Publish Date:Aug 29, 2022
భగవంతుడు ఎక్కడ ఉండునో.. అంబికా దర్భార్ అక్కడ ఉండును ఇది బుల్లి తెరపై వచ్చే ఓ యాడ్. కానీ అంకుశం హీరో రాజశేఖర్ ఎక్కడ ఉండునో.. ఆయన భార్య జీవితా రాజశేఖర్ అక్కడ ఉండును అనే ఓ టాక్ అయితే ఫిలింనగర్లో ఎప్పటి నుంచో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా జీవితా రాజశేఖర్ మళ్లీ కమలదళంలో చేరారు. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే... బీజేపీలో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. యాద్రాద్రి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఆ క్రమంలో మోత్కురు మండలం.. పొడిచేడులో యాత్ర చేస్తున్న సంజయ్ సమక్షంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ఏమీ బాగోలేదన్నారు. ఈ పార్టీ హయాంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న తన మనస్సులోని మాటను జీవిత ఈ సందర్బంగా బయటపెట్టారు. పార్టీ ఆదేశిస్తే.. ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. అయితే జీవితా రాజశేఖర్ మరోసారి ఇలా రాజకీయాల్లోకి రావడం పట్ల నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజకీయంగా నిలకడలేనితనమే జీవితా రాజశేఖర్కు అసలు సిసలు మైనస్ పాయింట్ అంటూ వారు పోస్టులు పెడుతున్నారు.
తొలుత జీవిత హస్తం పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. టీడీపీ చేరారు.. అనంతరం సైకిల్ దిగి.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ మీదట బీజేపీలోకి జంపింగ్ రాగం ఆలపించారని.. తిరిగి 2019 ఎన్నికల వేళ.. లోటస్పాండ్లో జగన్ని కలిసి ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకున్నారని నెటిజన్లు .. జీవితా రాజశేఖర్ పోలిటికల్ హిస్టరీని కంఠస్తం చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంత కాలం సైలెంట్గా ఉండి.. తాజాగా మళ్లీ బీజేపీలోకి వచ్చారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. జీవితా రాజశేఖర్ ఇప్పటి వరకు అన్ని పార్టీల్లోకి ఇలా వెళ్లి... అలా వచ్చారని.. కానీ ఇక జీవితా రాజశేఖర్ భవిష్యత్తులో చేరే పార్టీ ఏదైనా ఉందంటే.. అది కేవలం కేఏ పాల్ స్థాపించిన ప్రజా శాంతి పార్టీనే అనే ఓ సెటైరికల్ టాక్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతిని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.
ఇలా పార్టీలో చేరగానే.. అలా పదవులు రావని.. పార్టీ స్థాపించిన నాటి నుంచి దశబ్దాలుగా పని చేసిన వారికే ఏ పదవి దక్కడం లేదని.. అలాంటి సమయంలో.. పార్టీలో చేరగానే.. పదవి రావాలంటే .. అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఓ నెట్జన్ జీవిత రాజకీయ వ్యవహర శైలిపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. మరి జీవితా రాజశేఖర్.. ఈ సారి అయిన బీజేపీలో నిలకడగా ఉంటారా? అంటే.. వేచి చూడాల్సిందే.
మరోవైపు సహజ నటి జయసుధతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆమెను కమలం పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. అందుకు ఆమె సానుకూలంగానే స్పందించి.. తనకు ఎమ్మెల్యే సీటు వద్దని... కానీ పార్టీలో చేరాలంటే.. కొన్ని కండిషన్లు పెట్టినట్లు సమాచారం. సదరు కండిషన్లపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడి చెబుతానని జయసుధతో ఈటల పేర్కొన్నట్లు తెలుస్తోంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jeevitha-rajasekhar-halchal-in-bjp-25-142869.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.