వైఎస్ విజయమ్మతో జేసీ భేటీ.. జగన్ కు షాకేగా?

Publish Date:Jul 29, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తల్లి వైఎస్ విజయమ్మతో తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకరరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ విమర్శకులలో జేసీ ప్రభాకరరెడ్డి ముందు వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే.  జగన్ హయాంలో జేసీ దివాకరరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి పలు విధాలుగా వేధిపులకు గురయ్యారు. జగన్ హయాంలో వారిపై పలు కేసులు నమోదుఅయ్యాయి. వారి ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సులను జగన్ సర్కార్ సీజ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ సంస్థ వ్యవహరిస్తోందంటూ పలు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డిలు  జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. 

కాగా ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్  ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు బనాయించారంటూ జేసీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఆ సందర్భంగా జగన్ పై వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారు.  ఈ నేపథ్యంలో జేసీ విజయమ్మల భేటీ రాజకీయంగా సంచలనానికి కారణమైంది. జేసీ సోమవారం (జులై 29) హైదరాబాద్  లోటస్ పాండ్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లి మరీ ఆమెతో భేటీ అయ్యారు. వీరి భేటీ అరగంటకు పైగా సాగింది. ఈ భేటీలో వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటి? అన్నది తెలియరాలేదు. జేసీ వర్గీయులు మాత్రం ఇది సాధారణ భేటీయేననీ, జేసీ విజయమ్మ ఆరోగ్యం, క్షేమ సమాచారాలను తెలుసుకున్నారని చెబుతున్నారు. గతంలో అంటే వైఎస్ హయాంలో జేసీ దివాకరరెడ్డి బ్రదర్ కాంగ్రెస్స్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలు కూడా ఉండేవి. ఆ పరిచయాలను పురస్కరించుకునే విజయమ్మను మర్యాదపూర్వకంగా జేసీ కలిశారని చెబుతున్నారు. 

ఈ భేటీ ఉద్దేశం ఏమిటన్నది పక్కన పెడితే.. విజయమ్మతో జేసీ భేటీ జగన్ కు మాత్రం గట్టి షాక్ గానే చెప్పాలి. తనకు బద్ధ శత్రువుగా మారిన చెల్లెలు షర్మిలకు మద్దతుగా విజయమ్మ నిలబడ్డారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత ఆమె ఏ సందర్భంలోనూ కూడా జగన్ కు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. షర్మిలకు అండగానే నిలిచారు. ఇటీవలి ఎన్నికలలో కూడా ఆమె అమెరికా నుంచి పంపిన సందేశంలో షర్మిలను గెలిపించాల్సిందిగా కోరారు తప్ప జగన్  గురించి మంచిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  జగన్ కు రాజకీయంగా ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ ముభావంగానే ఉంటూ వచ్చారు.

ఏవైనా కార్యక్రమాలలో అంటే వైఎస్ జయంతి, వర్థంతి వంటి కార్యక్రమాలకు హాజరై జగన్ ను హత్తుకుని ముద్దు పెట్టి ఫొటో దిగడానికే ఆమె పరిమితమయ్యారు. విజయమ్మ జగన్ కు దూరం కావడం కూడా ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఒక కారణంగా పరిశీలకులు విశ్లేషించారు.  ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి విజయమ్మతో భేటీ కావడం రాజకీయంగా జగన్ కు ఇబ్బందికరమైన అంశమే.   జగన్ కు అధికారం కోల్పోయి, అన్ని వైపుల నుంచీ సమస్యలు చుట్టుముడుతున్న తరుణంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా విజయమ్మతో జేపీ భేటీ కొత్త తలనొప్పికి కారణమౌతుందనడంలో సందేహం లేదు.   

By
en-us Political News

  
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.