానే స్పందించి.. తనకు ఎమ్మెల్యే సీటు వద్దని... కానీ పార్టీలో చేరాలంటే.. కొన్ని కండిషన్లు పెట్టినట్లు సమాచారం. సదరు కండిషన్లపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడి చెబుతానని జయసుధతో ఈటల పేర్కొన్నట్లు తెలుస్తోంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jeevitha-rajasekhar-halchal-in-bjp-25-142869.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.